నిన్న మొన్నటి వరకు తన టీంకు తిరుగులేదని చెప్పుకొచ్చిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు అదే మంత్రి వర్గ బృందంలోని కొందరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు కేబినెట్ భేటీ పెట్టినా.. క్లాస్ ఇస్తున్నారనే విషయం తెలిసిందే. మరి ఈరకంగా ప్రతి 15 – 20 రోజులకు క్లాస్ ఇస్తున్నప్పుడు.. మంత్రుల పరిస్థితి ఏంటి? చంద్రబాబు ఏం చేస్తారు? అనే చర్చ సహజంగానే తెరమీదికి వస్తుంది.
ఇప్పుడు జరిగిన కేబినెట్ భేటీలోనూ మంత్రులపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనిచేయడం లేదని.. చెప్పుకొచ్చారు. వాస్తవానికి తనతో పోటీ పడాలని.. రాష్ట్రంలో ప్రగతి కనిపించాలని గత రెండు కేబినెట్ సమావేశాల నుంచి చంద్రబాబు చెబుతున్నారు. అయితే.. మంత్రులు కొందరు వింటున్నారు. మరికొందరు లైట్ తీసుకుంటున్నారు. దీంతో కొన్ని కొన్ని శాఖలపై చంద్రబాబు మార్కు పడడం లేదు.
ఇది.. సహజంగా విజన్ ఉన్న నాయకుడిగా పేరున్న చంద్రబాబుకు ఇబ్బందిగానే ఉంది. దూకుడు లేకపోవడం, చొరవ తీసుకుని నిర్ణయాలు ప్రకటించలేక పోవడం.. వంటివి నలుగురి నుంచి ఆరుగురు మంత్రులకు ఇబ్బందిగా మారింది. దీని నుంచి వారు బయటకు రాలేక పోతున్నారనే చర్చ జరుగుతోంది. దీనికి కారణం.. ప్రశంసలు, పొగడ్తలకు మంత్రులు పడిపోతున్నారన్న వాదన కూడా ఉంది.
అధికారంలో ఉన్నప్పుడు ఎదురయ్యే ప్రధాన సమస్య ఇదే. మీరు అంతటి వారు.. ఇంతటి వారు .. అంటూ.. ఉన్నతాధికారుల నుంచి నాయకుల వరకు ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ వలలో చిక్కుకుపోతుండడం మంత్రుల వీక్ నెస్. అయితే.. వారు ఈ వాసనలను దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. రాజకీయ నేతల మాదిరిగా కాకుండా.. మంత్రులుగా వారు బిహేవ్ చేసినప్పుడు ఈ సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంది. ఇది లేనంత సేపు.. చేతులు కాళ్లను ప్రశంసలనే తాళ్లతో కట్టేసే వారే ఎక్కువగా ఉంటారన్న విషయాన్ని వారు గుర్తించాలి.
This post was last modified on November 7, 2024 11:52 am
బాలీవుడ్ ప్రముఖుల కామెంట్లు ఒక్కోసారి భలే విచిత్రంగా ఉంటాయి. బిగ్ బి అమితాబ్ బచ్చన్ సతీమణి, ఒకప్పటి మాజీ హీరోయిన్…
మామూలుగా ఒక సినిమా వాయిదాల మీద వాయిదాలు పడి ఆలస్యంగా రిలీజైతే కొంచెం బజ్ తగ్గుతూ ఉంటుంది. కానీ ‘రాబిన్…
అతడు.. తెలుగు ప్రేక్షకులు అత్యంత మెచ్చిన చిత్రాల్లో ఇది ముందు వరసలోఉంటుందనడంలో సందేహం లేదు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్…
చట్టసభల్లో ప్రజా ప్రతినిధుల వ్యవహార తీరుకు సంబంధించి చట్టాల్లోని నియమ నిబంధనలు పెద్దగా పనిచేయడం లేదు. చట్టాలను పక్కనపెట్టేస్తున్న కొందరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం బస్సు డ్రైవర్ గా అవతారం…
బాహుబలి తర్వాత సీక్వెల్ ట్రెండ్ అనేది ఎంత పాపులరయ్యిందో చూస్తున్నాం. కెజిఎఫ్, పుష్ప లాంటి బ్లాక్ బస్టర్లు దానికి మరింత…