అక్రమం, సక్రమం అనే సంగతి, చర్చ అలా ఉంచితే, సగటు జీవికి ఇల్లు ఓ కల. జీవిత కాల స్వప్నం. అలాంటి స్వప్నం విషయంలో ఎన్నో మోసాలు. ఇంకెన్నో అక్రమాలు మధ్య తరగతి మనుషులను పలకరిస్తుంటాయి, కలవరపాటుకు గురిచేస్తాయి, కన్నీళ్లు పెట్టిస్తాయి. కానీ… ఈ జాబితాలో ప్రభుత్వమే కర్కశంగా ప్రవర్తిస్తే… ఆ కుటుంబం పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహకు అందనిది! ఆపద మొక్కుల వాడని ఏడుకొండల వెంకన్న సన్నిదికి వెళితే…తిరిగి వచ్చేలోగా ఇళ్లు కూల్చివేశారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేశారని ఆ కుటుంబం వాపోతోంది.
కూకట్పల్లి మూసాపేట సర్కిల్ పరిధిలోని బాలాజీనగర్ డివిజన్, బాలాజీనగర్ కాలనీ హెచ్ఐజీ-53లో కటిక నిరుపమారాణి 268 గజాల స్థలంలో ఇంటిని నిర్మించారు. ఈ నిర్మాణం కోసం 2022లో జీహెచ్ఎంసీ ఆఫీస్లో.. స్టిల్ప్లస్-3కి అనుమతి తీసుకొని అదనంగా మరో రెండు అంతస్థులు నిర్మించారు. 8 నెలల క్రితం నిర్మాణం పూర్తయ్యాక ఫ్లాట్స్ అన్నీ అద్దెకిచ్చారు. ఐదో అంతస్థులోని 502 ఫ్లాట్ను నారాయణ దంపతులకు కిరాయికి ఇవ్వగా.. 501తోపాటు మిగతా ఫ్లాట్స్ను కూడా కిరాయికి ఇచ్చారు. 502 ఫ్లాట్లో కిరాయికి ఉంటున్న నారాయణ దంపతులు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతికి వెళ్లారు. శనివారం ఉదయం అధికారుల పర్యవేక్షణలో డిమాల్యుయేషన్ స్క్వాడ్ సిబ్బంది రంగంలోకి దిగి.. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ 502 ఫ్లాట్ను కూల్చివేశారు. దీంతో ఇంట్లోని ఏసీ, ఫ్రిడ్జ్, సోఫాతోపాటు ఇతర సామగ్రి అంతా ధ్వంసమైంది. 15 మంది సిబ్బంది క్షణాల్లో ఫ్లాట్ను కూల్చివేయడం కలకలం రేపింది.
ఈ కూల్చివేతల తీరును గమనించిన స్థానికులు అధికారుల తీరుపై మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇంటిని కూల్చివేసిన అధికారులను ప్రశ్నించారు. నగరంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే అక్రమ నిర్మాణాలు జరిగాయా? అని ప్రశ్నించారు. ఒకవేళ అక్రమ నిర్మాణమైతే ముందుగా నోటీసులిస్తే బాగుండేదనే అభిప్రాయం అధికారులు, సిబ్బందితో వ్యక్తం చేశారు. దైవ దర్శనం కోసమని ఇంటికి తాళం వేసి ఓ కుటుంబమంతా తిరుపతికి వెళ్తే, అది అక్రమ నిర్మాణమంటూ జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయడం సంచలనంగానే కాకుండా కలకలంగా కూడా మారింది.
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…