నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవమానం జరిగింది. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన కూటమి పార్టీల సమన్వయ సమావేశం సందర్భంగా వేమిరెడ్డికి అధికారులు బొకే అందించకపోవడం షాకింగ్ గా మారింది. ఈ సమావేశంలో వేమిరెడ్డితోపాటు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, మహమ్మద్ ఫరూక్, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో మంత్రులకు మాత్రమే అధికారులు బొకేలు అందజేసి వేదికపై ఉన్న వేమిరెడ్డిన మరిచారు.
దీంతో, ఆగ్రహానికి గురైన వేమిరెడ్డి వేదిక నుంచి కిందకు దిగి వెళ్లిపోయారు. ఆయన కారు ఎక్కబోతుండగా సంబంధిత అధికారులు వచ్చి క్షమాపణలు చెప్పారు. వేమిరెడ్డికి సర్ది చెప్పేందుకు ఓ మహిళా అదికారి ప్రయత్నించారు. అయితే, తీవ్ర అసహనానికి లోనైన వేమిరెడ్డి ఆ సారీ మీ దగ్గరే ఉంచుకోండి అంటూ కారు ఎక్కారు. కారులో ఎక్కిన తర్వాత ఆనం రామ నారాయణ రెడ్డి వచ్చి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వేమిరెడ్డి వినలేదు.
తొలిసారి ఇటువంటి సమావేశానికి తాను వచ్చానని, ఇకపై రాబోనని అసహనం వ్యక్తం చేశారు. గౌరవం లేని చోట ఉండనని కారులో అక్కడి నుంచి వేమిరెడ్డి వెళ్లిపోయారు. అందరి తరఫున వేమిరెడ్డిని ఆనం క్షమాపణ కోరనా వేమిరెడ్డి హర్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత అధికారుల తీరుపై మంత్రి ఆనం మండిపడ్డారు. ఇంకోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా చూడాలని కలెక్టర్కు ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
This post was last modified on November 4, 2024 11:16 am
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…