ఏపీలో కూటమి ప్రభుత్వంపై అనేక ఆశలు, ఆకాంక్షలు కూడా మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక అంశాలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది. ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు.. ఉపాధి, ఉద్యోగ కల్పన, పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం వంటివి కీలకంగా మారాయి. దీనికితోడు వైసీపీ హయాంలో చేసిన అప్పులు, పారిశ్రామిక వేత్తలకు సరైన సౌకర్యాలు కల్పించకుండా చేసిన వేధింపులు వంటివాటిని దూరం చేయాల్సిన అవసరం కూడా ఉంది.
ఈ నేపథ్యంలో అన్నింటికీ ఒక్కటే పరిష్కారంగా కూటమి సర్కారు బడ్జెట్ను భావిస్తోంది. ఈ నెల 11న ప్రవేశ పెట్టనున్న వార్షిక(ఐదు మాసాలకు) బడ్జెట్లో అనేక సమస్యలకు పరిష్కారం చూపించాలని నిర్ణయించింది. అంటే.. ప్రాజెక్టులు, ఉపాధికల్పన, ఉద్యోగాలు, కొత్త పారిశ్రామిక విధానం, డ్రోన్ డెస్టినేషన్గా ఏపీ.. వంటి అంశాలను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే, ఇక, ఇప్పుడు వాటికి సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికతో ముందుకు సాగనుంది.
దీనిలో భాగంగా.. బడ్జెట్లో కేటాయింపులు చూపించి.. ఆయా పనులను ముందుకు తీసుకువెళ్లే ప్లాన్ చేసింది. వాస్తవానికి ఐదు మాసాలకే బడ్జెట్ ప్రవేశ పెడుతున్నా.. అభివృద్ధి పనులకు మెజారిటీ బడ్జట్ కేటాయింపులు ఉండాలని భావిస్తోంది. అదేసమయంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో కొన్నింటిని ఇప్పటికే అమలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో వాటికి కూడా నిధులు సంపూర్ణంగా కేటాయించనుందని సమాచారం.
అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన అప్పులు.. వాటికి కడుతున్న వడ్డీలు వంటివాటిని కూడా సంపూర్ణంగా సభలో మరోసారి వివరించే ప్రయత్నం చేయనున్నారు. ఇక, ప్రధానంగా అమరావతికి.. గతంలో చెప్పినట్టుగానే వార్షిక బడ్జట్లోనూ కేటాయింపులు చేయనున్నారు. కేంద్రం సహా బ్యాంకుల నుంచి తీసుకునే సొమ్ములతోపాటు.. రాష్ట్రం కూడా తనవంతు కేటాయించనుంది. ఇక, పోలవరం ప్రాజెక్టుకు కూడా కేటాయింపులు 2 వేల కోట్లకు తగ్గకుండా ఇవ్వనుంది. మొత్తంగా చూస్తే.. తొలి బడ్జట్ను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కూటమి ప్రభుత్వం ఆదిశగానే అడుగులు వేయనుంది.
This post was last modified on November 9, 2024 12:14 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…