నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవమానం జరిగింది. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన కూటమి పార్టీల సమన్వయ సమావేశం సందర్భంగా వేమిరెడ్డికి అధికారులు బొకే అందించకపోవడం షాకింగ్ గా మారింది. ఈ సమావేశంలో వేమిరెడ్డితోపాటు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, మహమ్మద్ ఫరూక్, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో మంత్రులకు మాత్రమే అధికారులు బొకేలు అందజేసి వేదికపై ఉన్న వేమిరెడ్డిన మరిచారు.
దీంతో, ఆగ్రహానికి గురైన వేమిరెడ్డి వేదిక నుంచి కిందకు దిగి వెళ్లిపోయారు. ఆయన కారు ఎక్కబోతుండగా సంబంధిత అధికారులు వచ్చి క్షమాపణలు చెప్పారు. వేమిరెడ్డికి సర్ది చెప్పేందుకు ఓ మహిళా అదికారి ప్రయత్నించారు. అయితే, తీవ్ర అసహనానికి లోనైన వేమిరెడ్డి ఆ సారీ మీ దగ్గరే ఉంచుకోండి అంటూ కారు ఎక్కారు. కారులో ఎక్కిన తర్వాత ఆనం రామ నారాయణ రెడ్డి వచ్చి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వేమిరెడ్డి వినలేదు.
తొలిసారి ఇటువంటి సమావేశానికి తాను వచ్చానని, ఇకపై రాబోనని అసహనం వ్యక్తం చేశారు. గౌరవం లేని చోట ఉండనని కారులో అక్కడి నుంచి వేమిరెడ్డి వెళ్లిపోయారు. అందరి తరఫున వేమిరెడ్డిని ఆనం క్షమాపణ కోరనా వేమిరెడ్డి హర్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత అధికారుల తీరుపై మంత్రి ఆనం మండిపడ్డారు. ఇంకోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా చూడాలని కలెక్టర్కు ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
This post was last modified on November 4, 2024 11:16 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…