వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బాధ్యత గల ఎంపీ పదవిలో ఉన్న మాధవ్ వీడియో వ్యవహారం లోక్ సభలో కూడా దుమారం రేపింది. అయితే, అధికార పార్టీ లో ఉన్న కారణంతో మాధవ్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలోనే అత్యాచార బాధితుల పేర్లను బహిరంగంగా మాధవ్ ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అత్యాచార బాధితుల పట్ల గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు అమానవీయమని పద్మ మండిపడ్డారు. ఈ ప్రకారం మాధవ్ పై చర్యలు తీసుకోవాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు పద్మ ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి గురైన బాధితుల పేర్లను మాధవ్ నిస్సిగ్గుగా బయటకు వెల్లడించారని, అది దుర్మార్గమని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. మాజీ ఎంపీ సభ్య సమాజం తలదించుకునేలా ఈ రకంగా అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోరంట్ల మాధవ్ వంటి వారిపై ఫోక్సో చట్టం కింద చర్యలు తీసుకోవాలని పద్మ డిమాండ్ చేశారు. మాధవ్ పై పోక్సో చట్టం కింద నమోదు చేయాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశానని చెప్పారు. గోరంట్ల వ్యాఖ్యలను సమర్థిస్తూ వైసీపీకి చెందిన మీడియా సంస్థలు వార్తలు ప్రచారం చేశాయని, ఇప్పటికీ వాటిని తొలగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై ఆ పార్టీకి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం అని ఎద్దేవా చేశారు. గోరంట్ల మాధవ్ పై సైబర్ క్రైమ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశానని పద్మ చెప్పారు. మాధవ్ మరి కొద్ది రోజుల్లో అరెస్ట్ కాక తప్పదని వాసిరెడ్డి పద్మ చెప్పారు.
తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని పద్మ అన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తనకు ఆప్తులని పద్మ చెప్పుకొచ్చారు. వైసీపీకి ఇటీవల రాజీనామా చేసిన పద్మ ఆ తర్వాత మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on November 2, 2024 4:39 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…