Political News

సొంత పార్టీలో ఫ‌స్ట్ టైమ్‌.. జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గారు!

రాజ‌కీయాల్లో త‌న‌కు తిరుగులేద‌ని భావించే వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త‌న సొంత పార్టీలో అంతా తానే అయి వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న చెప్పిందే వేదం. ఆయ‌న చేసిందే శాస‌నం. అలా ఉన్న వైసీపీలో అనేక మంది ఇమ‌డ‌లేక‌.. జారిపోయారు. ఎన్నిక‌ల‌కు ముందు కూడా.. అనేక మంది నాయ‌కులు జ‌గ‌న్‌ను బ్ర‌తిమాలారు. త‌మ‌కు ఎలాంటి ఇబ్బందీ లేద‌ని.. టికెట్లు ఇవ్వాల‌ని కోరారు. అయినా.. ఆయ‌న త‌న పంథాను వీడ‌లేదు.

దీంతో ప‌దుల సంఖ్య‌లో నాయ‌కులు అప్ప‌ట్లోనే పార్టీకి దూర‌మ‌య్యారు. ఇక‌, పార్టీ ప‌రిస్థితి ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ముఖ్యంగా 11 స్థానాల‌కు ప‌రిమిత‌మ‌య్యాక‌.. అనేక మంది నాయ‌కులు జంప్ చేసేశారు. పైగా.. పార్టీ ఇప్పుడు చాలా సంక్లిష్ట స‌మ‌యాన్ని స్థితిని కూడా ఎదుర్కొంటోంది. ఇలాంటి స‌మ‌యంలో త‌న పంతం కోసం పాకులాడితే.. పార్టీకి అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌ని అనుకున్నారో..ఏమో.. జ‌గ‌న్ త‌గ్గ‌డం ప్రారంభించారు.

అది కూడా .. త‌న సొంత జిల్లా క‌డ‌ప‌లోనే జ‌గ‌న్ నాలుగు అడుగులు వెన‌క్కి వేయ‌డం.. త‌న మాట‌ను కాద‌న్న వారిని ప‌క్క‌న కూర్చోబెట్టుకుని మ‌రీ.. వారి మాట‌ల‌కు తాను క‌ట్టుబ‌డి నిర్ణ‌యం తీసుకోవ‌డం వంటివి వైసీపీలో చ‌ర్చ‌గా మారింది. క‌డ‌ప‌లోని కీల‌క‌మైన జమ్మలమడుగు నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఇన్ చార్జి వ్యవహారం కొన్నాళ్లుగా రాజ‌కీయ మ‌లుపులు తిరుగుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌ల‌ను త‌మ‌కంటే త‌మ‌కే ఇవ్వాల‌ని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి ప‌ట్టుబ‌డుతున్నారు.

దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. దీనిపై తేలిస్తే త‌ప్ప‌.. తాము ప‌నిచేసేది లేద‌నివారు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఈ సమస్య పరిష్కారానికి స్థానిక నేతలతో పాటు జిల్లా నేతలతో జ‌గ‌న్‌ సుదీర్ఘంగా చర్చించారు. అయినా.. ఎవ‌రి పంతం వారిదే అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారింది. నిజానికి జ‌గ‌న్ చెప్పిన‌ట్టు గ‌తంలో నాయ‌కులు వినేవారు. కానీ, ఇప్పుడు వారు చెప్పిన‌ట్టు జ‌గ‌న్ వినాల్సి వ‌చ్చింది.

దీంతో మూడు మండలాలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మరో మూడు మండలాలకు రామసుబ్బారెడ్డి ఇన్‌చార్జ్ లుగా వ్యవహరించాలని జ‌గ‌న్ చెప్పారు. ఇది ఒక‌ర‌కంగా త‌న నిర్ణ‌యాన్ని తానే వెన‌క్కి తీసుకుని.. నాయ‌కుల నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి న‌ట్టు అయింది. ఇలా.. గ‌తంలో ఎప్పుడూ లేక‌పోవ‌డం.. వైసీపీ అధినేత తొలిసారినాలుగు అడుగులు వెన‌క్కి వేయ‌డం, అది కూడా త‌న సొంత జిల్లాలోనే ఇలా జ‌ర‌గ‌డం వైసీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

18 minutes ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

29 minutes ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

2 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

2 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

2 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

3 hours ago