Political News

జనసేన మహిళా ఎమ్మెల్యేకు అయ్యన్న క్లాస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికారులు తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. సభా సమయంలో అధికారులు తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీలో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలన్న నేపథ్యంలో అధికారులు ఇచ్చిన నివేదికలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని అయ్యన్న ఫైర్ అయ్యారు. అంతేకాకుండా తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.

ఒక అధికారిపై చర్యలు తీసుకుంటే మిగిలిన అధికారులు దారికి వస్తారని అయ్యన్న వ్యాఖ్యానించారు. ఇటువంటి పద్ధతులను అధికారులు మార్చుకోవాలని అయన వార్నింగ్ ఇచ్చారు. జగనన్న కాలనీలలోని ఇళ్లపై పూర్తి విచారణ చేయాలని చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారని సభలో మంత్రి పార్థసారథి వెల్లడించారు. అక్కడ డిపార్ట్మెంట్ తో పాటు విజిలెన్స్ విచారణ కూడా కొనసాగుతుందని అన్నారు. సభ్యులు సూచనలు ఇస్తే కాంట్రాక్టర్లను మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇక, అక్కడ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదని ఎమ్మెల్యే గణబాబు అన్నారు.

కాగా, సభలో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి మాట్లాడుతున్న సమయంలో అయ్యన్న పాత్రుడు కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఒక ప్రశ్నను చాలాసేపు చెబుతూ ఉంటే మంత్రులు నోట్ చేసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుందని అయ్యన్న అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, తాను ప్రశ్నను రెండు భాగాలుగా చేశానని, కానీ, ఒక ప్రశ్న మాత్రమే లిస్ట్ అయిందని మాధవి అన్నారు. త్వరగా ఐదు పాయింట్లు చెప్పి ముగిస్తానని అన్నారు. అసెంబ్లీలో రఘురామ, జ్యోతుల నెహ్రూ..అయ్యన్న, కూన రవికుమార్ ల మధ్య కూడా ఇదే తరహాలో డిస్కషన్ జరిగిన సంగతి తెలిసిందే. జనసేన మహిళా ఎమ్మెల్యే లోకం మాధవికి అయ్యన్న క్లాస్ పీకిన వైనం ఈ రోజు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

This post was last modified on November 19, 2024 9:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago