Political News

అదానీకి ఆహ్వానం.. ఏపీకి మలుపు!

గౌతం అదానీ. దేశంలోనే అత్యంత రిచ్చెస్ట్ వ్యాపార వేత్త‌. గుజ‌రాత్‌కు చెందిన ఈయ‌న ఇప్పుడు దేశంలోనే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా.. ప‌లు ప్ర‌ముఖ వ్యాపారాలు చేస్తున్నారు. ఆయ‌న ఇప్పుడు ఏపీలోనూ తిరిగి వ్యాపారాలు ప్రారంభించేందుకు.. పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌స్తున్నారు. దీనిని ఆహ్వానించాల్సిన ప‌రిణామంగానే చూడాలి. గ‌తం తాలూకు పొర‌పొచ్చాల‌ను వీడి అదానీ బృందం తాజాగా చంద్ర‌బాబును క‌లుసుకుంది. ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామ‌ని పేర్కొంది. అదీ ఇదీ అనికాదు.. అన్ని రంగాల్లోనూ పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్టు తెలిపింది.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ నుంచి పోర్టుల వ‌ర‌కు, ర‌హ‌దారుల నుంచి ప‌రిశ్ర‌మ‌ల వ‌ర‌కు కూడా.. అదానీ బృందం ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా.. పెట్టుబ‌డుల‌కు తాము ఎలా సిద్ధంగా ఉన్నామో వివ‌రించింది. అంతేకాదు.. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యం లోనూ తాము దోహ‌ద ప‌డ‌తామ‌ని తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం. అమ‌రావ‌తి-విజ‌య‌వాడ‌ల మ‌ధ్య నిర్మించే ర‌హ‌దారుల నిర్మాణం నుంచి కృష్నాన‌దిపై నిర్మించే తీగ‌ల వంతెన‌ల వ‌ర‌కు కూడా పెట్టుబ‌డులు పెట్టేందుకు తాము రెడీ అని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే.. ఈ విష‌యంలో చంద్ర‌బాబు నేరుగా జోక్యం చేసుకోలేదు.

ఆయా ప్రాజెక్టుల అవ‌స‌రం.. సానుకూల‌త‌ను ప‌రిశీలించాల‌ని అధికారుల‌కు అప్ప‌గించారు. నెమ్మ‌దిగా ఈ విష‌యంపై సీఎం చంద్ర‌బాబు దృష్టి పెట్టే అవ‌కాశం ఉంది. ఇలా.. ఎందుకు చేయాల్సి వ‌స్తోందంటే.. అదానీ కంపెనీ పెట్టుబ‌డుల‌పై ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌తిప‌క్షంగా చంద్ర‌బాబు స‌హా ప‌వ‌న్ వంటివారు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. అదానీకి జ‌గ‌న్ రాష్ట్రాన్ని అమ్మేస్తున్నార‌ని.. పోర్టుల‌ను విక్ర‌యిస్తున్నార‌ని కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. కృష్ణ‌ప‌ట్నం ఓడ‌రేవును పూర్తిగా అదానీకి రాసిచ్చేశారంటూ.. కొన్ని మీడియాల్లో క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి.

దీంతో అదానీ ఒక‌సంద‌ర్భంలో బ‌హిరంగ లేఖ కూడా రాసింది. ప్ర‌తిప‌క్షం చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను తిప్పికొడుతున్న‌ట్టు పేర్కొంది. ఈ ప‌రిణామాలు ఇంకా.. చంద్ర‌బాబు మ‌న‌సు నుంచి పోలేదు. దీంతో ఆయ‌న చాలా వ్యూహాత్మ‌కంగా.. అదానీ పెట్టుబ‌డుల వ్య‌వ‌హారంపై అధికారులు ప‌రిశీల‌న చేయాల‌ని చెప్పారు. త‌ర్వాత‌.. ఆయ‌న స‌మీక్షించ‌నున్నారు. అయితే.. పెట్టుబ‌డి దారులుగా ఉన్న వారు రాజ‌కీయాల‌ను కాకుండా.. త‌మ వ్యాపారాల‌నే చూసుకుంటారు కాబ‌ట్టి.. అదానీని ఆహ్వానించ‌డంలో చంద్ర‌బాబుకు త‌ప్పులేదు. ఏపీ అభివృద్ధికి స‌హ‌క‌రించేవారిని పిల‌వ‌డంలోనూ పొర‌పాటు లేదని అంటున్నారు ప‌ర‌శీల‌కులు.

This post was last modified on October 29, 2024 9:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆర్జీవీ మీద ఇంత గౌరవమా?

రామ్ గోపాల్ వ‌ర్మ అంటే ఒక‌ప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్ట‌ర్. శివ‌, రంగీలా, స‌త్య‌, కంపెనీ, స‌ర్కార్…

1 hour ago

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

4 hours ago

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు…

6 hours ago

కూటమి కట్టక తప్పదేమో జగన్

వ్య‌క్తిగ‌త విష‌యాలే..  జ‌గ‌న్‌కు మైన‌స్ అవుతున్నాయా? ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వా? అంటే.. అవున‌నే సంకేతాలు పార్టీ…

8 hours ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

11 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

11 hours ago