ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికారులు తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. సభా సమయంలో అధికారులు తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీలో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలన్న నేపథ్యంలో అధికారులు ఇచ్చిన నివేదికలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని అయ్యన్న ఫైర్ అయ్యారు. అంతేకాకుండా తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.
ఒక అధికారిపై చర్యలు తీసుకుంటే మిగిలిన అధికారులు దారికి వస్తారని అయ్యన్న వ్యాఖ్యానించారు. ఇటువంటి పద్ధతులను అధికారులు మార్చుకోవాలని అయన వార్నింగ్ ఇచ్చారు. జగనన్న కాలనీలలోని ఇళ్లపై పూర్తి విచారణ చేయాలని చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారని సభలో మంత్రి పార్థసారథి వెల్లడించారు. అక్కడ డిపార్ట్మెంట్ తో పాటు విజిలెన్స్ విచారణ కూడా కొనసాగుతుందని అన్నారు. సభ్యులు సూచనలు ఇస్తే కాంట్రాక్టర్లను మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇక, అక్కడ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదని ఎమ్మెల్యే గణబాబు అన్నారు.
కాగా, సభలో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి మాట్లాడుతున్న సమయంలో అయ్యన్న పాత్రుడు కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఒక ప్రశ్నను చాలాసేపు చెబుతూ ఉంటే మంత్రులు నోట్ చేసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుందని అయ్యన్న అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, తాను ప్రశ్నను రెండు భాగాలుగా చేశానని, కానీ, ఒక ప్రశ్న మాత్రమే లిస్ట్ అయిందని మాధవి అన్నారు. త్వరగా ఐదు పాయింట్లు చెప్పి ముగిస్తానని అన్నారు. అసెంబ్లీలో రఘురామ, జ్యోతుల నెహ్రూ..అయ్యన్న, కూన రవికుమార్ ల మధ్య కూడా ఇదే తరహాలో డిస్కషన్ జరిగిన సంగతి తెలిసిందే. జనసేన మహిళా ఎమ్మెల్యే లోకం మాధవికి అయ్యన్న క్లాస్ పీకిన వైనం ఈ రోజు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
This post was last modified on November 19, 2024 9:35 am
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…