రాజకీయాల్లో తప్పొప్పులు అనేవి ఉండవు. నేడు తాను చేసింది రైట్ అనిపించిన నాయకుడికి… తదుపరి అదే పనిని తన ప్రత్యర్థి చేస్తే ఏ మాత్రం జీర్ణించుకోలేరు. పైగా నీతి వాక్యాలు, రాజ్యాంగ సూత్రాలు, సామాజిక అంశాలు, అనుబంధాలు, ఆత్మీయతలు వంటి ఎన్నో అంశాలు ప్రవచిస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పాలన, బీఆర్ఎస్ కౌంటర్లు చూస్తున్న వారికి సరిగ్గా ఇలాంటి ఫీలింగే కలుగుతోంది. ఒకపార్టీ చేసింది తప్పుపట్టిన పార్టీ తిరిగి అదే చేస్తుండటం… తాము దర్జాగా చేసిన దాన్ని ఇప్పుడు అదే పార్టీ మహాపాపంగా చూస్తుండటం తెలంగాణ రాజకీయాల్లోని పెద్ద కామెడీ!
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోని అనేకానేక అంశాల్లో నిరుద్యోగ ఆవేదన అనేది ప్రముఖంగా పేర్కొనవచ్చు. ఉద్యోగాలు నింపండి మహప్రబో అంటే వారిని పట్టించుకున్నవారే లేరు. ఇదే సమయంలో గత ఏడాది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ హైదరాబాద్కు వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కేంద్రంగా పేరొందిన అశోక్ నగర్లో నిరుద్యోగులను కలిసి వారితో ముచ్చటించారు. ఆయన విద్యార్థులకు టీ తాగించారు. దీంతోపాటుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వచ్చే నెలతో ఏడాది పూర్తి కావస్తోంది కూడా! ఇదే సమయంలో కుల గణన సంప్రదింపుల సమావేశానికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ రాష్ట్రానికి విచ్చేస్తుంటే… ఉద్యోగార్థులు ఆసక్తికర డిమాండ్లు పెట్టారు.
ప్రభుత్వ ఉద్యోగార్థుల వేదిక అయిన అశోక్ నగర్కు సమీపంలోని బావర్చీ హోటల్ వద్దకు రాహుల్ గాంధీ రావాలంటూ కొందరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ హోటల్కు వచ్చి తమతో బిర్యానీ తినాలని, నిరుద్యోగ సమస్యల గురించి చర్చించాలని అంటున్నారు. అయితే, దీన్ని తెలివిగా బీఆర్ఎస్ పార్టీ ఉపయోగించుకుంది. బిర్యానీ తింటూ ఉద్యోగాల విషయం మాట్లాడుకుందామని బీఆర్ఎస్ నేతలు ఆ హోటల్కు వెళ్లారు. బావర్చీ హోటల్లో ఓ ఖాళీ కుర్చీని కూడా రాహుల్ గాంధీ కోసం వేసి, దానిపై ఆయన పేరును రాశారు.ఇది సహజంగానే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, దీనిపై కాంగ్రెస్ స్పందించలేదు. మొత్తంగా అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నపుడు మరోలా చేయడంలో బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు రాటుదేలిపోయాయని అంటున్నారు.
This post was last modified on November 5, 2024 7:26 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…