Political News

విడదల రజనికి ‘సోషల్’ షాక్

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు, అశ్లీలకరమైన వ్యాఖ్యలు చేయడంతోనే వారిని చట్ట ప్రకారం అరెస్టు చేస్తున్నామని ప్రభుత్వం, పోలీసులు చెబుతున్నారు. అయితే, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్న కారణంతోనే వారిని అరెస్టు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో తమపై టీడీపీ, జనసేన, బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తలు పెట్టిన పోస్టులను అంబటి రాంబాబు, విడదల రజనీ మీడియాకు చూపిస్తున్నారు.

తనపై సోషల్ మీడియాలో గతంలో పోస్టులు పెట్టారని విడదల రజని వ్యాఖ్యానించిన కొద్ది గంటల్లోనే ఆమెకు షాక్ తగిలింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చిలకలూరిపేట అర్బన్ సీఐ తనపై అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడ్డారని ఐటీడీపీ చిలకలూరిపేట అధ్యక్షుడు పిల్లి కోటేశ్వరరావు పోలీసులను ఆశ్రయించారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై గుంటూరు ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు.

వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో మార్ఫింగ్ పోస్టులు పెట్టినట్లుగా తప్పుడు కేసులతో తనను వేధించారని, పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారని కోటేశ్వరరావు తన ఫిర్యాదులో ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోటేశ్వరావు కోరారు. అయితే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ పెట్టిన కారణంతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే విడదల రజనిని కూడా ఆ తరహాలో పోలీసులు విచారణకు పిలుస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. దీంతో, పవన్ చెప్పిన కర్మ కాలింగ్ అని, విడదల రజనికి షాక్ తగిలిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

This post was last modified on November 13, 2024 10:34 pm

Share

Recent Posts

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

6 minutes ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

2 hours ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

5 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

9 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

12 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

13 hours ago