ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఫైర్బ్రాండ్ షర్మిల మరోసారి రోడ్డెక్కారు. అయితే.. ఈ దఫా తనకు, తన కుటుంబానికీ తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్ అన్యాయం చేశారని, ఆస్తులు ఇవ్వకుండా ఎగ్గొట్టారని మాత్రం కాదు. కూటమి సర్కారు రాష్ట్రంలో పెంచిన విద్యుత్ చార్జీలను కార్నర్ చేసుకుని ఉద్యమించేం దుకు ఆమె విజయవాడలోని ధర్నా చౌక్లో రోడ్డుపై కూర్చున్నారు. విద్యుత్ సర్దుబాటు చార్జీలు 17 వేల కోట్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ చార్జీల సర్దుబాటు భారం వైసీపీ చేసిన పాపం అయితే… కూటమి ప్రభుత్వం ప్రజలకు పెడుతున్న శాపం అంటూ వైఎస్ షర్మిల నినదించారు. “కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి కేవలం 5 నెలలు మాత్రమే అయింది. 5 నెలల్లోనే హై ఓల్టేజ్ షాక్ ఇచ్చారు. దారుణంగా కరెంటు చార్జీల భారాన్ని మోపు తున్నారు. ఇప్పటికే 6 వేల కోట్ల భారం మోపారు. ఇది చాలదు అన్నట్లు ఇంకో 11 వేల కోట్లు సిద్ధం చేశారు ” అని వ్యాఖ్యానించారు.
ప్రజలు ఏం పాపం చేశారు చంద్రబాబు? అని షర్మిల ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ చార్జీల పై ఎన్నో హామీలు ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. వైసిపి 9 సార్లు పెంచిందని గగ్గోలు పెట్టారని, తెలుగు దేశం అధికారంలో ఉంటే ఇది జరిగేది కాదని అన్నారని పేర్కొన్నారు. కూటమి అధికారంలో వచ్చాకా చార్జీలు 30 శాతం తగ్గిస్తామని చెప్పిన విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. మీకు ఓట్లు వేయడం ప్రజలు చేసిన పాపమా ? అని షర్మిల ప్రశ్నించారు.
ఇదేసమయంలో జగన్పైనా షర్మిల విమర్శలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 35 వేల కోట్లు భారం మోపారని అన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని, ప్రజలపై భారం మోపవద్దని షర్మిల సూచించారు. జగన్ హయాంలో హిందూజా లాంటి కంపెనీకి 12 వందల కోట్లు ఎందుకు ఇచ్చారో తేల్చాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన పాపానికి ప్రజల మీద భారాన్ని మోపవద్దని డిమాండ్ చేశారు.
This post was last modified on November 6, 2024 3:09 pm
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…