Political News

ఐటీ కపుల్స్ లైఫ్ స్టైల్ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఏపీలో జాతీయ విద్యాదినోత్సవం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడలో రాష్ట్ర ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సీఎం చంద్రబాబు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్, మంత్రులు సన్మానించారు. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయుల గురించి సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శిరస్సు వంచి‌ పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. విద్యార్ధుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యత గురువులదని, తల్లిదండ్రులు తర్వాత గురువుకి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పారు.

తనకు విద్య నేర్పిన గురువులు ఇప్పటికీ గుర్తేనని చెప్పారు. మౌలానా అబుల్ కలాం ముందు చూపు వల్లే ఈ రోజు యువత ఐఐటీలో రాణిస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయుడి నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ఎందరికో ఆదర్శప్రాయమన్నారు. అందుకే, ఈ రెండూ కలిసిన రోజును పురస్కరించుకొని విద్యాశాఖ మంత్రి మోడల్‌గా ఈ సభ పెట్టారని అన్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం సెప్టెంబరు 5న టీచర్స్ డే నాడు జరగాల్సి ఉండగా వరదలు వచ్చాయని చెప్పారు.

మాతృ భాషకే ప్రథమ‌ ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్యోగం కోసం ఇంగ్లీషు నేర్చుకోవాలని చంద్రబాబు చెప్పారు. 2047 నాటికి ప్రపంచంలో ఒకటి లేదా రెండో స్థానానికి భారత్ చేరుకుంటుందని, ఏ దేశం వెళ్లినా మనవాళ్లు నెంబర్ వన్‌గా ఉంటారని అన్నారు. దేశంలో మోదీ, ఏపీలో తాను అమలు చేసే సంస్కరణల వల్లే ఈ ఫలితాలు వస్తాయని తెలిపారు. కుటుంబ నియంత్రణ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించామని చెప్పారు. దక్షిణ రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తగ్గిపోతుండడంతో ఇద్దరు పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి అనర్హత అనే నిబంధన పెడుతున్నామని చెప్పారు.

ఐటీ రంగంలో భార్యాభర్తలు ఉద్యోగులు అయితే పిల్లలును కనడం‌పై దృష్టి పెట్టడం లేదని, ఈ విషయంలో తాను ఆలోచిస్తున్నానని చెప్పారు. సమాజంలో పిల్లలు కనే విషయంలో పాజిటివ్‌గా ఉండేలా అవగాహన కల్పించాలని అన్నారు. నిశ్శబ్దం మానండి… పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి అందరూ మాట్లాడండి అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Satya

Recent Posts

జగన్ సభకు అనుమతి ఎందుకు లేదు పవన్: రేవంత్ రెడ్డి

తెలంగాణ‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.. ఈ నెల 2న నిర్వ‌హించ త‌ల‌పెట్టిన తెలంగాణ న‌వ‌నిర్మాణ సంక‌ల్ప స‌భ‌కు పోలీసులు అనుమ‌తి…

20 minutes ago

సురేందర్ రెడ్డి సమస్య ఎప్పుడు తీరెనో

దర్శకుడు సురేందర్ రెడ్డి పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. కారణం పవన్ కళ్యాణ్ అంగీకారం వస్తే సినిమా మొదలుపెట్టాలి. ఈ…

1 hour ago

అసెంబ్లీ వ‌ద్దు.. ప్ర‌జ‌లూ వ‌ద్దు.. జ‌గ‌న్ ల‌క్ష్యం ఏంటి.. ?

ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీ(ప్ర‌ధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆస‌క్తిక‌రం. శుక్ర‌వారం(జూన్…

2 hours ago

జంధ్యాల వాడకం… రావిపూడి మార్కు ప్రచారం

దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…

2 hours ago

మళ్లీ డీలిమిటేషన్ రచ్చ షురూ

దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…

4 hours ago

రెడ్ బుక్ తెరిచే ఉంది… వైసీపీకి లోకేష్ వార్నింగ్‌

రెడ్ బుక్ మూసేయ‌లేద‌ని.. అది ఇంకా తెరిచే ఉంద‌ని మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రెడ్ బుక్‌లో…

5 hours ago