Political News

మోడితో జగన్ భేటి ఫిక్సయ్యిందా ?

ఢిల్లీలో ఏదో జరుగుతోంది. అదేమిటో స్పష్టంగా తెలియకపోయినా ఏదో జరుగుతోందనే అనుమానం మాత్రం అందరిలో పెరిగిపోతోంది. ఎందుకంటే వచ్చే వారంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్రమోడితో భేటి అవబోతున్నారంటూ పార్టిలో ప్రచారం మొదలైంది.

వారం రోజుల క్రితమే కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షాతో జగన్ రెండు సార్లు సమావేశమైన విషయం అందరికీ తెలిసిందే. ఒకసారి అమిత్ షా భేటి అవ్వటమే చాలా ఎక్కువ. అలాంటిది వరుసగా రెండు రోజులు రెండుసార్లు సుదీర్ఘ భేటి అంటే వాళ్ళ మధ్య ఏదో కీలక అంశాలే చర్చకు వచ్చుంటాయనేది అర్ధమవుతోంది.

అమిత్ షా-జగన్ రెండు రోజుల భేటిలో ఏమి జరిగిందో ఇంకా బయటకు రాకుండానే మళ్ళీ ప్రధానితో ముఖ్యమంత్రి భేటి అవబోతున్నారనే ప్రచారం మొదలైందంటే విషయం ఏదో సీరియస్ గానే ఉందని అర్ధమైపోతోంది. నిజానికి కేంద్రంలో వ్యవహారాలకు సంబంధించి అమిత్ షాతో మాట్లాడితేనే సరిపోతుంది. హోంమంత్రే ఆ తర్వాత ఆ విషయాన్ని ప్రధాని చెవిలో వేస్తారు. అలాంటిది జగన్ ఇద్దరితోను భేటి అవబోతున్నారంటేనే అందరిలోను సస్పెన్సు పెరిగిపోతోంది.

జగన్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న తక్షణ సమస్య న్యాయవ్యవస్ధ నుండే. ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు కోర్టులో కేసు వేసేసినా వెంటనే స్టే ఇచ్చేస్తోందనే అభిప్రాయం వైసిపి నేతల్లో ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాల్లో అత్యధికం కోర్టుల జోక్యంతోనే ఆగిపోతోందంటూ అధికారపార్టీ నేతలు మండిపోతున్నారు. హైకోర్టులోని చాలామంది జడ్జీలు ఎవరి ప్రయోజనాలను రక్షించటానికే ప్రయత్నిస్తున్నారంటూ స్వయంగా రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు పార్లమెంటు సమావేశాల్లోనే తీవ్రమైన ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది.

ఈ నేపధ్యంలోనే గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కూడా చాలా తీవ్రంగా స్పందించింది. హై కోర్టు మీద నమ్మకం లేకపోతే పార్లమెంటులో చెప్పి మూయించేసేయండి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు కాకపోతే తామ అధికారాలను వాడాల్సుంటుందంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మొత్తం మీద ప్రభుత్వంపై తనకున్న తీవ్ర అసంతృప్తిని హైకోర్టు చాలా ఘాటుగానే బయటపెట్టింది. అంటే ప్రస్తుతం ప్రభుత్వం-న్యాయవ్యవస్ధల మధ్య పరోక్ష యుద్ధం నడుస్తున్నట్లుగానే భావించాలి.

ఇటువంటి నేపధ్యంలో జగన్ తన భేటిలో అమిత్ షా కు న్యాయవ్యవస్ధలో జరుగుతున్నదంతా వివరించారని సమాచారం. ఈ నేపధ్యంలోనే వచ్చే వారంలో ప్రధానమంత్రిని కలవబోతున్నారంటే విషయం చాలా సీరియస్ అయిపోయిందనే అనిపిస్తోంది. అసలే వైసిపిని ఎన్డీఏలో చేరాల్సిందిగా అమిత్ షా కోరారనే ప్రచారం ఉండనే ఉంది. ఎందుకంటే ఎన్డీఏలో బిజెపికి నమ్మకమైన మిత్రుడు చాలా అవసరం. మరి ఈ విషయంలో జగన్ సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే తన డిమాండ్ల పరిష్కారానికి జగన్ పట్టుబట్టే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.

This post was last modified on October 3, 2020 3:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్యామిలీ మ్యాన్ హీరో చుట్టూ టైటిల్ వివాదం

రామ్ గోపాల్ వర్మ సత్యతో స్టార్ ఆర్టిస్టుగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ తెలుగులోనూ హ్యాపీ, ప్రేమకథ, కొమరం పులి…

22 minutes ago

చిరు సినిమాలో దురంధర్ పాప?

సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో భారీ విజయాన్నందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. దీని కంటే ముందు ఆయన మొదలుపెట్టిన…

46 minutes ago

లడ్డూ విషయం పక్క దారి పట్టేసిందా

తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరింత కాక రేపుతోంది. గత 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటి…

1 hour ago

వారణాసి విశేషాలతో అభిమానుల్లో హుషారు

గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు దర్శనం లేక డీలాపడిన అభిమానులకు ఊరట కలిగించేలా వారణాసి ఇంటర్వ్యూలు విడుదలయ్యాయి. మహేష్…

2 hours ago

ఐమాక్స్ కోసం రాజమౌళి ధర్నా

ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఐతే భారీ చిత్రాల వీక్షణలో అద్భుతమైన అనుభూతిని…

2 hours ago

యాటిట్యూడ్ స్టార్: మృణాల్ తో డేట్.. శ్రీలీలతో పెళ్లట..!

బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తన ప్రతి ప్రెస్ మీట్ లో ఏదో ఒక వైరల్ కంటెంట్ ఇవ్వడం…

3 hours ago