Political News

మోడితో జగన్ భేటి ఫిక్సయ్యిందా ?

ఢిల్లీలో ఏదో జరుగుతోంది. అదేమిటో స్పష్టంగా తెలియకపోయినా ఏదో జరుగుతోందనే అనుమానం మాత్రం అందరిలో పెరిగిపోతోంది. ఎందుకంటే వచ్చే వారంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్రమోడితో భేటి అవబోతున్నారంటూ పార్టిలో ప్రచారం మొదలైంది.

వారం రోజుల క్రితమే కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షాతో జగన్ రెండు సార్లు సమావేశమైన విషయం అందరికీ తెలిసిందే. ఒకసారి అమిత్ షా భేటి అవ్వటమే చాలా ఎక్కువ. అలాంటిది వరుసగా రెండు రోజులు రెండుసార్లు సుదీర్ఘ భేటి అంటే వాళ్ళ మధ్య ఏదో కీలక అంశాలే చర్చకు వచ్చుంటాయనేది అర్ధమవుతోంది.

అమిత్ షా-జగన్ రెండు రోజుల భేటిలో ఏమి జరిగిందో ఇంకా బయటకు రాకుండానే మళ్ళీ ప్రధానితో ముఖ్యమంత్రి భేటి అవబోతున్నారనే ప్రచారం మొదలైందంటే విషయం ఏదో సీరియస్ గానే ఉందని అర్ధమైపోతోంది. నిజానికి కేంద్రంలో వ్యవహారాలకు సంబంధించి అమిత్ షాతో మాట్లాడితేనే సరిపోతుంది. హోంమంత్రే ఆ తర్వాత ఆ విషయాన్ని ప్రధాని చెవిలో వేస్తారు. అలాంటిది జగన్ ఇద్దరితోను భేటి అవబోతున్నారంటేనే అందరిలోను సస్పెన్సు పెరిగిపోతోంది.

జగన్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న తక్షణ సమస్య న్యాయవ్యవస్ధ నుండే. ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు కోర్టులో కేసు వేసేసినా వెంటనే స్టే ఇచ్చేస్తోందనే అభిప్రాయం వైసిపి నేతల్లో ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాల్లో అత్యధికం కోర్టుల జోక్యంతోనే ఆగిపోతోందంటూ అధికారపార్టీ నేతలు మండిపోతున్నారు. హైకోర్టులోని చాలామంది జడ్జీలు ఎవరి ప్రయోజనాలను రక్షించటానికే ప్రయత్నిస్తున్నారంటూ స్వయంగా రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు పార్లమెంటు సమావేశాల్లోనే తీవ్రమైన ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది.

ఈ నేపధ్యంలోనే గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కూడా చాలా తీవ్రంగా స్పందించింది. హై కోర్టు మీద నమ్మకం లేకపోతే పార్లమెంటులో చెప్పి మూయించేసేయండి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు కాకపోతే తామ అధికారాలను వాడాల్సుంటుందంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మొత్తం మీద ప్రభుత్వంపై తనకున్న తీవ్ర అసంతృప్తిని హైకోర్టు చాలా ఘాటుగానే బయటపెట్టింది. అంటే ప్రస్తుతం ప్రభుత్వం-న్యాయవ్యవస్ధల మధ్య పరోక్ష యుద్ధం నడుస్తున్నట్లుగానే భావించాలి.

ఇటువంటి నేపధ్యంలో జగన్ తన భేటిలో అమిత్ షా కు న్యాయవ్యవస్ధలో జరుగుతున్నదంతా వివరించారని సమాచారం. ఈ నేపధ్యంలోనే వచ్చే వారంలో ప్రధానమంత్రిని కలవబోతున్నారంటే విషయం చాలా సీరియస్ అయిపోయిందనే అనిపిస్తోంది. అసలే వైసిపిని ఎన్డీఏలో చేరాల్సిందిగా అమిత్ షా కోరారనే ప్రచారం ఉండనే ఉంది. ఎందుకంటే ఎన్డీఏలో బిజెపికి నమ్మకమైన మిత్రుడు చాలా అవసరం. మరి ఈ విషయంలో జగన్ సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే తన డిమాండ్ల పరిష్కారానికి జగన్ పట్టుబట్టే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.

This post was last modified on October 3, 2020 3:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

4 hours ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

7 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

7 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

10 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

11 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

11 hours ago