ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృత్యువుకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. రామ్మూర్తి నాయుడు కన్నుమూశారని, అయితే, ఇప్పటి వరకు ఆసుపత్రి వర్గాలు, కుటుంబ సభ్యులు అధికారికంగా ధ్రువీకరించలేదనే ప్రచారం జరుగుతోంది. కాగా, చంద్రబాబు నాయుడు మరి కొద్దిసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనుండగా మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు.
చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నగరంలోని ఓ ఆస్పత్రిలో రామ్మూర్తి నాయుడికి చికిత్స జరుగుతోంది. అయితే, తాజాగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారు ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే మరోవైపు రామ్మూర్తినాయుడు కన్నుమూశారని పేర్కొంటూ అధికారికంగా ప్రకటించడమే మిగిలిందని అంటున్నారు.
కాగా, సోదరుడు రామ్మూర్తినాయుడి ఆరోగ్య పరిస్థితి తెలిసిన అనంతరం ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు తదుపరి కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. ఈరోజు సాయంత్రం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్న చంద్రబాబు ఈ మేరకు మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకొని హైదరాబాద్ బయల్దేరారు. దీంతోపాటుగా మంత్రి లోకేష్ హైదరాబాద్ కు బయలుదేరారు. రామ్మూర్తి నాయుడు చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద ఆయన తనయుడు నారా రోహిత్, కుటుంబ సభ్యులు ఉన్నారు.
నారా కర్జూరనాయుడు, అమ్మణమ్మ దంపతుల రెండో సంతానం నారా రామ్మూర్తినాయుడు. 1952లో జన్మించిన రామ్మూర్తినాయుడు 1994లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరమై ఇంటికే పరిమితమయ్యారు. రామ్మూర్తి నాయుడి ఇద్దరు సంతానంలో ఒకరు హీరో రోహిత్ కాగా.. మరొకరు నారా గిరీష్.
This post was last modified on November 16, 2024 9:28 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…