రాజకీయాల్లో తప్పొప్పులు అనేవి ఉండవు. నేడు తాను చేసింది రైట్ అనిపించిన నాయకుడికి… తదుపరి అదే పనిని తన ప్రత్యర్థి చేస్తే ఏ మాత్రం జీర్ణించుకోలేరు. పైగా నీతి వాక్యాలు, రాజ్యాంగ సూత్రాలు, సామాజిక అంశాలు, అనుబంధాలు, ఆత్మీయతలు వంటి ఎన్నో అంశాలు ప్రవచిస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పాలన, బీఆర్ఎస్ కౌంటర్లు చూస్తున్న వారికి సరిగ్గా ఇలాంటి ఫీలింగే కలుగుతోంది. ఒకపార్టీ చేసింది తప్పుపట్టిన పార్టీ తిరిగి అదే చేస్తుండటం… తాము దర్జాగా చేసిన దాన్ని ఇప్పుడు అదే పార్టీ మహాపాపంగా చూస్తుండటం తెలంగాణ రాజకీయాల్లోని పెద్ద కామెడీ!
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోని అనేకానేక అంశాల్లో నిరుద్యోగ ఆవేదన అనేది ప్రముఖంగా పేర్కొనవచ్చు. ఉద్యోగాలు నింపండి మహప్రబో అంటే వారిని పట్టించుకున్నవారే లేరు. ఇదే సమయంలో గత ఏడాది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ హైదరాబాద్కు వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కేంద్రంగా పేరొందిన అశోక్ నగర్లో నిరుద్యోగులను కలిసి వారితో ముచ్చటించారు. ఆయన విద్యార్థులకు టీ తాగించారు. దీంతోపాటుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వచ్చే నెలతో ఏడాది పూర్తి కావస్తోంది కూడా! ఇదే సమయంలో కుల గణన సంప్రదింపుల సమావేశానికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ రాష్ట్రానికి విచ్చేస్తుంటే… ఉద్యోగార్థులు ఆసక్తికర డిమాండ్లు పెట్టారు.
ప్రభుత్వ ఉద్యోగార్థుల వేదిక అయిన అశోక్ నగర్కు సమీపంలోని బావర్చీ హోటల్ వద్దకు రాహుల్ గాంధీ రావాలంటూ కొందరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ హోటల్కు వచ్చి తమతో బిర్యానీ తినాలని, నిరుద్యోగ సమస్యల గురించి చర్చించాలని అంటున్నారు. అయితే, దీన్ని తెలివిగా బీఆర్ఎస్ పార్టీ ఉపయోగించుకుంది. బిర్యానీ తింటూ ఉద్యోగాల విషయం మాట్లాడుకుందామని బీఆర్ఎస్ నేతలు ఆ హోటల్కు వెళ్లారు. బావర్చీ హోటల్లో ఓ ఖాళీ కుర్చీని కూడా రాహుల్ గాంధీ కోసం వేసి, దానిపై ఆయన పేరును రాశారు.ఇది సహజంగానే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, దీనిపై కాంగ్రెస్ స్పందించలేదు. మొత్తంగా అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నపుడు మరోలా చేయడంలో బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు రాటుదేలిపోయాయని అంటున్నారు.
This post was last modified on November 5, 2024 7:26 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…