అక్రమం, సక్రమం అనే సంగతి, చర్చ అలా ఉంచితే, సగటు జీవికి ఇల్లు ఓ కల. జీవిత కాల స్వప్నం. అలాంటి స్వప్నం విషయంలో ఎన్నో మోసాలు. ఇంకెన్నో అక్రమాలు మధ్య తరగతి మనుషులను పలకరిస్తుంటాయి, కలవరపాటుకు గురిచేస్తాయి, కన్నీళ్లు పెట్టిస్తాయి. కానీ… ఈ జాబితాలో ప్రభుత్వమే కర్కశంగా ప్రవర్తిస్తే… ఆ కుటుంబం పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహకు అందనిది! ఆపద మొక్కుల వాడని ఏడుకొండల వెంకన్న సన్నిదికి వెళితే…తిరిగి వచ్చేలోగా ఇళ్లు కూల్చివేశారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేశారని ఆ కుటుంబం వాపోతోంది.
కూకట్పల్లి మూసాపేట సర్కిల్ పరిధిలోని బాలాజీనగర్ డివిజన్, బాలాజీనగర్ కాలనీ హెచ్ఐజీ-53లో కటిక నిరుపమారాణి 268 గజాల స్థలంలో ఇంటిని నిర్మించారు. ఈ నిర్మాణం కోసం 2022లో జీహెచ్ఎంసీ ఆఫీస్లో.. స్టిల్ప్లస్-3కి అనుమతి తీసుకొని అదనంగా మరో రెండు అంతస్థులు నిర్మించారు. 8 నెలల క్రితం నిర్మాణం పూర్తయ్యాక ఫ్లాట్స్ అన్నీ అద్దెకిచ్చారు. ఐదో అంతస్థులోని 502 ఫ్లాట్ను నారాయణ దంపతులకు కిరాయికి ఇవ్వగా.. 501తోపాటు మిగతా ఫ్లాట్స్ను కూడా కిరాయికి ఇచ్చారు. 502 ఫ్లాట్లో కిరాయికి ఉంటున్న నారాయణ దంపతులు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతికి వెళ్లారు. శనివారం ఉదయం అధికారుల పర్యవేక్షణలో డిమాల్యుయేషన్ స్క్వాడ్ సిబ్బంది రంగంలోకి దిగి.. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ 502 ఫ్లాట్ను కూల్చివేశారు. దీంతో ఇంట్లోని ఏసీ, ఫ్రిడ్జ్, సోఫాతోపాటు ఇతర సామగ్రి అంతా ధ్వంసమైంది. 15 మంది సిబ్బంది క్షణాల్లో ఫ్లాట్ను కూల్చివేయడం కలకలం రేపింది.
ఈ కూల్చివేతల తీరును గమనించిన స్థానికులు అధికారుల తీరుపై మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇంటిని కూల్చివేసిన అధికారులను ప్రశ్నించారు. నగరంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే అక్రమ నిర్మాణాలు జరిగాయా? అని ప్రశ్నించారు. ఒకవేళ అక్రమ నిర్మాణమైతే ముందుగా నోటీసులిస్తే బాగుండేదనే అభిప్రాయం అధికారులు, సిబ్బందితో వ్యక్తం చేశారు. దైవ దర్శనం కోసమని ఇంటికి తాళం వేసి ఓ కుటుంబమంతా తిరుపతికి వెళ్తే, అది అక్రమ నిర్మాణమంటూ జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయడం సంచలనంగానే కాకుండా కలకలంగా కూడా మారింది.
This post was last modified on October 27, 2024 4:47 pm
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…
సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్ కొట్టాక ఏడాదిన్నరగా వెంకటేష్ ని సోలో హీరోగా దర్శనం చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్న…
హారర్ అంటే కామెడీతో కిచిడి అయిపోయిన ట్రెండ్ లో నేరుగా ఓటిటిలో రిలీజైన మా ఊరి పొలిమేర జనాన్ని భయపెట్టడంలో…
ఒకప్పుడు మూడు నాలుగు సినిమాలు ఒకే రోజు విడుదలైనా బాక్సాఫీస్ కు తట్టుకునే కెపాసిటీ ఉండేది. ఓటిటి, ఇంటర్ నెట్…
తాను హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘రాయన్’ను 2024 సంవత్సరానికి ఉత్తమ ప్రాంతీయ తమిళ చిత్రంగా జాతీయ అవార్డుల జ్యూరీ…
ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…