ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఫైర్బ్రాండ్ షర్మిల మరోసారి రోడ్డెక్కారు. అయితే.. ఈ దఫా తనకు, తన కుటుంబానికీ తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్ అన్యాయం చేశారని, ఆస్తులు ఇవ్వకుండా ఎగ్గొట్టారని మాత్రం కాదు. కూటమి సర్కారు రాష్ట్రంలో పెంచిన విద్యుత్ చార్జీలను కార్నర్ చేసుకుని ఉద్యమించేం దుకు ఆమె విజయవాడలోని ధర్నా చౌక్లో రోడ్డుపై కూర్చున్నారు. విద్యుత్ సర్దుబాటు చార్జీలు 17 వేల కోట్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ చార్జీల సర్దుబాటు భారం వైసీపీ చేసిన పాపం అయితే… కూటమి ప్రభుత్వం ప్రజలకు పెడుతున్న శాపం అంటూ వైఎస్ షర్మిల నినదించారు. “కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి కేవలం 5 నెలలు మాత్రమే అయింది. 5 నెలల్లోనే హై ఓల్టేజ్ షాక్ ఇచ్చారు. దారుణంగా కరెంటు చార్జీల భారాన్ని మోపు తున్నారు. ఇప్పటికే 6 వేల కోట్ల భారం మోపారు. ఇది చాలదు అన్నట్లు ఇంకో 11 వేల కోట్లు సిద్ధం చేశారు ” అని వ్యాఖ్యానించారు.
ప్రజలు ఏం పాపం చేశారు చంద్రబాబు? అని షర్మిల ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ చార్జీల పై ఎన్నో హామీలు ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. వైసిపి 9 సార్లు పెంచిందని గగ్గోలు పెట్టారని, తెలుగు దేశం అధికారంలో ఉంటే ఇది జరిగేది కాదని అన్నారని పేర్కొన్నారు. కూటమి అధికారంలో వచ్చాకా చార్జీలు 30 శాతం తగ్గిస్తామని చెప్పిన విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. మీకు ఓట్లు వేయడం ప్రజలు చేసిన పాపమా ? అని షర్మిల ప్రశ్నించారు.
ఇదేసమయంలో జగన్పైనా షర్మిల విమర్శలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 35 వేల కోట్లు భారం మోపారని అన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని, ప్రజలపై భారం మోపవద్దని షర్మిల సూచించారు. జగన్ హయాంలో హిందూజా లాంటి కంపెనీకి 12 వందల కోట్లు ఎందుకు ఇచ్చారో తేల్చాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన పాపానికి ప్రజల మీద భారాన్ని మోపవద్దని డిమాండ్ చేశారు.
This post was last modified on November 6, 2024 3:09 pm
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…
మొన్నటి దాకా జన నాయకుడు విడుదల మీద సవాలక్ష సందేహాలు. రెండు వారాల క్రితం ఏకంగా హెచ్డి ప్రింటుతో పైరసీ…
ఈ నెల 18 పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ముందు భోపాల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈవెంట్ వేదికని ముంబైకి…