Political News

విడదల రజనికి ‘సోషల్’ షాక్

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు, అశ్లీలకరమైన వ్యాఖ్యలు చేయడంతోనే వారిని చట్ట ప్రకారం అరెస్టు చేస్తున్నామని ప్రభుత్వం, పోలీసులు చెబుతున్నారు. అయితే, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్న కారణంతోనే వారిని అరెస్టు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో తమపై టీడీపీ, జనసేన, బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తలు పెట్టిన పోస్టులను అంబటి రాంబాబు, విడదల రజనీ మీడియాకు చూపిస్తున్నారు.

తనపై సోషల్ మీడియాలో గతంలో పోస్టులు పెట్టారని విడదల రజని వ్యాఖ్యానించిన కొద్ది గంటల్లోనే ఆమెకు షాక్ తగిలింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చిలకలూరిపేట అర్బన్ సీఐ తనపై అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడ్డారని ఐటీడీపీ చిలకలూరిపేట అధ్యక్షుడు పిల్లి కోటేశ్వరరావు పోలీసులను ఆశ్రయించారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై గుంటూరు ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు.

వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో మార్ఫింగ్ పోస్టులు పెట్టినట్లుగా తప్పుడు కేసులతో తనను వేధించారని, పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారని కోటేశ్వరరావు తన ఫిర్యాదులో ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోటేశ్వరావు కోరారు. అయితే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ పెట్టిన కారణంతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే విడదల రజనిని కూడా ఆ తరహాలో పోలీసులు విచారణకు పిలుస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. దీంతో, పవన్ చెప్పిన కర్మ కాలింగ్ అని, విడదల రజనికి షాక్ తగిలిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

This post was last modified on November 13, 2024 10:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేమలు బ్యూటీకి సీనియర్ స్టార్ల ఛాన్సులు

గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…

2 hours ago

సునీతా విలియమ్స్ భారత పర్యటన.. ఎప్పుడంటే?

అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్‌కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…

3 hours ago

IPL 2025: 13 ఏళ్ల కుర్రాడి ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు?

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అడుగుపెడుతున్న…

3 hours ago

DSP విలువ తెలిసినట్టు ఉందే

సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…

4 hours ago

ఆదివారం రిలీజ్ ఎందుకు భాయ్

సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…

4 hours ago

క్షేమంగా తిరిగొచ్చిన సునీత… అమెరికా, భారత్ లో సంబరాలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…

5 hours ago