వైసీపీ అధినేత జగన్కు రాజకీయ గురువుగా వ్యవహరించిన విశాఖ శారదా పీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి బోర్డు భారీ షాక్ ఇచ్చింది. తిరుమలలో శారదా పీఠానికి వైసీపీ హయాం లో కల్పించిన అన్ని వసతులను రద్దు చేసింది. అదేసమయంలో శారదా పీఠానికి తిరుమలలోని బేడీ ఆంజనేయ స్వామి ఆలయానికి ఎదురుగా కేటాయించిన స్థలం కూడా వెనక్కి తీసుకుంది. అలాగే.. శారదా పీఠం కోసం ఇచ్చిన లీజును కూడా రద్దు చేసింది. ఇక, ఎవరికీ లేని విధంగా శారదా పీఠాధిపతి స్వరూపానంద తిరుమలకు వస్తే.. కేబినెట్ ర్యాంకు హోదాతో ఆయనకు దర్శన ఏర్పాట్లు చేసేలా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా తాజాగా రద్దు చేశారు.
ఈ పరిణామాలతో శారదా పీఠానికి ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. వైసీపీ హయాంలో శారదా పీఠాధిపతి ఓ రేంజ్ రాజకీయాలు చేసిన విషయం తెలిసిందే. విశాఖలో భీమిలి తీరం వెంబడి 15 ఎకరాల స్థలాన్ని కూడా లీజుకు తీసుకున్నారు. అయితే.. ఇటీవలే చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆ లీజును రద్దు చేసి.. భూమిని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వంతు వచ్చింది. తాజాగా పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ఎక్కువగా చర్చించిన అంశం.. శారదాపీఠానికి భూములు, ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తూ.. వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలే కావడం గమనార్హం.
ఇతర.. నిర్ణయాలు ఇవీ..
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…
టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న బ్యూటీ రెజీనా కసాండ్రా లేటెస్ట్ గా నెట్టింట…
ఇంకో అయిదు రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. జూలై 10 కోసం అక్కినేని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్…
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్ అడ్డంకులు రావడం సహజం. ఒక్కోసారి నెలలు సంవత్సరాల తరబడి రిలీజులు ఆగిపోతాయి. కానీ ఓటిటిలో…
టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సోషల్ మీడియాలో ఆయనకున్న పాపులారిటీనే వేరు. ప్రస్తుతం…