Political News

ఏపీ కేబినెట్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. సీఆర్ డీఏ ప‌రిధి పెంపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలో భేటీ అయిన‌.. కేబినెట్ ప‌లు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంది. దీనిలో ప్ర‌ధానంగా రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిని పెంచుతూ.. విజ‌య‌వాడ చుట్టుప‌క్క‌ల ఉన్న ప్రాంతాల‌ను, గుంటూరు, మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గాల్లోని ప‌లు ప్రాంతాల‌నుకూడా దీని కింద‌కు తీసుకువ‌స్తూ.. నిర్ణ‌యించింది. మొత్తంగా మ‌రో 8,352 చ‌ద‌ర‌పు కిలో మీట‌ర్ల మేర‌కు సీఆర్ డీఏ ప‌రిధిని కేబినెట్ పెంచ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఆయా ప్రాంతాలు కూడా రాజ‌ధాని ప‌రిధిలోకి వ‌స్తాయి. ఫ‌లితంగా భూముల రేట్లు పెర‌గ‌డంతోపాటు.. వ్యాపార‌, వాణిజ్య కార్య‌క్ర‌మాలు మ‌రింత విస్త‌రించ‌నున్నాయ‌ని మంత్రి వ‌ర్గం అభిప్రాయ‌ప‌డింది.

ఇక‌, వైసీపీ హ‌యాంలో చెల్లించాల్సిన ప‌లు బిల్లుల‌ను పెండింగులో పెట్టిన నేప‌థ్యంలో వాటిని కూడా చెల్లించేందుకు కేబినెట్ సిద్ధ‌మైంది. 2014-18 మధ్య టీడీపీ హ‌యాంలో రాష్ట్రంలో ప‌చ్చ‌ద‌నం పెంచాల‌న్న ప్ర‌ధాన ల‌క్ష్యంతో ‘నీరు-చెట్టు’ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. అయితే.. దీనిలో కొన్ని బిల్లులు పెండింగులో ఉన్నాయి. వైసీపీ హ‌యాంలో వీటిని చెల్లించాల్సి ఉన్నా.. జ‌గ‌న్‌.. చెల్లించ‌లేదు. దీంతో ఇప్పుడు ఆ పెండింగ్‌ బిల్లుల చెల్లింపునకు ప్ర‌భుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించి కూడా మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది.

అదేవిధంగా ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ (ప్రోహిబిషన్‌)కు, ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ 1982 రీఫెల్‌ బిల్లుల‌కు కూడా సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. ఇక‌, మ‌రో కీల‌క మైన వ్య‌వ‌హారంగా ఉన్న‌ ఏపీ జీఎస్టీ-2024 చట్ట సవరణకు కూడా మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది. దీనివ‌ల్ల‌.. స్టేట్ ఎక్సైజ్ డ్యూటీలో మార్పులు చేర్పుల‌కు అవ‌కాశం ఉంది. అంటే.. కొన్నింటికి రాష్ట్ర‌స్థాయిలో ప‌న్నులు త‌గ్గించుకోవ‌డంతోపాటు..కొన్నింటికి పెంచుకునే వెసులుబాటు క‌ల్పిస్తారు. అదేవిధంగా.. ఎక్సైజ్‌ చట్ట సవరణ ముసాయిదాకు సమావేశం ఆమోదం తెలిపింది.

ఈ ఎక్సైజ్ చ‌ట్ట స‌ర‌వ‌ర‌ణ ద్వారా.. ప్ర‌స్తుతం నూత‌న మ‌ద్యం విధానంలో క‌ల్లు గీత కార్మికుల‌కు షాపులు కేటాయించేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంది. త‌ద్వారా.. ప్రైవేటు దుకాణాల‌తో స‌మానంగా వారు కూడా షాపులు నిర్వ‌హించుకోవ‌చ్చు. వీటిలో క‌ల్లుతో పాటు.. మ‌ద్యాన్ని కూడా విక్ర‌యించే అవ‌కాశం క‌ల‌గ‌నుంది. ఇక‌, సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ లక్ష్యాల సాధనకు కూడా కేబినెట్ ఓకే చెప్పింది. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురంలోనూ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. త‌ద్వారా.. పిఠాపురాన్ని మ‌రింత అభివృద్ధి చేసేందుకు అవ‌కాశం ఏర్ప‌డ‌నుంది.

This post was last modified on November 6, 2024 9:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

1 hour ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

6 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

7 hours ago

దురంధర్ VS విశ్వరూపం – ఎందుకీ రచ్చ?

ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…

7 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

9 hours ago

టార్గెట్ వైసీపీ… బాబు-ప‌వ‌న్ రచిస్తున్న వ్యూహం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు సుమారు గంట‌కుపైగా చ‌ర్చ‌లు జ‌రిపారు. బుధ‌వారం ఉద‌యం ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి నివాసానికి…

10 hours ago