Political News

రోడ్డెక్కిన ష‌ర్మిల‌.. ఈసారి రీజ‌న్ ఇదే!

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు, ఫైర్‌బ్రాండ్ ష‌ర్మిల మ‌రోసారి రోడ్డెక్కారు. అయితే.. ఈ ద‌ఫా త‌న‌కు, త‌న కుటుంబానికీ త‌న సోద‌రుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్ అన్యాయం చేశార‌ని, ఆస్తులు ఇవ్వకుండా ఎగ్గొట్టార‌ని మాత్రం కాదు. కూట‌మి స‌ర్కారు రాష్ట్రంలో పెంచిన విద్యుత్ చార్జీల‌ను కార్న‌ర్ చేసుకుని ఉద్య‌మించేం దుకు ఆమె విజ‌య‌వాడ‌లోని ధ‌ర్నా చౌక్‌లో రోడ్డుపై కూర్చున్నారు. విద్యుత్ సర్దుబాటు చార్జీలు 17 వేల కోట్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ చార్జీల సర్దుబాటు భారం వైసీపీ చేసిన పాపం అయితే… కూటమి ప్రభుత్వం ప్ర‌జ‌ల‌కు పెడుతున్న శాపం అంటూ వైఎస్ షర్మిల నిన‌దించారు. “కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి కేవలం 5 నెలలు మాత్రమే అయింది. 5 నెలల్లోనే హై ఓల్టేజ్ షాక్ ఇచ్చారు. దారుణంగా కరెంటు చార్జీల భారాన్ని మోపు తున్నారు. ఇప్పటికే 6 వేల కోట్ల భారం మోపారు. ఇది చాలదు అన్నట్లు ఇంకో 11 వేల కోట్లు సిద్ధం చేశారు ” అని వ్యాఖ్యానించారు.

ప్రజలు ఏం పాపం చేశారు చంద్రబాబు? అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ చార్జీల పై ఎన్నో హామీలు ఇచ్చార‌ని ఆమె గుర్తు చేశారు. వైసిపి 9 సార్లు పెంచిందని గగ్గోలు పెట్టారని, తెలుగు దేశం అధికారంలో ఉంటే ఇది జరిగేది కాదని అన్నార‌ని పేర్కొన్నారు. కూటమి అధికారంలో వచ్చాకా చార్జీలు 30 శాతం తగ్గిస్తామని చెప్పిన విష‌యాన్ని కూడా ఆమె ప్ర‌స్తావించారు. మీకు ఓట్లు వేయడం ప్రజలు చేసిన పాపమా ? అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు.

ఇదేస‌మ‌యంలో జ‌గ‌న్‌పైనా ష‌ర్మిల విమ‌ర్శ‌లు చేశారు. జగన్ మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 35 వేల కోట్లు భారం మోపార‌ని అన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్నారు. వీటిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ప్ర‌జ‌ల‌పై భారం మోప‌వ‌ద్ద‌ని ష‌ర్మిల సూచించారు. జ‌గ‌న్ హ‌యాంలో హిందూజా లాంటి కంపెనీకి 12 వందల కోట్లు ఎందుకు ఇచ్చారో తేల్చాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన పాపానికి ప్రజల మీద భారాన్ని మోపవ‌ద్ద‌ని డిమాండ్ చేశారు.

This post was last modified on November 6, 2024 3:09 pm

Share

Recent Posts

రామాయణ, వారణాసి… ఓ క్లారిటీ వస్తుందా?

రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…

4 hours ago

చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ…

7 hours ago

చెన్నైలో చింటు మేనియా

సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. త‌న సినిమాల ఈవెంట్ల‌లో, ఇంట‌ర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్ర‌ముఖ తెలుగు…

7 hours ago

కనకరాజు లెక్కలు సేఫ్ గానే ఉన్నాయా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…

7 hours ago

బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…

7 hours ago

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…

8 hours ago