Political News

ఏపీ కేబినెట్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. సీఆర్ డీఏ ప‌రిధి పెంపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలో భేటీ అయిన‌.. కేబినెట్ ప‌లు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంది. దీనిలో ప్ర‌ధానంగా రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిని పెంచుతూ.. విజ‌య‌వాడ చుట్టుప‌క్క‌ల ఉన్న ప్రాంతాల‌ను, గుంటూరు, మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గాల్లోని ప‌లు ప్రాంతాల‌నుకూడా దీని కింద‌కు తీసుకువ‌స్తూ.. నిర్ణ‌యించింది. మొత్తంగా మ‌రో 8,352 చ‌ద‌ర‌పు కిలో మీట‌ర్ల మేర‌కు సీఆర్ డీఏ ప‌రిధిని కేబినెట్ పెంచ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఆయా ప్రాంతాలు కూడా రాజ‌ధాని ప‌రిధిలోకి వ‌స్తాయి. ఫ‌లితంగా భూముల రేట్లు పెర‌గ‌డంతోపాటు.. వ్యాపార‌, వాణిజ్య కార్య‌క్ర‌మాలు మ‌రింత విస్త‌రించ‌నున్నాయ‌ని మంత్రి వ‌ర్గం అభిప్రాయ‌ప‌డింది.

ఇక‌, వైసీపీ హ‌యాంలో చెల్లించాల్సిన ప‌లు బిల్లుల‌ను పెండింగులో పెట్టిన నేప‌థ్యంలో వాటిని కూడా చెల్లించేందుకు కేబినెట్ సిద్ధ‌మైంది. 2014-18 మధ్య టీడీపీ హ‌యాంలో రాష్ట్రంలో ప‌చ్చ‌ద‌నం పెంచాల‌న్న ప్ర‌ధాన ల‌క్ష్యంతో ‘నీరు-చెట్టు’ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. అయితే.. దీనిలో కొన్ని బిల్లులు పెండింగులో ఉన్నాయి. వైసీపీ హ‌యాంలో వీటిని చెల్లించాల్సి ఉన్నా.. జ‌గ‌న్‌.. చెల్లించ‌లేదు. దీంతో ఇప్పుడు ఆ పెండింగ్‌ బిల్లుల చెల్లింపునకు ప్ర‌భుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించి కూడా మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది.

అదేవిధంగా ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ (ప్రోహిబిషన్‌)కు, ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ 1982 రీఫెల్‌ బిల్లుల‌కు కూడా సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. ఇక‌, మ‌రో కీల‌క మైన వ్య‌వ‌హారంగా ఉన్న‌ ఏపీ జీఎస్టీ-2024 చట్ట సవరణకు కూడా మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది. దీనివ‌ల్ల‌.. స్టేట్ ఎక్సైజ్ డ్యూటీలో మార్పులు చేర్పుల‌కు అవ‌కాశం ఉంది. అంటే.. కొన్నింటికి రాష్ట్ర‌స్థాయిలో ప‌న్నులు త‌గ్గించుకోవ‌డంతోపాటు..కొన్నింటికి పెంచుకునే వెసులుబాటు క‌ల్పిస్తారు. అదేవిధంగా.. ఎక్సైజ్‌ చట్ట సవరణ ముసాయిదాకు సమావేశం ఆమోదం తెలిపింది.

ఈ ఎక్సైజ్ చ‌ట్ట స‌ర‌వ‌ర‌ణ ద్వారా.. ప్ర‌స్తుతం నూత‌న మ‌ద్యం విధానంలో క‌ల్లు గీత కార్మికుల‌కు షాపులు కేటాయించేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంది. త‌ద్వారా.. ప్రైవేటు దుకాణాల‌తో స‌మానంగా వారు కూడా షాపులు నిర్వ‌హించుకోవ‌చ్చు. వీటిలో క‌ల్లుతో పాటు.. మ‌ద్యాన్ని కూడా విక్ర‌యించే అవ‌కాశం క‌ల‌గ‌నుంది. ఇక‌, సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ లక్ష్యాల సాధనకు కూడా కేబినెట్ ఓకే చెప్పింది. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురంలోనూ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. త‌ద్వారా.. పిఠాపురాన్ని మ‌రింత అభివృద్ధి చేసేందుకు అవ‌కాశం ఏర్ప‌డ‌నుంది.

This post was last modified on November 6, 2024 9:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

త్రిశంకు స్వ‌ర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలు?

వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో న‌లుగురి ప‌రిస్థితి ఎలా ఉన్నా.. మిగిలిన ఏడుగురు మాత్రం త్రిశంకు స్వ‌ర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు.…

2 minutes ago

వంశీ పంచ్: జాన్వి క‌న్న తండ్రిని కించ‌ప‌రుస్తానా?

ఆ మ‌ధ్య ఒక రౌండ్ టేబుల్ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో బాలీవుడ్ సీనియ‌ర్ నిర్మాత బోనీ క‌పూర్ మీద టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్…

25 minutes ago

రెండు దెబ్బలతో ఉద్యోగులు వెరీ వెరీ హ్యాపీ

ఏపీలో ఉద్యోగుల పరిస్థితి మొన్నటిదాకా అత్యంత దుర్భరంగా ఉండేది. నెలంతా కష్టపడి కూడా వేతనాల కోసం వారు నెలాఖరు దాకా…

1 hour ago

పవన్ అభిలాష… బాబు హ్యాట్రిక్ కొట్టాలి

ఏపీలోని అధికార కూటమి సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉండాలని... ఆ కూటమిలోని కీలక భాగస్వామిగా కొనసాగుతున్న జనసేన అధినేత, ఏపీ…

3 hours ago

పడిపడి నవ్వి… ‘పది సార్లు బల్ల గుద్దిన’ బాబు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం అత్యద్భుతమైన వేడుకలతో ముగిశాయి. 'ఆంధ్రప్రదేశ్ లెజిస్టేచర్ కల్చరల్ ఈవెనింగ్' పేరిట నిర్వహించిన కార్యక్రమం…

5 hours ago

అవును.. ఈ కుక్క ఖరీదు రూ.50 కోట్లు

బెంగళూరుకు చెందిన ఎస్. సతీష్ తన అరుదైన పెంపుడు జంతువులతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి రికార్డు సృష్టించారు.…

6 hours ago