వైసీపీ అధినేత జగన్కు రాజకీయ గురువుగా వ్యవహరించిన విశాఖ శారదా పీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి బోర్డు భారీ షాక్ ఇచ్చింది. తిరుమలలో శారదా పీఠానికి వైసీపీ హయాం లో కల్పించిన అన్ని వసతులను రద్దు చేసింది. అదేసమయంలో శారదా పీఠానికి తిరుమలలోని బేడీ ఆంజనేయ స్వామి ఆలయానికి ఎదురుగా కేటాయించిన స్థలం కూడా వెనక్కి తీసుకుంది. అలాగే.. శారదా పీఠం కోసం ఇచ్చిన లీజును కూడా రద్దు చేసింది. ఇక, ఎవరికీ లేని విధంగా శారదా పీఠాధిపతి స్వరూపానంద తిరుమలకు వస్తే.. కేబినెట్ ర్యాంకు హోదాతో ఆయనకు దర్శన ఏర్పాట్లు చేసేలా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా తాజాగా రద్దు చేశారు.
ఈ పరిణామాలతో శారదా పీఠానికి ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. వైసీపీ హయాంలో శారదా పీఠాధిపతి ఓ రేంజ్ రాజకీయాలు చేసిన విషయం తెలిసిందే. విశాఖలో భీమిలి తీరం వెంబడి 15 ఎకరాల స్థలాన్ని కూడా లీజుకు తీసుకున్నారు. అయితే.. ఇటీవలే చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆ లీజును రద్దు చేసి.. భూమిని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వంతు వచ్చింది. తాజాగా పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ఎక్కువగా చర్చించిన అంశం.. శారదాపీఠానికి భూములు, ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తూ.. వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలే కావడం గమనార్హం.
ఇతర.. నిర్ణయాలు ఇవీ..
This post was last modified on November 19, 2024 9:45 am
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…