Political News

జనసేన మహిళా ఎమ్మెల్యేకు అయ్యన్న క్లాస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికారులు తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. సభా సమయంలో అధికారులు తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీలో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలన్న నేపథ్యంలో అధికారులు ఇచ్చిన నివేదికలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని అయ్యన్న ఫైర్ అయ్యారు. అంతేకాకుండా తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.

ఒక అధికారిపై చర్యలు తీసుకుంటే మిగిలిన అధికారులు దారికి వస్తారని అయ్యన్న వ్యాఖ్యానించారు. ఇటువంటి పద్ధతులను అధికారులు మార్చుకోవాలని అయన వార్నింగ్ ఇచ్చారు. జగనన్న కాలనీలలోని ఇళ్లపై పూర్తి విచారణ చేయాలని చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారని సభలో మంత్రి పార్థసారథి వెల్లడించారు. అక్కడ డిపార్ట్మెంట్ తో పాటు విజిలెన్స్ విచారణ కూడా కొనసాగుతుందని అన్నారు. సభ్యులు సూచనలు ఇస్తే కాంట్రాక్టర్లను మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇక, అక్కడ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదని ఎమ్మెల్యే గణబాబు అన్నారు.

కాగా, సభలో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి మాట్లాడుతున్న సమయంలో అయ్యన్న పాత్రుడు కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఒక ప్రశ్నను చాలాసేపు చెబుతూ ఉంటే మంత్రులు నోట్ చేసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుందని అయ్యన్న అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, తాను ప్రశ్నను రెండు భాగాలుగా చేశానని, కానీ, ఒక ప్రశ్న మాత్రమే లిస్ట్ అయిందని మాధవి అన్నారు. త్వరగా ఐదు పాయింట్లు చెప్పి ముగిస్తానని అన్నారు. అసెంబ్లీలో రఘురామ, జ్యోతుల నెహ్రూ..అయ్యన్న, కూన రవికుమార్ ల మధ్య కూడా ఇదే తరహాలో డిస్కషన్ జరిగిన సంగతి తెలిసిందే. జనసేన మహిళా ఎమ్మెల్యే లోకం మాధవికి అయ్యన్న క్లాస్ పీకిన వైనం ఈ రోజు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

This post was last modified on November 19, 2024 9:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

త్రివిక్రమ్ స్టయిల్లో వెంకీ అట్లూరి

సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్‌గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…

13 minutes ago

చిరు సినిమా… చేతులు మారుతుందా?

సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్‌కు…

38 minutes ago

ల‌డ్డూ ఎఫెక్ట్‌: టీటీడీ ఈవో సింఘాల్‌పై చ‌ర్య‌లు

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగం వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. ఈ క‌ల్తీ వ్య‌వ‌హారంపై విచార‌ణ…

58 minutes ago

బ‌డ్జెట్ స‌మావేశాల‌ కోసం అసెంబ్లీకి జ‌గ‌న్‌.. ?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. పార్టీ వ‌ర్గాలతో చ‌ర్చ‌లు జ‌రిపిన ఆయ‌న‌..…

4 hours ago

ఫ్యాన్స్ సంతోషం సరే… ఇది తప్పు కదా?

మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో…

4 hours ago

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

7 hours ago