ముంబైలో సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి, (ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నేత) బాబా సిద్ధికి దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడైన సిద్ధికి సుపారి కిల్లర్ల చేతిలో హత్యకు గురి కావడం కలకలం రేపింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ పని చేసిందని ప్రకటించుకుంది. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ కు కూడా రెండు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్ రావడం సంచలనం రేపుతోంది.
10 రోజుల్లో తన పదవికి యోగి రాజీనామా చేయకుంటే సిద్ధికి మాదిరిగానే హత్య చేస్తామని ముంబై పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించాడు. ఆ కాల్ ను ట్రేస్ చేసే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. బెదిరింపులకు పాల్పడ్డ ఆగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిద్ధికి హత్యకు గురయ్యే 15 రోజుల ముందు ఈ తరహాలోనే ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం తెలిసిందే. సరిగ్గా పదిహేను రోజుల తర్వాత సిద్ధికీని బాంద్రాలో కాల్చి చంపారు.
సిద్ధికీ తనయుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్ధికి ఆఫీస్ ముందు బాబా సిద్ధికి పై దుండగులు కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో కుప్పకూలిన సిద్ధికి ఆసుపత్రికి తరలించేలోపే మరణించారు. బాబా సిద్ధికి హత్య, సల్మాన్ ఖాన్ కు బెదిరింపుల నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ను చంపుతామంటూ వచ్చిన బెదిరింపు కాల్ ను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.
This post was last modified on November 4, 2024 11:20 am
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…
తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్లో 105 స్థానాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా…
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం…
కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట……
సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది.…