Political News

వైసీపీ రాబందుల ప‌నిప‌డ‌తాం: మంత్రి అన‌గాని వార్నింగ్‌

ఏపీ రెవెన్యూ మంత్రి అన‌గాని స‌త్య‌ప్రసాద్‌.. అసెంబ్లీలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ నేత‌ల‌ను ఆయ‌న రాబందుల‌తో పోల్చారు. రాబందుల ప‌నిప‌డ‌తాం అని హెచ్చ‌రించారు. ఏపీ అసెంబ్లీలో సోమవారం కార్య‌క‌లాపాలు ప్రారంభం అవుతూనే జ‌గ‌న్ పాల‌నా కాలంలో పేద‌ల‌కు ఇచ్చిన ఇళ్ల వ్య‌వ‌హారంపై చ‌ర్చ సాగింది. జ‌గ‌న‌న్న ఇళ్లు పేరుతో పేద‌ల‌కు అప్ప‌ట్లో భూములు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం భూములు కొనుగోలు చేసింది.

ఈ క్ర‌మంలో భారీ అవినీతి జ‌రిగింద‌ని.. ప్ర‌భుత్వం భూములు కొంటుంద‌ని తెలిసిన వైసీపీ నాయ‌కులు ముందుగానే భూములు కొనేసి.. త‌ర్వాత వాటిని ప్ర‌భుత్వానికి అమ్మి భారీ ఎత్తున సొమ్ములు చేసుకున్నా ర‌ని టీడీపీ స‌భ్యులు గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి స‌హా ప‌లువురు స‌భ దృష్టి కి తెచ్చారు. ఈ సంద‌ర్భంగా రెవెన్యూ మంత్రి అన‌గాని స‌త్య‌ప్రసాద్ మాట్లాడుతూ.. పేద‌ల పేరుతో వైసీపీ నేత‌లు రాబందులుగా మారి.. ప్ర‌భుత్వ సొమ్మును దోచేశార‌ని వ్యాఖ్యానించారు.

అసైన్డ్ భూములు కూడా త‌క్కువ ధ‌ర‌ల‌కు కొనేసి ప్ర‌భుత్వానికి అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యించార‌ని తెలిపారు. 9 లక్షల పైచీలుకు అసైన్డ్ భూముల్లో వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయన్నారు.రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు పెట్టి అభ్యంతరాలపై చర్చిస్తామ‌ని తెలిపారు. భూములు దోచుకున్న వైసీపీ రాబందులపై చర్యలు తప్పువని కూడా మంత్రి అన‌గాని హెచ్చ‌రించారు. అదేస‌మ‌యంలో తప్పుచేసిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామ‌ని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.

చిత్రం ఏంటంటే.. స‌భ‌లో వైసీపీ ఎమ్మెల్యేలు లేక‌పోయినా.. ఒక‌రిద్ద‌రు టీడీపీ నాయ‌కులే విప‌క్ష పాత్ర పోషించారు. ఎక్క‌డెక్క‌డ ఎలాంటి త‌ప్పులు జ‌రిగాయో మంత్రి వివ‌రించాల‌ని వారు కోరారు. దీంతో స‌భ‌లో ఒక్క‌సారిగా ఆశ్చ‌క‌ర వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. దీంతో మంత్రి.. ఆయా వివ‌రాల‌ను జిల్లాల వారీగా వివ‌రించారు. అన్న‌మ‌య్య‌, చిత్తూరు, అనంత‌పురం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో భూముల అక్ర‌మాలు ఎక్కువ‌గా జ‌రిగాయ‌ని చెప్పారు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

వివేకా మ‌ర్ద‌ర్: డీఎస్పీ స‌హా అధికారుల‌పై కేసులు!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసు లో తాజాగా…

13 minutes ago

జాంబిరెడ్డి – 2 : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాదా?

గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…

16 minutes ago

ఏందిది మ‌ల్లన్నా.. స్వ‌ప‌క్షంలో విప‌క్షమా?

మాట‌ల మాంత్రికుడు.. సోష‌ల్ మీడియాలో దుమ్మురేపి.. ప్ర‌స్తుతం ప్ర‌జాప్ర‌తినిధిగా శాస‌న‌ మండ‌లిలో ఉన్న తీన్మార్ మ‌ల్ల‌న్న త‌న వాయిస్ ద్వారా…

19 minutes ago

ఆమె లేకుండా మంగళవారం – 2?

‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…

1 hour ago

నెరవేరిన కల..విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు

విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో…

1 hour ago

ట్రంప్ న్యూ ట్విస్ట్: గాజా భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన…

1 hour ago