Political News

ఐటీ కపుల్స్ లైఫ్ స్టైల్ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఏపీలో జాతీయ విద్యాదినోత్సవం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడలో రాష్ట్ర ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సీఎం చంద్రబాబు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్, మంత్రులు సన్మానించారు. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయుల గురించి సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శిరస్సు వంచి‌ పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. విద్యార్ధుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యత గురువులదని, తల్లిదండ్రులు తర్వాత గురువుకి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పారు.

తనకు విద్య నేర్పిన గురువులు ఇప్పటికీ గుర్తేనని చెప్పారు. మౌలానా అబుల్ కలాం ముందు చూపు వల్లే ఈ రోజు యువత ఐఐటీలో రాణిస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయుడి నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ఎందరికో ఆదర్శప్రాయమన్నారు. అందుకే, ఈ రెండూ కలిసిన రోజును పురస్కరించుకొని విద్యాశాఖ మంత్రి మోడల్‌గా ఈ సభ పెట్టారని అన్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం సెప్టెంబరు 5న టీచర్స్ డే నాడు జరగాల్సి ఉండగా వరదలు వచ్చాయని చెప్పారు.

మాతృ భాషకే ప్రథమ‌ ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్యోగం కోసం ఇంగ్లీషు నేర్చుకోవాలని చంద్రబాబు చెప్పారు. 2047 నాటికి ప్రపంచంలో ఒకటి లేదా రెండో స్థానానికి భారత్ చేరుకుంటుందని, ఏ దేశం వెళ్లినా మనవాళ్లు నెంబర్ వన్‌గా ఉంటారని అన్నారు. దేశంలో మోదీ, ఏపీలో తాను అమలు చేసే సంస్కరణల వల్లే ఈ ఫలితాలు వస్తాయని తెలిపారు. కుటుంబ నియంత్రణ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించామని చెప్పారు. దక్షిణ రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తగ్గిపోతుండడంతో ఇద్దరు పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి అనర్హత అనే నిబంధన పెడుతున్నామని చెప్పారు.

ఐటీ రంగంలో భార్యాభర్తలు ఉద్యోగులు అయితే పిల్లలును కనడం‌పై దృష్టి పెట్టడం లేదని, ఈ విషయంలో తాను ఆలోచిస్తున్నానని చెప్పారు. సమాజంలో పిల్లలు కనే విషయంలో పాజిటివ్‌గా ఉండేలా అవగాహన కల్పించాలని అన్నారు. నిశ్శబ్దం మానండి… పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి అందరూ మాట్లాడండి అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

This post was last modified on November 12, 2024 9:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

42 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago