ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్.. అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలను ఆయన రాబందులతో పోల్చారు. రాబందుల పనిపడతాం అని హెచ్చరించారు. ఏపీ అసెంబ్లీలో సోమవారం కార్యకలాపాలు ప్రారంభం అవుతూనే జగన్ పాలనా కాలంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల వ్యవహారంపై చర్చ సాగింది. జగనన్న ఇళ్లు పేరుతో పేదలకు అప్పట్లో భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం భూములు కొనుగోలు చేసింది.
ఈ క్రమంలో భారీ అవినీతి జరిగిందని.. ప్రభుత్వం భూములు కొంటుందని తెలిసిన వైసీపీ నాయకులు ముందుగానే భూములు కొనేసి.. తర్వాత వాటిని ప్రభుత్వానికి అమ్మి భారీ ఎత్తున సొమ్ములు చేసుకున్నా రని టీడీపీ సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహా పలువురు సభ దృష్టి కి తెచ్చారు. ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. పేదల పేరుతో వైసీపీ నేతలు రాబందులుగా మారి.. ప్రభుత్వ సొమ్మును దోచేశారని వ్యాఖ్యానించారు.
అసైన్డ్ భూములు కూడా తక్కువ ధరలకు కొనేసి ప్రభుత్వానికి అధిక ధరలకు విక్రయించారని తెలిపారు. 9 లక్షల పైచీలుకు అసైన్డ్ భూముల్లో వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయన్నారు.రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు పెట్టి అభ్యంతరాలపై చర్చిస్తామని తెలిపారు. భూములు దోచుకున్న వైసీపీ రాబందులపై చర్యలు తప్పువని కూడా మంత్రి అనగాని హెచ్చరించారు. అదేసమయంలో తప్పుచేసిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.
చిత్రం ఏంటంటే.. సభలో వైసీపీ ఎమ్మెల్యేలు లేకపోయినా.. ఒకరిద్దరు టీడీపీ నాయకులే విపక్ష పాత్ర పోషించారు. ఎక్కడెక్కడ ఎలాంటి తప్పులు జరిగాయో మంత్రి వివరించాలని వారు కోరారు. దీంతో సభలో ఒక్కసారిగా ఆశ్చకర వాతావరణం ఏర్పడింది. దీంతో మంత్రి.. ఆయా వివరాలను జిల్లాల వారీగా వివరించారు. అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో భూముల అక్రమాలు ఎక్కువగా జరిగాయని చెప్పారు.
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…