ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 120 రోజులపాటు విజయవంతమైన పాలన అందించిన కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే, ఈ నెల ఆఖరులోపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముగియనుంది.
ఈ నేపథ్యంలోనే ఈ లోపు వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఈనెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 11వ తేదీ ఉదయం 10 గంటలకు వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
నవంబరు 11 నుంచి మొత్తం 10 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్ తో పాటుగా ఇతర కీలక బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, గత అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టిన వైసీపీ సభ్యులు ఈ సమావేశాలకు కూడా గైర్హాజరవుతారని హాజరవుతారని టాక్ వస్తుంది. 11 మంది సభ్యులు మాత్రమే ఉండడం, ప్రతిపక్ష హోదా దక్కకపోవడం వంటి కారణాల నేపథ్యంలో వైసీపీ సభ్యులు ఈ సమావేశాలకు కూడా హాజరు కాకుండా ఏదో ఒక కారణం చెప్పాలని చూస్తున్నారని తెలుస్తోంది.
ఒకవేళ వైసీపీ సభ్యులు సభకు హాజరైతే మాత్రం ఈసారి సమావేశాలు ఆసక్తికరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రుషికొండ భవనాలను సందర్శించిన చంద్రబాబు ఆ వ్యవహారంపై సభలో మాట్లాడే అవకాశాలున్నాయి.
500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ భవనాలు కట్టడంపై జగన్ ను సభలో చంద్రబాబు కార్నర్ చేసే అవకాశం ఉంది. గత శాసనసభ సమావేశాలకు గైర్హాజరైన జగన్ ఢిల్లీలో ధర్నా చేయడంపై విమర్శలు వచ్చాయి. మరి, ఈ సారైనా జగన్ సభకు వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on November 3, 2024 10:18 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…