గత ఐదేళ్ల పాలనతో పోల్చుకుంటే.. ఇప్పుడు చాలా మెరుగైన పాలన సాగుతోందని.. ఏపీకి సంబంధించిన వ్యవహారాలను పరిశీలిస్తున్న మేధావులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల ఆహ్వానం, ఆర్ధిక స్థిరత్వం వంటి విషయాల్లో సర్కారు ఆలోచనాత్మక ధోరణితో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా ఏపీ ఆశావహ రహదారిపై ప్రయాణం సాగిస్తున్నట్టు వారు చెబుతున్నారు.
గత 5 ఏళ్లుగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీ కి ఆర్థిక స్థిరత్వం తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని వారు అభినందిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం విభజన తర్వాత.. మరీ ముఖ్యంగా వైసీపీ పాలనలో అప్పుల కుప్పగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు వేస్తున్న అడుగులు ఏపీపై మంచి అభిప్రాయం కలిగిస్తున్నాయని అంటున్నారు. ఇది భవిష్యత్తులో ఏపీకి మేలు చేస్తుందని చెబుతున్నారు.
మరో ముఖ్యమైన విషయం.. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురాగలిగిన ప్రాజెక్టులు, పెట్టుబడులు తీసుకొచ్చారు. దీనికి కేంద్రంతో మంచి సంబంధాలు నడిపిన ముఖ్యమంత్రి, టీడీపీ ఢిల్లీ టీమ్.. లావు, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, ఎంపీలు చేసిన కృషిని మేధావులు మెచ్చుకుంటున్నారు. అదేసమయంలో కేంద్రంలోని బిజెపి కూడా ఏపీ విషయంలో సానుకూలంగా ముందుకు సాగుతుండడాన్ని వారు స్వాగతిస్తున్నారు.
ఇక, పెట్టుబడుల విషయంలో చంద్రబాబు, నారా లోకేష్లు చేస్తున్న కృషి కూడా జాతీయ స్థాయిలో చర్చకు వస్తోంది. గత 5 ఏళ్ళుగా ఏపీ నుంచి పెట్టుబడులు వెళ్లిపోయాయి.. ఆ స్థితి నుంచి కేవలం నాలుగున్నర నెలల లోనే పెట్టుబడుల వరద వచ్చేటట్టు చేస్తున్నరు. ఇంటా బయటా తేడా లేకుండా.. పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నాలు ముందుకు సాగుతున్నాయి. మరో నెల, రెండు మాసాల్లోనే ఏపీకి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని తద్వారా ఏపీ దూసుకుపోవడం ఖాయమని మేధావులు తేల్చి చెబుతున్నారు.
This post was last modified on November 4, 2024 11:38 am
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…