వైసీపీ అధినేత జగన్కు రాజకీయ గురువుగా వ్యవహరించిన విశాఖ శారదా పీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి బోర్డు భారీ షాక్ ఇచ్చింది. తిరుమలలో శారదా పీఠానికి వైసీపీ హయాం లో కల్పించిన అన్ని వసతులను రద్దు చేసింది. అదేసమయంలో శారదా పీఠానికి తిరుమలలోని బేడీ ఆంజనేయ స్వామి ఆలయానికి ఎదురుగా కేటాయించిన స్థలం కూడా వెనక్కి తీసుకుంది. అలాగే.. శారదా పీఠం కోసం ఇచ్చిన లీజును కూడా రద్దు చేసింది. ఇక, ఎవరికీ లేని విధంగా శారదా పీఠాధిపతి స్వరూపానంద తిరుమలకు వస్తే.. కేబినెట్ ర్యాంకు హోదాతో ఆయనకు దర్శన ఏర్పాట్లు చేసేలా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా తాజాగా రద్దు చేశారు.
ఈ పరిణామాలతో శారదా పీఠానికి ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. వైసీపీ హయాంలో శారదా పీఠాధిపతి ఓ రేంజ్ రాజకీయాలు చేసిన విషయం తెలిసిందే. విశాఖలో భీమిలి తీరం వెంబడి 15 ఎకరాల స్థలాన్ని కూడా లీజుకు తీసుకున్నారు. అయితే.. ఇటీవలే చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆ లీజును రద్దు చేసి.. భూమిని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వంతు వచ్చింది. తాజాగా పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ఎక్కువగా చర్చించిన అంశం.. శారదాపీఠానికి భూములు, ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తూ.. వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలే కావడం గమనార్హం.
ఇతర.. నిర్ణయాలు ఇవీ..
This post was last modified on November 19, 2024 9:45 am
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…