నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవమానం జరిగింది. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన కూటమి పార్టీల సమన్వయ సమావేశం సందర్భంగా వేమిరెడ్డికి అధికారులు బొకే అందించకపోవడం షాకింగ్ గా మారింది. ఈ సమావేశంలో వేమిరెడ్డితోపాటు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, మహమ్మద్ ఫరూక్, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో మంత్రులకు మాత్రమే అధికారులు బొకేలు అందజేసి వేదికపై ఉన్న వేమిరెడ్డిన మరిచారు.
దీంతో, ఆగ్రహానికి గురైన వేమిరెడ్డి వేదిక నుంచి కిందకు దిగి వెళ్లిపోయారు. ఆయన కారు ఎక్కబోతుండగా సంబంధిత అధికారులు వచ్చి క్షమాపణలు చెప్పారు. వేమిరెడ్డికి సర్ది చెప్పేందుకు ఓ మహిళా అదికారి ప్రయత్నించారు. అయితే, తీవ్ర అసహనానికి లోనైన వేమిరెడ్డి ఆ సారీ మీ దగ్గరే ఉంచుకోండి అంటూ కారు ఎక్కారు. కారులో ఎక్కిన తర్వాత ఆనం రామ నారాయణ రెడ్డి వచ్చి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వేమిరెడ్డి వినలేదు.
తొలిసారి ఇటువంటి సమావేశానికి తాను వచ్చానని, ఇకపై రాబోనని అసహనం వ్యక్తం చేశారు. గౌరవం లేని చోట ఉండనని కారులో అక్కడి నుంచి వేమిరెడ్డి వెళ్లిపోయారు. అందరి తరఫున వేమిరెడ్డిని ఆనం క్షమాపణ కోరనా వేమిరెడ్డి హర్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత అధికారుల తీరుపై మంత్రి ఆనం మండిపడ్డారు. ఇంకోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా చూడాలని కలెక్టర్కు ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
This post was last modified on November 4, 2024 11:16 am
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…