రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టం. ఏదో ఉద్ధరించేస్తారు. అని భావించిన నాయకులు కూడా తర్వాత కాలంలో చతికిలపడిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితే.. విజయవాడలోని కీలకమైన నియోజకవర్గం పశ్చిమలో టీడీపీ ఎదుర్కొంటోంది.
విజయవాడలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. పశ్చిమ, తూర్పు, సెంట్రల్. అయితే, ఒక్క పశ్చిమలో తప్ప.. మిగిలిన రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీకి పట్టుంది. ఇక్కడచిత్రం ఏంటంటే.. రాష్ట్రంలో టీడీపీ పుట్టిన తర్వాత పశ్చిమలో ఇప్పటి వరకు గెలుపు గుర్రం ఎక్కలేదు.
అలాంటి నియోజకవర్గంలో పార్టీకి అందివచ్చిన నాయకుడు అవుతారని భావించిన చంద్రబాబు.. 2014లో వైసీపీ తరఫున విజయం సాధించిన జలీల్ఖాన్ను పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు మైనార్టీ మంత్రి పదవి ఇస్తారని అనుకున్నా.. తర్వాత ఆయనకు వక్ఫ్ బోర్డు చైర్మన్గా నియమించారు.
అయితే, గత ఏడాది ఎన్నికల్లో జలీల్ ఖాన్ తన కుమార్తెకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు కోరడం, దీనిని ఆయన ఓకే చెప్పడంతో షబానా ఖతూన్ పోటీ చేశారు. గట్టిపోటీనే ఇచ్చినా.. వైసీపీ నాయకుడు వెలంపల్లి శ్రీనివాస్పై పరాజయం పాలయ్యారు.
నిజానికి జలీల్ఖాన్ కుమార్తెకు టికెట్ ఇవ్వడం టీడీపీలోని ఓ వర్గానికి సుతరామూ ఇష్టం లేదు. మరీ ముఖ్యంగా ఇక్కడ కీలకంగా ఉన్న నాగుల్ మీరాకు అస్సలు ఇష్టం లేదు. ఈ పరిణామం.. ఎన్నికల్లో జలీల్ ఖాన్కు తమ్ముళ్లు కలిసిరాకుండా చేసింది. ఇక, ఓటమి తర్వాత షబానా.. అమెరికా వెళ్లిపోయారు. అప్పటి నుంచి అనారోగ్య కారణాలతో జలీల్ ఖాన్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.
మరోవైపు అప్పటి వరకు యాక్టివ్గా ఉన్న నాగుల్ మీరా వర్గం కూడా చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటోంది. దీంతో ఏదో జరిగిపోయి.. ఇక్కడ పార్టీ బలపడుతుందని అనుకున్న చంద్రబాబు వ్యూహం రెంటికీ చెడ్డ రేవడిగా మారిపోయిందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు పార్టీలో జెండా మోసే నాథుడు కూడా కనిపించడం లేదు. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on October 3, 2020 3:28 pm
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…