Political News

హైడ్రా క‌ల‌క‌లం: తిరుప‌తి వెళ్లి వ‌చ్చేలోగా ఇళ్లు కూల్చివేత‌

అక్ర‌మం, స‌క్ర‌మం అనే సంగ‌తి, చ‌ర్చ అలా ఉంచితే, స‌గ‌టు జీవికి ఇల్లు ఓ క‌ల‌. జీవిత కాల స్వ‌ప్నం. అలాంటి స్వ‌ప్నం విష‌యంలో ఎన్నో మోసాలు. ఇంకెన్నో అక్ర‌మాలు మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌నుషుల‌ను ప‌ల‌క‌రిస్తుంటాయి, క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తాయి, క‌న్నీళ్లు పెట్టిస్తాయి. కానీ… ఈ జాబితాలో ప్ర‌భుత్వ‌మే క‌ర్క‌శంగా ప్ర‌వ‌ర్తిస్తే… ఆ కుటుంబం ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహకు అంద‌నిది! ఆప‌ద మొక్కుల వాడ‌ని ఏడుకొండల వెంక‌న్న స‌న్నిదికి వెళితే…తిరిగి వ‌చ్చేలోగా ఇళ్లు కూల్చివేశారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేశార‌ని ఆ కుటుంబం వాపోతోంది.

కూకట్‌పల్లి మూసాపేట సర్కిల్‌ పరిధిలోని బాలాజీనగర్‌ డివిజన్‌, బాలాజీనగర్‌ కాలనీ హెచ్ఐజీ-53లో కటిక నిరుపమారాణి 268 గజాల స్థలంలో ఇంటిని నిర్మించారు. ఈ నిర్మాణం కోసం 2022లో జీహెచ్ఎంసీ ఆఫీస్‌లో.. స్టిల్‌ప్లస్‌-3కి అనుమతి తీసుకొని అదనంగా మరో రెండు అంతస్థులు నిర్మించారు. 8 నెలల క్రితం నిర్మాణం పూర్తయ్యాక ఫ్లాట్స్‌ అన్నీ అద్దెకిచ్చారు. ఐదో అంతస్థులోని 502 ఫ్లాట్‌ను నారాయణ దంపతులకు కిరాయికి ఇవ్వగా.. 501తోపాటు మిగతా ఫ్లాట్స్‌ను కూడా కిరాయికి ఇచ్చారు. 502 ఫ్లాట్‌లో కిరాయికి ఉంటున్న నారాయణ దంపతులు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతికి వెళ్లారు. శనివారం ఉదయం అధికారుల పర్యవేక్షణలో డిమాల్యుయేషన్ స్క్వాడ్‌ సిబ్బంది రంగంలోకి దిగి.. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ 502 ఫ్లాట్‌ను కూల్చివేశారు. దీంతో ఇంట్లోని ఏసీ, ఫ్రిడ్జ్‌, సోఫాతోపాటు ఇతర సామగ్రి అంతా ధ్వంసమైంది. 15 మంది సిబ్బంది క్షణాల్లో ఫ్లాట్‌ను కూల్చివేయడం క‌ల‌క‌లం రేపింది.

ఈ కూల్చివేత‌ల తీరును గమనించిన స్థానికులు అధికారుల తీరుపై మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇంటిని కూల్చివేసిన అధికారులను ప్రశ్నించారు. నగరంలో ఎక్క‌డా లేని విధంగా ఇక్క‌డే అక్రమ నిర్మాణాలు జరిగాయా? అని ప్రశ్నించారు. ఒకవేళ అక్రమ నిర్మాణమైతే ముందుగా నోటీసులిస్తే బాగుండేదనే అభిప్రాయం అధికారులు, సిబ్బందితో వ్యక్తం చేశారు. దైవ దర్శనం కోసమని ఇంటికి తాళం వేసి ఓ కుటుంబమంతా తిరుపతికి వెళ్తే, అది అక్రమ నిర్మాణమంటూ జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయ‌డం సంచ‌ల‌నంగానే కాకుండా క‌ల‌క‌లంగా కూడా మారింది.

This post was last modified on October 27, 2024 4:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

24 minutes ago

కామారెడ్డిలో ఏం జరుగుతోంది?

కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…

47 minutes ago

19 ఏళ్ల త‌ర్వాత‌.. అయేషా అంత్య‌క్రియ‌లు.. ఏం జరిగింది?

అయేషా మీరా. ఉమ్మ‌డి ఏపీలో 2007లో ఓ వ్య‌క్తి కామ దాహానికి బ‌లి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…

4 hours ago

ప్రభాస్ మాట సాయం… కపుల్ నడకలో వేగం

గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…

4 hours ago

ఆహా… కనులవిందుగా కమల్ & రజిని

గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్…

4 hours ago

ట్రంప్ నకు సుప్రీం షాక్.. భారత్ కు లాభమా? నష్టమా?

అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏది చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అంటూ కౌరవుడు సినిమాలో నాగబాబు మాదిరిగా…

4 hours ago