గత ఐదేళ్ల పాలనతో పోల్చుకుంటే.. ఇప్పుడు చాలా మెరుగైన పాలన సాగుతోందని.. ఏపీకి సంబంధించిన వ్యవహారాలను పరిశీలిస్తున్న మేధావులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల ఆహ్వానం, ఆర్ధిక స్థిరత్వం వంటి విషయాల్లో సర్కారు ఆలోచనాత్మక ధోరణితో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా ఏపీ ఆశావహ రహదారిపై ప్రయాణం సాగిస్తున్నట్టు వారు చెబుతున్నారు.
గత 5 ఏళ్లుగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీ కి ఆర్థిక స్థిరత్వం తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని వారు అభినందిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం విభజన తర్వాత.. మరీ ముఖ్యంగా వైసీపీ పాలనలో అప్పుల కుప్పగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు వేస్తున్న అడుగులు ఏపీపై మంచి అభిప్రాయం కలిగిస్తున్నాయని అంటున్నారు. ఇది భవిష్యత్తులో ఏపీకి మేలు చేస్తుందని చెబుతున్నారు.
మరో ముఖ్యమైన విషయం.. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురాగలిగిన ప్రాజెక్టులు, పెట్టుబడులు తీసుకొచ్చారు. దీనికి కేంద్రంతో మంచి సంబంధాలు నడిపిన ముఖ్యమంత్రి, టీడీపీ ఢిల్లీ టీమ్.. లావు, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, ఎంపీలు చేసిన కృషిని మేధావులు మెచ్చుకుంటున్నారు. అదేసమయంలో కేంద్రంలోని బిజెపి కూడా ఏపీ విషయంలో సానుకూలంగా ముందుకు సాగుతుండడాన్ని వారు స్వాగతిస్తున్నారు.
ఇక, పెట్టుబడుల విషయంలో చంద్రబాబు, నారా లోకేష్లు చేస్తున్న కృషి కూడా జాతీయ స్థాయిలో చర్చకు వస్తోంది. గత 5 ఏళ్ళుగా ఏపీ నుంచి పెట్టుబడులు వెళ్లిపోయాయి.. ఆ స్థితి నుంచి కేవలం నాలుగున్నర నెలల లోనే పెట్టుబడుల వరద వచ్చేటట్టు చేస్తున్నరు. ఇంటా బయటా తేడా లేకుండా.. పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నాలు ముందుకు సాగుతున్నాయి. మరో నెల, రెండు మాసాల్లోనే ఏపీకి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని తద్వారా ఏపీ దూసుకుపోవడం ఖాయమని మేధావులు తేల్చి చెబుతున్నారు.
This post was last modified on November 4, 2024 11:38 am
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…