Political News

వైసీపీ రాబందుల ప‌నిప‌డ‌తాం: మంత్రి అన‌గాని వార్నింగ్‌

ఏపీ రెవెన్యూ మంత్రి అన‌గాని స‌త్య‌ప్రసాద్‌.. అసెంబ్లీలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ నేత‌ల‌ను ఆయ‌న రాబందుల‌తో పోల్చారు. రాబందుల ప‌నిప‌డ‌తాం అని హెచ్చ‌రించారు. ఏపీ అసెంబ్లీలో సోమవారం కార్య‌క‌లాపాలు ప్రారంభం అవుతూనే జ‌గ‌న్ పాల‌నా కాలంలో పేద‌ల‌కు ఇచ్చిన ఇళ్ల వ్య‌వ‌హారంపై చ‌ర్చ సాగింది. జ‌గ‌న‌న్న ఇళ్లు పేరుతో పేద‌ల‌కు అప్ప‌ట్లో భూములు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం భూములు కొనుగోలు చేసింది.

ఈ క్ర‌మంలో భారీ అవినీతి జ‌రిగింద‌ని.. ప్ర‌భుత్వం భూములు కొంటుంద‌ని తెలిసిన వైసీపీ నాయ‌కులు ముందుగానే భూములు కొనేసి.. త‌ర్వాత వాటిని ప్ర‌భుత్వానికి అమ్మి భారీ ఎత్తున సొమ్ములు చేసుకున్నా ర‌ని టీడీపీ స‌భ్యులు గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి స‌హా ప‌లువురు స‌భ దృష్టి కి తెచ్చారు. ఈ సంద‌ర్భంగా రెవెన్యూ మంత్రి అన‌గాని స‌త్య‌ప్రసాద్ మాట్లాడుతూ.. పేద‌ల పేరుతో వైసీపీ నేత‌లు రాబందులుగా మారి.. ప్ర‌భుత్వ సొమ్మును దోచేశార‌ని వ్యాఖ్యానించారు.

అసైన్డ్ భూములు కూడా త‌క్కువ ధ‌ర‌ల‌కు కొనేసి ప్ర‌భుత్వానికి అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యించార‌ని తెలిపారు. 9 లక్షల పైచీలుకు అసైన్డ్ భూముల్లో వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయన్నారు.రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు పెట్టి అభ్యంతరాలపై చర్చిస్తామ‌ని తెలిపారు. భూములు దోచుకున్న వైసీపీ రాబందులపై చర్యలు తప్పువని కూడా మంత్రి అన‌గాని హెచ్చ‌రించారు. అదేస‌మ‌యంలో తప్పుచేసిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామ‌ని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.

చిత్రం ఏంటంటే.. స‌భ‌లో వైసీపీ ఎమ్మెల్యేలు లేక‌పోయినా.. ఒక‌రిద్ద‌రు టీడీపీ నాయ‌కులే విప‌క్ష పాత్ర పోషించారు. ఎక్క‌డెక్క‌డ ఎలాంటి త‌ప్పులు జ‌రిగాయో మంత్రి వివ‌రించాల‌ని వారు కోరారు. దీంతో స‌భ‌లో ఒక్క‌సారిగా ఆశ్చ‌క‌ర వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. దీంతో మంత్రి.. ఆయా వివ‌రాల‌ను జిల్లాల వారీగా వివ‌రించారు. అన్న‌మ‌య్య‌, చిత్తూరు, అనంత‌పురం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో భూముల అక్ర‌మాలు ఎక్కువ‌గా జ‌రిగాయ‌ని చెప్పారు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

8 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

10 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

10 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

11 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

11 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

13 hours ago