Political News

వైసీపీ రాబందుల ప‌నిప‌డ‌తాం: మంత్రి అన‌గాని వార్నింగ్‌

ఏపీ రెవెన్యూ మంత్రి అన‌గాని స‌త్య‌ప్రసాద్‌.. అసెంబ్లీలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ నేత‌ల‌ను ఆయ‌న రాబందుల‌తో పోల్చారు. రాబందుల ప‌నిప‌డ‌తాం అని హెచ్చ‌రించారు. ఏపీ అసెంబ్లీలో సోమవారం కార్య‌క‌లాపాలు ప్రారంభం అవుతూనే జ‌గ‌న్ పాల‌నా కాలంలో పేద‌ల‌కు ఇచ్చిన ఇళ్ల వ్య‌వ‌హారంపై చ‌ర్చ సాగింది. జ‌గ‌న‌న్న ఇళ్లు పేరుతో పేద‌ల‌కు అప్ప‌ట్లో భూములు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం భూములు కొనుగోలు చేసింది.

ఈ క్ర‌మంలో భారీ అవినీతి జ‌రిగింద‌ని.. ప్ర‌భుత్వం భూములు కొంటుంద‌ని తెలిసిన వైసీపీ నాయ‌కులు ముందుగానే భూములు కొనేసి.. త‌ర్వాత వాటిని ప్ర‌భుత్వానికి అమ్మి భారీ ఎత్తున సొమ్ములు చేసుకున్నా ర‌ని టీడీపీ స‌భ్యులు గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి స‌హా ప‌లువురు స‌భ దృష్టి కి తెచ్చారు. ఈ సంద‌ర్భంగా రెవెన్యూ మంత్రి అన‌గాని స‌త్య‌ప్రసాద్ మాట్లాడుతూ.. పేద‌ల పేరుతో వైసీపీ నేత‌లు రాబందులుగా మారి.. ప్ర‌భుత్వ సొమ్మును దోచేశార‌ని వ్యాఖ్యానించారు.

అసైన్డ్ భూములు కూడా త‌క్కువ ధ‌ర‌ల‌కు కొనేసి ప్ర‌భుత్వానికి అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యించార‌ని తెలిపారు. 9 లక్షల పైచీలుకు అసైన్డ్ భూముల్లో వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయన్నారు.రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు పెట్టి అభ్యంతరాలపై చర్చిస్తామ‌ని తెలిపారు. భూములు దోచుకున్న వైసీపీ రాబందులపై చర్యలు తప్పువని కూడా మంత్రి అన‌గాని హెచ్చ‌రించారు. అదేస‌మ‌యంలో తప్పుచేసిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామ‌ని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.

చిత్రం ఏంటంటే.. స‌భ‌లో వైసీపీ ఎమ్మెల్యేలు లేక‌పోయినా.. ఒక‌రిద్ద‌రు టీడీపీ నాయ‌కులే విప‌క్ష పాత్ర పోషించారు. ఎక్క‌డెక్క‌డ ఎలాంటి త‌ప్పులు జ‌రిగాయో మంత్రి వివ‌రించాల‌ని వారు కోరారు. దీంతో స‌భ‌లో ఒక్క‌సారిగా ఆశ్చ‌క‌ర వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. దీంతో మంత్రి.. ఆయా వివ‌రాల‌ను జిల్లాల వారీగా వివ‌రించారు. అన్న‌మ‌య్య‌, చిత్తూరు, అనంత‌పురం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో భూముల అక్ర‌మాలు ఎక్కువ‌గా జ‌రిగాయ‌ని చెప్పారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

6 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

8 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

10 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

11 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

11 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

11 hours ago