ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 120 రోజులపాటు విజయవంతమైన పాలన అందించిన కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే, ఈ నెల ఆఖరులోపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముగియనుంది.
ఈ నేపథ్యంలోనే ఈ లోపు వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఈనెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 11వ తేదీ ఉదయం 10 గంటలకు వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
నవంబరు 11 నుంచి మొత్తం 10 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్ తో పాటుగా ఇతర కీలక బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, గత అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టిన వైసీపీ సభ్యులు ఈ సమావేశాలకు కూడా గైర్హాజరవుతారని హాజరవుతారని టాక్ వస్తుంది. 11 మంది సభ్యులు మాత్రమే ఉండడం, ప్రతిపక్ష హోదా దక్కకపోవడం వంటి కారణాల నేపథ్యంలో వైసీపీ సభ్యులు ఈ సమావేశాలకు కూడా హాజరు కాకుండా ఏదో ఒక కారణం చెప్పాలని చూస్తున్నారని తెలుస్తోంది.
ఒకవేళ వైసీపీ సభ్యులు సభకు హాజరైతే మాత్రం ఈసారి సమావేశాలు ఆసక్తికరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రుషికొండ భవనాలను సందర్శించిన చంద్రబాబు ఆ వ్యవహారంపై సభలో మాట్లాడే అవకాశాలున్నాయి.
500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ భవనాలు కట్టడంపై జగన్ ను సభలో చంద్రబాబు కార్నర్ చేసే అవకాశం ఉంది. గత శాసనసభ సమావేశాలకు గైర్హాజరైన జగన్ ఢిల్లీలో ధర్నా చేయడంపై విమర్శలు వచ్చాయి. మరి, ఈ సారైనా జగన్ సభకు వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on November 3, 2024 10:18 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…