గత ఐదేళ్ల పాలనతో పోల్చుకుంటే.. ఇప్పుడు చాలా మెరుగైన పాలన సాగుతోందని.. ఏపీకి సంబంధించిన వ్యవహారాలను పరిశీలిస్తున్న మేధావులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల ఆహ్వానం, ఆర్ధిక స్థిరత్వం వంటి విషయాల్లో సర్కారు ఆలోచనాత్మక ధోరణితో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా ఏపీ ఆశావహ రహదారిపై ప్రయాణం సాగిస్తున్నట్టు వారు చెబుతున్నారు.
గత 5 ఏళ్లుగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీ కి ఆర్థిక స్థిరత్వం తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని వారు అభినందిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం విభజన తర్వాత.. మరీ ముఖ్యంగా వైసీపీ పాలనలో అప్పుల కుప్పగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు వేస్తున్న అడుగులు ఏపీపై మంచి అభిప్రాయం కలిగిస్తున్నాయని అంటున్నారు. ఇది భవిష్యత్తులో ఏపీకి మేలు చేస్తుందని చెబుతున్నారు.
మరో ముఖ్యమైన విషయం.. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురాగలిగిన ప్రాజెక్టులు, పెట్టుబడులు తీసుకొచ్చారు. దీనికి కేంద్రంతో మంచి సంబంధాలు నడిపిన ముఖ్యమంత్రి, టీడీపీ ఢిల్లీ టీమ్.. లావు, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, ఎంపీలు చేసిన కృషిని మేధావులు మెచ్చుకుంటున్నారు. అదేసమయంలో కేంద్రంలోని బిజెపి కూడా ఏపీ విషయంలో సానుకూలంగా ముందుకు సాగుతుండడాన్ని వారు స్వాగతిస్తున్నారు.
ఇక, పెట్టుబడుల విషయంలో చంద్రబాబు, నారా లోకేష్లు చేస్తున్న కృషి కూడా జాతీయ స్థాయిలో చర్చకు వస్తోంది. గత 5 ఏళ్ళుగా ఏపీ నుంచి పెట్టుబడులు వెళ్లిపోయాయి.. ఆ స్థితి నుంచి కేవలం నాలుగున్నర నెలల లోనే పెట్టుబడుల వరద వచ్చేటట్టు చేస్తున్నరు. ఇంటా బయటా తేడా లేకుండా.. పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నాలు ముందుకు సాగుతున్నాయి. మరో నెల, రెండు మాసాల్లోనే ఏపీకి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని తద్వారా ఏపీ దూసుకుపోవడం ఖాయమని మేధావులు తేల్చి చెబుతున్నారు.
This post was last modified on November 4, 2024 11:38 am
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…