ఏపీలో జాతీయ విద్యాదినోత్సవం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడలో రాష్ట్ర ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సీఎం చంద్రబాబు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్, మంత్రులు సన్మానించారు. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయుల గురించి సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. విద్యార్ధుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యత గురువులదని, తల్లిదండ్రులు తర్వాత గురువుకి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పారు.
తనకు విద్య నేర్పిన గురువులు ఇప్పటికీ గుర్తేనని చెప్పారు. మౌలానా అబుల్ కలాం ముందు చూపు వల్లే ఈ రోజు యువత ఐఐటీలో రాణిస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయుడి నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ఎందరికో ఆదర్శప్రాయమన్నారు. అందుకే, ఈ రెండూ కలిసిన రోజును పురస్కరించుకొని విద్యాశాఖ మంత్రి మోడల్గా ఈ సభ పెట్టారని అన్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం సెప్టెంబరు 5న టీచర్స్ డే నాడు జరగాల్సి ఉండగా వరదలు వచ్చాయని చెప్పారు.
మాతృ భాషకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్యోగం కోసం ఇంగ్లీషు నేర్చుకోవాలని చంద్రబాబు చెప్పారు. 2047 నాటికి ప్రపంచంలో ఒకటి లేదా రెండో స్థానానికి భారత్ చేరుకుంటుందని, ఏ దేశం వెళ్లినా మనవాళ్లు నెంబర్ వన్గా ఉంటారని అన్నారు. దేశంలో మోదీ, ఏపీలో తాను అమలు చేసే సంస్కరణల వల్లే ఈ ఫలితాలు వస్తాయని తెలిపారు. కుటుంబ నియంత్రణ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించామని చెప్పారు. దక్షిణ రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తగ్గిపోతుండడంతో ఇద్దరు పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి అనర్హత అనే నిబంధన పెడుతున్నామని చెప్పారు.
ఐటీ రంగంలో భార్యాభర్తలు ఉద్యోగులు అయితే పిల్లలును కనడంపై దృష్టి పెట్టడం లేదని, ఈ విషయంలో తాను ఆలోచిస్తున్నానని చెప్పారు. సమాజంలో పిల్లలు కనే విషయంలో పాజిటివ్గా ఉండేలా అవగాహన కల్పించాలని అన్నారు. నిశ్శబ్దం మానండి… పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి అందరూ మాట్లాడండి అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
This post was last modified on November 12, 2024 9:48 am
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…