Political News

సొంత పార్టీలో ఫ‌స్ట్ టైమ్‌.. జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గారు!

రాజ‌కీయాల్లో త‌న‌కు తిరుగులేద‌ని భావించే వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త‌న సొంత పార్టీలో అంతా తానే అయి వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న చెప్పిందే వేదం. ఆయ‌న చేసిందే శాస‌నం. అలా ఉన్న వైసీపీలో అనేక మంది ఇమ‌డ‌లేక‌.. జారిపోయారు. ఎన్నిక‌ల‌కు ముందు కూడా.. అనేక మంది నాయ‌కులు జ‌గ‌న్‌ను బ్ర‌తిమాలారు. త‌మ‌కు ఎలాంటి ఇబ్బందీ లేద‌ని.. టికెట్లు ఇవ్వాల‌ని కోరారు. అయినా.. ఆయ‌న త‌న పంథాను వీడ‌లేదు.

దీంతో ప‌దుల సంఖ్య‌లో నాయ‌కులు అప్ప‌ట్లోనే పార్టీకి దూర‌మ‌య్యారు. ఇక‌, పార్టీ ప‌రిస్థితి ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ముఖ్యంగా 11 స్థానాల‌కు ప‌రిమిత‌మ‌య్యాక‌.. అనేక మంది నాయ‌కులు జంప్ చేసేశారు. పైగా.. పార్టీ ఇప్పుడు చాలా సంక్లిష్ట స‌మ‌యాన్ని స్థితిని కూడా ఎదుర్కొంటోంది. ఇలాంటి స‌మ‌యంలో త‌న పంతం కోసం పాకులాడితే.. పార్టీకి అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌ని అనుకున్నారో..ఏమో.. జ‌గ‌న్ త‌గ్గ‌డం ప్రారంభించారు.

అది కూడా .. త‌న సొంత జిల్లా క‌డ‌ప‌లోనే జ‌గ‌న్ నాలుగు అడుగులు వెన‌క్కి వేయ‌డం.. త‌న మాట‌ను కాద‌న్న వారిని ప‌క్క‌న కూర్చోబెట్టుకుని మ‌రీ.. వారి మాట‌ల‌కు తాను క‌ట్టుబ‌డి నిర్ణ‌యం తీసుకోవ‌డం వంటివి వైసీపీలో చ‌ర్చ‌గా మారింది. క‌డ‌ప‌లోని కీల‌క‌మైన జమ్మలమడుగు నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఇన్ చార్జి వ్యవహారం కొన్నాళ్లుగా రాజ‌కీయ మ‌లుపులు తిరుగుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌ల‌ను త‌మ‌కంటే త‌మ‌కే ఇవ్వాల‌ని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి ప‌ట్టుబ‌డుతున్నారు.

దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. దీనిపై తేలిస్తే త‌ప్ప‌.. తాము ప‌నిచేసేది లేద‌నివారు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఈ సమస్య పరిష్కారానికి స్థానిక నేతలతో పాటు జిల్లా నేతలతో జ‌గ‌న్‌ సుదీర్ఘంగా చర్చించారు. అయినా.. ఎవ‌రి పంతం వారిదే అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారింది. నిజానికి జ‌గ‌న్ చెప్పిన‌ట్టు గ‌తంలో నాయ‌కులు వినేవారు. కానీ, ఇప్పుడు వారు చెప్పిన‌ట్టు జ‌గ‌న్ వినాల్సి వ‌చ్చింది.

దీంతో మూడు మండలాలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మరో మూడు మండలాలకు రామసుబ్బారెడ్డి ఇన్‌చార్జ్ లుగా వ్యవహరించాలని జ‌గ‌న్ చెప్పారు. ఇది ఒక‌ర‌కంగా త‌న నిర్ణ‌యాన్ని తానే వెన‌క్కి తీసుకుని.. నాయ‌కుల నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి న‌ట్టు అయింది. ఇలా.. గ‌తంలో ఎప్పుడూ లేక‌పోవ‌డం.. వైసీపీ అధినేత తొలిసారినాలుగు అడుగులు వెన‌క్కి వేయ‌డం, అది కూడా త‌న సొంత జిల్లాలోనే ఇలా జ‌ర‌గ‌డం వైసీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

This post was last modified on October 31, 2024 12:11 pm

Share

Recent Posts

భీమవరం బ్యాగ్రౌండ్ ఉన్నా వాడుకోలేదా రవితేజ…

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…

5 hours ago

అనుపమకు నరకం చూపించిన అపరిచితుడు

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌దేళ్ల కెరీర్లో పెద్ద‌గా ఎఫైర్ వార్త‌లేమీ వ‌చ్చింది లేదు.…

5 hours ago

షూట్ లేకున్నా ప్రభాస్ ఫౌజి సెట్లోనే

ప్ర‌భాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండ‌దు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ…

5 hours ago

జెన్ జీ ఎఫెక్ట్… కేటీఆర్ ను సీఎం చెయ్యాలంటున్న కేసీఆర్?

ఇదేమీ ఊహాజ‌నిత వార్త‌కాదు. కొంద‌రు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో గ‌త…

6 hours ago

అయ్య‌న్న‌ అలా.. జ‌గ‌న్ ఇలా… ఇద్ద‌రి ఆశ‌లూ తీరేనా?

ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు.. ఎప్ప‌టి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్ప‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ వేదికల‌పైనా ఆయ‌న త‌న వాణిని…

8 hours ago

‘ఇరుముడి’ సరుకులు… అన్నీ సరిపోయాయి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…

9 hours ago