Political News

వైసీపీ రాబందుల ప‌నిప‌డ‌తాం: మంత్రి అన‌గాని వార్నింగ్‌

ఏపీ రెవెన్యూ మంత్రి అన‌గాని స‌త్య‌ప్రసాద్‌.. అసెంబ్లీలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ నేత‌ల‌ను ఆయ‌న రాబందుల‌తో పోల్చారు. రాబందుల ప‌నిప‌డ‌తాం అని హెచ్చ‌రించారు. ఏపీ అసెంబ్లీలో సోమవారం కార్య‌క‌లాపాలు ప్రారంభం అవుతూనే జ‌గ‌న్ పాల‌నా కాలంలో పేద‌ల‌కు ఇచ్చిన ఇళ్ల వ్య‌వ‌హారంపై చ‌ర్చ సాగింది. జ‌గ‌న‌న్న ఇళ్లు పేరుతో పేద‌ల‌కు అప్ప‌ట్లో భూములు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం భూములు కొనుగోలు చేసింది.

ఈ క్ర‌మంలో భారీ అవినీతి జ‌రిగింద‌ని.. ప్ర‌భుత్వం భూములు కొంటుంద‌ని తెలిసిన వైసీపీ నాయ‌కులు ముందుగానే భూములు కొనేసి.. త‌ర్వాత వాటిని ప్ర‌భుత్వానికి అమ్మి భారీ ఎత్తున సొమ్ములు చేసుకున్నా ర‌ని టీడీపీ స‌భ్యులు గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి స‌హా ప‌లువురు స‌భ దృష్టి కి తెచ్చారు. ఈ సంద‌ర్భంగా రెవెన్యూ మంత్రి అన‌గాని స‌త్య‌ప్రసాద్ మాట్లాడుతూ.. పేద‌ల పేరుతో వైసీపీ నేత‌లు రాబందులుగా మారి.. ప్ర‌భుత్వ సొమ్మును దోచేశార‌ని వ్యాఖ్యానించారు.

అసైన్డ్ భూములు కూడా త‌క్కువ ధ‌ర‌ల‌కు కొనేసి ప్ర‌భుత్వానికి అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యించార‌ని తెలిపారు. 9 లక్షల పైచీలుకు అసైన్డ్ భూముల్లో వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయన్నారు.రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు పెట్టి అభ్యంతరాలపై చర్చిస్తామ‌ని తెలిపారు. భూములు దోచుకున్న వైసీపీ రాబందులపై చర్యలు తప్పువని కూడా మంత్రి అన‌గాని హెచ్చ‌రించారు. అదేస‌మ‌యంలో తప్పుచేసిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామ‌ని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.

చిత్రం ఏంటంటే.. స‌భ‌లో వైసీపీ ఎమ్మెల్యేలు లేక‌పోయినా.. ఒక‌రిద్ద‌రు టీడీపీ నాయ‌కులే విప‌క్ష పాత్ర పోషించారు. ఎక్క‌డెక్క‌డ ఎలాంటి త‌ప్పులు జ‌రిగాయో మంత్రి వివ‌రించాల‌ని వారు కోరారు. దీంతో స‌భ‌లో ఒక్క‌సారిగా ఆశ్చ‌క‌ర వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. దీంతో మంత్రి.. ఆయా వివ‌రాల‌ను జిల్లాల వారీగా వివ‌రించారు. అన్న‌మ‌య్య‌, చిత్తూరు, అనంత‌పురం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో భూముల అక్ర‌మాలు ఎక్కువ‌గా జ‌రిగాయ‌ని చెప్పారు.

Share

Recent Posts

పాతిక రోజుల్లో ఇరుముడి… ఏదీ సందడి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…

2 hours ago

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

3 hours ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

4 hours ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

4 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

8 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

15 hours ago