ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికారులు తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. సభా సమయంలో అధికారులు తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీలో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలన్న నేపథ్యంలో అధికారులు ఇచ్చిన నివేదికలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని అయ్యన్న ఫైర్ అయ్యారు. అంతేకాకుండా తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.
ఒక అధికారిపై చర్యలు తీసుకుంటే మిగిలిన అధికారులు దారికి వస్తారని అయ్యన్న వ్యాఖ్యానించారు. ఇటువంటి పద్ధతులను అధికారులు మార్చుకోవాలని అయన వార్నింగ్ ఇచ్చారు. జగనన్న కాలనీలలోని ఇళ్లపై పూర్తి విచారణ చేయాలని చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారని సభలో మంత్రి పార్థసారథి వెల్లడించారు. అక్కడ డిపార్ట్మెంట్ తో పాటు విజిలెన్స్ విచారణ కూడా కొనసాగుతుందని అన్నారు. సభ్యులు సూచనలు ఇస్తే కాంట్రాక్టర్లను మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇక, అక్కడ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదని ఎమ్మెల్యే గణబాబు అన్నారు.
కాగా, సభలో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి మాట్లాడుతున్న సమయంలో అయ్యన్న పాత్రుడు కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఒక ప్రశ్నను చాలాసేపు చెబుతూ ఉంటే మంత్రులు నోట్ చేసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుందని అయ్యన్న అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, తాను ప్రశ్నను రెండు భాగాలుగా చేశానని, కానీ, ఒక ప్రశ్న మాత్రమే లిస్ట్ అయిందని మాధవి అన్నారు. త్వరగా ఐదు పాయింట్లు చెప్పి ముగిస్తానని అన్నారు. అసెంబ్లీలో రఘురామ, జ్యోతుల నెహ్రూ..అయ్యన్న, కూన రవికుమార్ ల మధ్య కూడా ఇదే తరహాలో డిస్కషన్ జరిగిన సంగతి తెలిసిందే. జనసేన మహిళా ఎమ్మెల్యే లోకం మాధవికి అయ్యన్న క్లాస్ పీకిన వైనం ఈ రోజు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
This post was last modified on November 19, 2024 9:35 am
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…