వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బాధ్యత గల ఎంపీ పదవిలో ఉన్న మాధవ్ వీడియో వ్యవహారం లోక్ సభలో కూడా దుమారం రేపింది. అయితే, అధికార పార్టీ లో ఉన్న కారణంతో మాధవ్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలోనే అత్యాచార బాధితుల పేర్లను బహిరంగంగా మాధవ్ ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అత్యాచార బాధితుల పట్ల గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు అమానవీయమని పద్మ మండిపడ్డారు. ఈ ప్రకారం మాధవ్ పై చర్యలు తీసుకోవాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు పద్మ ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి గురైన బాధితుల పేర్లను మాధవ్ నిస్సిగ్గుగా బయటకు వెల్లడించారని, అది దుర్మార్గమని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. మాజీ ఎంపీ సభ్య సమాజం తలదించుకునేలా ఈ రకంగా అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోరంట్ల మాధవ్ వంటి వారిపై ఫోక్సో చట్టం కింద చర్యలు తీసుకోవాలని పద్మ డిమాండ్ చేశారు. మాధవ్ పై పోక్సో చట్టం కింద నమోదు చేయాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశానని చెప్పారు. గోరంట్ల వ్యాఖ్యలను సమర్థిస్తూ వైసీపీకి చెందిన మీడియా సంస్థలు వార్తలు ప్రచారం చేశాయని, ఇప్పటికీ వాటిని తొలగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై ఆ పార్టీకి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం అని ఎద్దేవా చేశారు. గోరంట్ల మాధవ్ పై సైబర్ క్రైమ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశానని పద్మ చెప్పారు. మాధవ్ మరి కొద్ది రోజుల్లో అరెస్ట్ కాక తప్పదని వాసిరెడ్డి పద్మ చెప్పారు.
తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని పద్మ అన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తనకు ఆప్తులని పద్మ చెప్పుకొచ్చారు. వైసీపీకి ఇటీవల రాజీనామా చేసిన పద్మ ఆ తర్వాత మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on November 2, 2024 4:39 pm
మనం సినిమా అక్కినేని కుటుంబానికి ఎంత ప్రత్యేకమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందులో మూడు తరాల అక్కినేని హీరోలు…
ఈ శుక్రవారం విడుదల కానున్న ఎపిక్ సినిమా మీద ప్రేక్షకుల్లో ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. కాకపోతే ఇటీవల…
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులో అరెస్టు చేసి నిర్బంధించిన నాటి పరిణామాలను మంత్రి నారా…
పెద్ద బడ్జెట్లు ముడిపడిన సినిమాలకు రిలీజ్ డేట్లు లాక్ చేసుకోవడం పెద్ద సవాల్ గా మారిపోయింది. ముందు వెనుక పోటీ…
AI వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఓపెన్ఏఐ తీసుకొచ్చిన GPT-6 ఆస్ట్రా ఆ భయాన్ని మరో…
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో అటవీ ప్రాంత ఐదు పిల్ల ఒరాంగుటాన్లు కనిపించడం కలకలం రేపింది. బడపై గ్రామం సమీపంలోని రణకథ…