Political News

ఎంత మంది పిల్ల‌లున్నా.. ఎన్నిక‌ల్లో పోటీకి ఓకే

ఏపీ పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు శాస‌న స‌భ ఆమోదం తెలిపింది. దీని ప్ర‌కారం పంచాయ‌తీలు, న‌గ‌ర పాల‌క సంస్థ‌లు, కార్పొరేష‌న్ల‌లో పోటీ చేసే వారికి వెసులు బాటు క‌ల్పించ‌నున్నారు. అంటే ఎన్నికల‌కు సంబంధించిన నిబంధన లు మారనున్నాయి. చట్ట సవరణ ప్రకారం ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని అనుకున్న అభ్య‌ర్థులకు ఎంత మంది పిల్లలున్నా పోటీ చేసే అవకాశం ఉంటుంది. మ‌రీ ముఖ్యంగా పంచాయ‌తీ ఎన్నిక‌లకు సంబంధించి ఈ స‌వ‌ర‌ణ గ్రామీణ ప్రాంతాల‌కు వ‌రంగా మార‌నుంది. ఈ స‌వ‌ర‌ణ బిల్లును తాజాగా సోమ‌వారం నాటి అసెంబ్లీలో ఆమోదించారు.

మంత్రి పొంగూరు నారాయ‌ణ ప్ర‌వేశ పెట్టిన ఈ బిల్లును స‌భ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం.. దీనిని శాస‌న మండ‌లి కి పంపించ‌నున్నారు. అక్క‌డ కూడా ఆమోదం పొందితే(ప్ర‌స్తుతం వైసీపీ స‌భ్యుల సంఖ్య ఎక్కువ‌గా ఉంది) ఆ త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్‌కు పంపించ‌నున్నారు. గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలిపిన వెంట‌నే ఇది చ‌ట్ట‌రూపం దాల్చ‌నుంది. అత్యంత కీల‌కంగా మార‌నున్న ఈ చ‌ట్ట స‌వ‌ర‌ణ అంశంపై స‌భ్యులు ఏక‌గ్రీవ ఆమోదం తెల‌ప‌డం గ‌మ‌నార్హం. నిజానికి వైసీపీ హ‌యాంలోనే ఈ బిల్లును తీసుకువ‌చ్చారు. అయితే.. ఎన్నిక‌ల‌కు ముందు తీసుకువ‌చ్చిన బిల్లు కావ‌డంతో ఇది నిలిచిపోయింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న విధానం ఏంటి?

పంచాయ‌తీలు, మునిసిపాలిటీల్లో పోటీ చేయాల‌ని భావించే వారికి కొన్ని చ‌ట్ట నిబంధ‌న‌లు ఉన్నాయి. పంచాయ‌తీ రాజ్ చ‌ట్టం ప్ర‌కారం.. ప‌ల్లెల్లో ముగ్గురుక‌న్నా ఎక్కువ మంది పిల్ల‌లు ఉన్న‌వారు ఎన్నిక‌ల్లో పోటీకి అన‌ర్హులుగా మారుతారు. ఇక‌, మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లోనూ ఇదే త‌ర‌హా చ‌ట్టం ఉన్నా.. పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. అయితే.. గ్రామీణ ప్రాంతాల‌కు కేంద్రం నుంచి నిధులు వ‌చ్చే అవ‌కాశం ఉన్నందున అక్క‌డ మాత్రం ప‌క్కాగా పంచాయ‌తీ చ‌ట్టం అమ‌లు చేస్తున్నారు. దీనివ‌ల్ల అనేక మందికి రాజ‌కీయంగా అవ‌కాశం ల‌భించ‌డం లేద‌న్న విమ‌ర్శ ఉంది. దీనిని 1950ల‌లోనే చేయ‌డం గ‌మ‌నార్హం.

గ్రామీణ ప్రాంతాల్లో జ‌నాభాను నియంత్రించ‌డం కోసం తీసుకువ‌చ్చిన చ‌ట్టంగా దీనిపై చ‌ర్చ ఉంది. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్రంలో జ‌నాభా వృద్ధి రేటును పెంచాల‌ని నిర్ణ‌యించుకున్న ద‌రిమిలా.. ఈ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేసింది. త‌ద్వారా జ‌నాభా ప్రాతిప‌దిక‌న కేంద్రం నుంచి వ‌చ్చే ప‌న్నుల్లో వాటా ఏపీకి మ‌రింత పెర‌గ‌నుంది. అదేవిధంగా 30 ఏళ్ల త‌ర్వాత‌.. వృద్ధ జ‌నాభా పెరిగినా.. దానికి స‌మాంత‌రంగా యువ జ‌నాభా అందుబాటులోకి వ‌స్తుంద‌న్న‌ది స‌ర్కారు ఆలోచ‌న‌. ఈ నేప‌థ్యంలోనే చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేయ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

1 hour ago

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్…

2 hours ago

జగన్.. బాలయ్య సాయం కోరిన వేళ..!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…

2 hours ago

డీఎస్సీపై గగ్గోలు… నీట్‌పై మౌనం..?

"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…

3 hours ago

వంద దేవుళ్ళు తల్లిది పెద్ద టాలెంటే

ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…

3 hours ago

వింటేజ్ హీరో నెక్స్ట్ ఏం చేయబోతున్నారో

కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…

6 hours ago