నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవమానం జరిగింది. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన కూటమి పార్టీల సమన్వయ సమావేశం సందర్భంగా వేమిరెడ్డికి అధికారులు బొకే అందించకపోవడం షాకింగ్ గా మారింది. ఈ సమావేశంలో వేమిరెడ్డితోపాటు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, మహమ్మద్ ఫరూక్, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో మంత్రులకు మాత్రమే అధికారులు బొకేలు అందజేసి వేదికపై ఉన్న వేమిరెడ్డిన మరిచారు.
దీంతో, ఆగ్రహానికి గురైన వేమిరెడ్డి వేదిక నుంచి కిందకు దిగి వెళ్లిపోయారు. ఆయన కారు ఎక్కబోతుండగా సంబంధిత అధికారులు వచ్చి క్షమాపణలు చెప్పారు. వేమిరెడ్డికి సర్ది చెప్పేందుకు ఓ మహిళా అదికారి ప్రయత్నించారు. అయితే, తీవ్ర అసహనానికి లోనైన వేమిరెడ్డి ఆ సారీ మీ దగ్గరే ఉంచుకోండి అంటూ కారు ఎక్కారు. కారులో ఎక్కిన తర్వాత ఆనం రామ నారాయణ రెడ్డి వచ్చి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వేమిరెడ్డి వినలేదు.
తొలిసారి ఇటువంటి సమావేశానికి తాను వచ్చానని, ఇకపై రాబోనని అసహనం వ్యక్తం చేశారు. గౌరవం లేని చోట ఉండనని కారులో అక్కడి నుంచి వేమిరెడ్డి వెళ్లిపోయారు. అందరి తరఫున వేమిరెడ్డిని ఆనం క్షమాపణ కోరనా వేమిరెడ్డి హర్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత అధికారుల తీరుపై మంత్రి ఆనం మండిపడ్డారు. ఇంకోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా చూడాలని కలెక్టర్కు ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
This post was last modified on November 4, 2024 11:16 am
నిన్న చెన్నై లవ్ స్టోరీ నుంచి ఫస్ట్ ఆడియో సింగల్ రిలీజయ్యింది. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియా జంటగా నటిస్తున్న…
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించి ఇప్పుడో అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిపోరాటం చేస్తున్న తమిళ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధ్యక్షుడు, దళపతి విజయ్ రెండు స్థానాలనుంచి పోటీ…
అమెరికా డాలర్ తో రూపాయి మారకం విలువ అంతకంతకూ తగ్గుతోంది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో రూపాయి జీవన…
తెలంగాణలో తీవ్ర రాజకీయ వివాదానికి దారి తీసిన `కాళేశ్వరం` ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన ప్రకటన చేసింది. కాళేశ్వరం…
అనుమానాలే నిజం కాబోతున్నాయి. గత రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ పెద్ది సినిమాను మరోసారి వాయిదా వేయబోతున్నారు…