Political News

గోరంట్ల మాధవ్ పై వాసిరెడ్డి పద్మ కేసు

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బాధ్యత గల ఎంపీ పదవిలో ఉన్న మాధవ్ వీడియో వ్యవహారం లోక్ సభలో కూడా దుమారం రేపింది. అయితే, అధికార పార్టీ లో ఉన్న కారణంతో మాధవ్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలోనే అత్యాచార బాధితుల పేర్లను బహిరంగంగా మాధవ్ ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అత్యాచార బాధితుల పట్ల గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు అమానవీయమని పద్మ మండిపడ్డారు. ఈ ప్రకారం మాధవ్ పై చర్యలు తీసుకోవాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు పద్మ ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి గురైన బాధితుల పేర్లను మాధవ్ నిస్సిగ్గుగా బయటకు వెల్లడించారని, అది దుర్మార్గమని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. మాజీ ఎంపీ సభ్య సమాజం తలదించుకునేలా ఈ రకంగా అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గోరంట్ల మాధవ్ వంటి వారిపై ఫోక్సో చట్టం కింద చర్యలు తీసుకోవాలని పద్మ డిమాండ్ చేశారు. మాధవ్ పై పోక్సో చట్టం కింద నమోదు చేయాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశానని చెప్పారు. గోరంట్ల వ్యాఖ్యలను సమర్థిస్తూ వైసీపీకి చెందిన మీడియా సంస్థలు వార్తలు ప్రచారం చేశాయని, ఇప్పటికీ వాటిని తొలగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై ఆ పార్టీకి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం అని ఎద్దేవా చేశారు. గోరంట్ల మాధవ్ పై సైబర్ క్రైమ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశానని పద్మ చెప్పారు. మాధవ్ మరి కొద్ది రోజుల్లో అరెస్ట్ కాక తప్పదని వాసిరెడ్డి పద్మ చెప్పారు.

తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని పద్మ అన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తనకు ఆప్తులని పద్మ చెప్పుకొచ్చారు. వైసీపీకి ఇటీవల రాజీనామా చేసిన పద్మ ఆ తర్వాత మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Satya

Recent Posts

ప్రెగ్నెంట్ అన్నారు… క్రేజీ మూవీ చేస్తోంది

టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌…

2 hours ago

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

3 hours ago

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ?

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

5 hours ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

9 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

9 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

11 hours ago