Political News

అదానీకి ఆహ్వానం.. ఏపీకి మలుపు!

గౌతం అదానీ. దేశంలోనే అత్యంత రిచ్చెస్ట్ వ్యాపార వేత్త‌. గుజ‌రాత్‌కు చెందిన ఈయ‌న ఇప్పుడు దేశంలోనే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా.. ప‌లు ప్ర‌ముఖ వ్యాపారాలు చేస్తున్నారు. ఆయ‌న ఇప్పుడు ఏపీలోనూ తిరిగి వ్యాపారాలు ప్రారంభించేందుకు.. పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌స్తున్నారు. దీనిని ఆహ్వానించాల్సిన ప‌రిణామంగానే చూడాలి. గ‌తం తాలూకు పొర‌పొచ్చాల‌ను వీడి అదానీ బృందం తాజాగా చంద్ర‌బాబును క‌లుసుకుంది. ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామ‌ని పేర్కొంది. అదీ ఇదీ అనికాదు.. అన్ని రంగాల్లోనూ పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్టు తెలిపింది.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ నుంచి పోర్టుల వ‌ర‌కు, ర‌హ‌దారుల నుంచి ప‌రిశ్ర‌మ‌ల వ‌ర‌కు కూడా.. అదానీ బృందం ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా.. పెట్టుబ‌డుల‌కు తాము ఎలా సిద్ధంగా ఉన్నామో వివ‌రించింది. అంతేకాదు.. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యం లోనూ తాము దోహ‌ద ప‌డ‌తామ‌ని తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం. అమ‌రావ‌తి-విజ‌య‌వాడ‌ల మ‌ధ్య నిర్మించే ర‌హ‌దారుల నిర్మాణం నుంచి కృష్నాన‌దిపై నిర్మించే తీగ‌ల వంతెన‌ల వ‌ర‌కు కూడా పెట్టుబ‌డులు పెట్టేందుకు తాము రెడీ అని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే.. ఈ విష‌యంలో చంద్ర‌బాబు నేరుగా జోక్యం చేసుకోలేదు.

ఆయా ప్రాజెక్టుల అవ‌స‌రం.. సానుకూల‌త‌ను ప‌రిశీలించాల‌ని అధికారుల‌కు అప్ప‌గించారు. నెమ్మ‌దిగా ఈ విష‌యంపై సీఎం చంద్ర‌బాబు దృష్టి పెట్టే అవ‌కాశం ఉంది. ఇలా.. ఎందుకు చేయాల్సి వ‌స్తోందంటే.. అదానీ కంపెనీ పెట్టుబ‌డుల‌పై ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌తిప‌క్షంగా చంద్ర‌బాబు స‌హా ప‌వ‌న్ వంటివారు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. అదానీకి జ‌గ‌న్ రాష్ట్రాన్ని అమ్మేస్తున్నార‌ని.. పోర్టుల‌ను విక్ర‌యిస్తున్నార‌ని కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. కృష్ణ‌ప‌ట్నం ఓడ‌రేవును పూర్తిగా అదానీకి రాసిచ్చేశారంటూ.. కొన్ని మీడియాల్లో క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి.

దీంతో అదానీ ఒక‌సంద‌ర్భంలో బ‌హిరంగ లేఖ కూడా రాసింది. ప్ర‌తిప‌క్షం చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను తిప్పికొడుతున్న‌ట్టు పేర్కొంది. ఈ ప‌రిణామాలు ఇంకా.. చంద్ర‌బాబు మ‌న‌సు నుంచి పోలేదు. దీంతో ఆయ‌న చాలా వ్యూహాత్మ‌కంగా.. అదానీ పెట్టుబ‌డుల వ్య‌వ‌హారంపై అధికారులు ప‌రిశీల‌న చేయాల‌ని చెప్పారు. త‌ర్వాత‌.. ఆయ‌న స‌మీక్షించ‌నున్నారు. అయితే.. పెట్టుబ‌డి దారులుగా ఉన్న వారు రాజ‌కీయాల‌ను కాకుండా.. త‌మ వ్యాపారాల‌నే చూసుకుంటారు కాబ‌ట్టి.. అదానీని ఆహ్వానించ‌డంలో చంద్ర‌బాబుకు త‌ప్పులేదు. ఏపీ అభివృద్ధికి స‌హ‌క‌రించేవారిని పిల‌వ‌డంలోనూ పొర‌పాటు లేదని అంటున్నారు ప‌ర‌శీల‌కులు.

This post was last modified on October 29, 2024 9:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ట్లేదుగా బాబూ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ట్లేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. పెట్టుబడుల‌కు ఎక్క‌డ అవ‌కాశం ఉంటే..…

2 hours ago

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

8 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

10 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

10 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

12 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

12 hours ago