Political News

ఏపీ కేబినెట్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. సీఆర్ డీఏ ప‌రిధి పెంపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలో భేటీ అయిన‌.. కేబినెట్ ప‌లు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంది. దీనిలో ప్ర‌ధానంగా రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిని పెంచుతూ.. విజ‌య‌వాడ చుట్టుప‌క్క‌ల ఉన్న ప్రాంతాల‌ను, గుంటూరు, మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గాల్లోని ప‌లు ప్రాంతాల‌నుకూడా దీని కింద‌కు తీసుకువ‌స్తూ.. నిర్ణ‌యించింది. మొత్తంగా మ‌రో 8,352 చ‌ద‌ర‌పు కిలో మీట‌ర్ల మేర‌కు సీఆర్ డీఏ ప‌రిధిని కేబినెట్ పెంచ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఆయా ప్రాంతాలు కూడా రాజ‌ధాని ప‌రిధిలోకి వ‌స్తాయి. ఫ‌లితంగా భూముల రేట్లు పెర‌గ‌డంతోపాటు.. వ్యాపార‌, వాణిజ్య కార్య‌క్ర‌మాలు మ‌రింత విస్త‌రించ‌నున్నాయ‌ని మంత్రి వ‌ర్గం అభిప్రాయ‌ప‌డింది.

ఇక‌, వైసీపీ హ‌యాంలో చెల్లించాల్సిన ప‌లు బిల్లుల‌ను పెండింగులో పెట్టిన నేప‌థ్యంలో వాటిని కూడా చెల్లించేందుకు కేబినెట్ సిద్ధ‌మైంది. 2014-18 మధ్య టీడీపీ హ‌యాంలో రాష్ట్రంలో ప‌చ్చ‌ద‌నం పెంచాల‌న్న ప్ర‌ధాన ల‌క్ష్యంతో ‘నీరు-చెట్టు’ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. అయితే.. దీనిలో కొన్ని బిల్లులు పెండింగులో ఉన్నాయి. వైసీపీ హ‌యాంలో వీటిని చెల్లించాల్సి ఉన్నా.. జ‌గ‌న్‌.. చెల్లించ‌లేదు. దీంతో ఇప్పుడు ఆ పెండింగ్‌ బిల్లుల చెల్లింపునకు ప్ర‌భుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించి కూడా మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది.

అదేవిధంగా ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ (ప్రోహిబిషన్‌)కు, ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ 1982 రీఫెల్‌ బిల్లుల‌కు కూడా సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. ఇక‌, మ‌రో కీల‌క మైన వ్య‌వ‌హారంగా ఉన్న‌ ఏపీ జీఎస్టీ-2024 చట్ట సవరణకు కూడా మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది. దీనివ‌ల్ల‌.. స్టేట్ ఎక్సైజ్ డ్యూటీలో మార్పులు చేర్పుల‌కు అవ‌కాశం ఉంది. అంటే.. కొన్నింటికి రాష్ట్ర‌స్థాయిలో ప‌న్నులు త‌గ్గించుకోవ‌డంతోపాటు..కొన్నింటికి పెంచుకునే వెసులుబాటు క‌ల్పిస్తారు. అదేవిధంగా.. ఎక్సైజ్‌ చట్ట సవరణ ముసాయిదాకు సమావేశం ఆమోదం తెలిపింది.

ఈ ఎక్సైజ్ చ‌ట్ట స‌ర‌వ‌ర‌ణ ద్వారా.. ప్ర‌స్తుతం నూత‌న మ‌ద్యం విధానంలో క‌ల్లు గీత కార్మికుల‌కు షాపులు కేటాయించేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంది. త‌ద్వారా.. ప్రైవేటు దుకాణాల‌తో స‌మానంగా వారు కూడా షాపులు నిర్వ‌హించుకోవ‌చ్చు. వీటిలో క‌ల్లుతో పాటు.. మ‌ద్యాన్ని కూడా విక్ర‌యించే అవ‌కాశం క‌ల‌గ‌నుంది. ఇక‌, సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ లక్ష్యాల సాధనకు కూడా కేబినెట్ ఓకే చెప్పింది. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురంలోనూ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. త‌ద్వారా.. పిఠాపురాన్ని మ‌రింత అభివృద్ధి చేసేందుకు అవ‌కాశం ఏర్ప‌డ‌నుంది.

This post was last modified on November 6, 2024 9:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రెండింగ్ మొదలుపెట్టిన భగత్ సింగ్

ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…

1 hour ago

దురంధర్ 2 ప్రీమియర్లు…..వాటి మీదే అందరి కళ్ళు

మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…

2 hours ago

బీఆర్ఎస్ టాక్‌: రోహిత్‌రెడ్డిపై ఇంత‌క‌న్నా చేయ‌లేం

'మొయినాబాద్ డ్ర‌గ్స్ పార్టీ' కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత‌, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్‌రెడ్డి విష‌యం మాజీ…

2 hours ago

జ‌గ‌న్‌ను చిక్కుల్లో పెట్టేశారుగా!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రోసారి చిక్కుల్లో ప‌డ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయ‌న‌కు పెద్ద చిక్కు వ‌చ్చింది.…

2 hours ago

హరీష్ మీద పవన్ ఫ్యాన్స్ ప్రేమ

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…

4 hours ago

ఉనికిని చాటడానికి ‘రాకాస’ ప్లాన్లు

చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…

10 hours ago