వైసీపీ అధినేత జగన్కు రాజకీయ గురువుగా వ్యవహరించిన విశాఖ శారదా పీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి బోర్డు భారీ షాక్ ఇచ్చింది. తిరుమలలో శారదా పీఠానికి వైసీపీ హయాం లో కల్పించిన అన్ని వసతులను రద్దు చేసింది. అదేసమయంలో శారదా పీఠానికి తిరుమలలోని బేడీ ఆంజనేయ స్వామి ఆలయానికి ఎదురుగా కేటాయించిన స్థలం కూడా వెనక్కి తీసుకుంది. అలాగే.. శారదా పీఠం కోసం ఇచ్చిన లీజును కూడా రద్దు చేసింది. ఇక, ఎవరికీ లేని విధంగా శారదా పీఠాధిపతి స్వరూపానంద తిరుమలకు వస్తే.. కేబినెట్ ర్యాంకు హోదాతో ఆయనకు దర్శన ఏర్పాట్లు చేసేలా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా తాజాగా రద్దు చేశారు.
ఈ పరిణామాలతో శారదా పీఠానికి ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. వైసీపీ హయాంలో శారదా పీఠాధిపతి ఓ రేంజ్ రాజకీయాలు చేసిన విషయం తెలిసిందే. విశాఖలో భీమిలి తీరం వెంబడి 15 ఎకరాల స్థలాన్ని కూడా లీజుకు తీసుకున్నారు. అయితే.. ఇటీవలే చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆ లీజును రద్దు చేసి.. భూమిని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వంతు వచ్చింది. తాజాగా పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ఎక్కువగా చర్చించిన అంశం.. శారదాపీఠానికి భూములు, ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తూ.. వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలే కావడం గమనార్హం.
ఇతర.. నిర్ణయాలు ఇవీ..
This post was last modified on November 19, 2024 9:45 am
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…