నిన్న మొన్నటి వరకు తన టీంకు తిరుగులేదని చెప్పుకొచ్చిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు అదే మంత్రి వర్గ బృందంలోని కొందరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు కేబినెట్ భేటీ పెట్టినా.. క్లాస్ ఇస్తున్నారనే విషయం తెలిసిందే. మరి ఈరకంగా ప్రతి 15 – 20 రోజులకు క్లాస్ ఇస్తున్నప్పుడు.. మంత్రుల పరిస్థితి ఏంటి? చంద్రబాబు ఏం చేస్తారు? అనే చర్చ సహజంగానే తెరమీదికి వస్తుంది.
ఇప్పుడు జరిగిన కేబినెట్ భేటీలోనూ మంత్రులపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనిచేయడం లేదని.. చెప్పుకొచ్చారు. వాస్తవానికి తనతో పోటీ పడాలని.. రాష్ట్రంలో ప్రగతి కనిపించాలని గత రెండు కేబినెట్ సమావేశాల నుంచి చంద్రబాబు చెబుతున్నారు. అయితే.. మంత్రులు కొందరు వింటున్నారు. మరికొందరు లైట్ తీసుకుంటున్నారు. దీంతో కొన్ని కొన్ని శాఖలపై చంద్రబాబు మార్కు పడడం లేదు.
ఇది.. సహజంగా విజన్ ఉన్న నాయకుడిగా పేరున్న చంద్రబాబుకు ఇబ్బందిగానే ఉంది. దూకుడు లేకపోవడం, చొరవ తీసుకుని నిర్ణయాలు ప్రకటించలేక పోవడం.. వంటివి నలుగురి నుంచి ఆరుగురు మంత్రులకు ఇబ్బందిగా మారింది. దీని నుంచి వారు బయటకు రాలేక పోతున్నారనే చర్చ జరుగుతోంది. దీనికి కారణం.. ప్రశంసలు, పొగడ్తలకు మంత్రులు పడిపోతున్నారన్న వాదన కూడా ఉంది.
అధికారంలో ఉన్నప్పుడు ఎదురయ్యే ప్రధాన సమస్య ఇదే. మీరు అంతటి వారు.. ఇంతటి వారు .. అంటూ.. ఉన్నతాధికారుల నుంచి నాయకుల వరకు ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ వలలో చిక్కుకుపోతుండడం మంత్రుల వీక్ నెస్. అయితే.. వారు ఈ వాసనలను దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. రాజకీయ నేతల మాదిరిగా కాకుండా.. మంత్రులుగా వారు బిహేవ్ చేసినప్పుడు ఈ సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంది. ఇది లేనంత సేపు.. చేతులు కాళ్లను ప్రశంసలనే తాళ్లతో కట్టేసే వారే ఎక్కువగా ఉంటారన్న విషయాన్ని వారు గుర్తించాలి.
This post was last modified on November 7, 2024 11:52 am
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…