Political News

హైడ్రా క‌ల‌క‌లం: తిరుప‌తి వెళ్లి వ‌చ్చేలోగా ఇళ్లు కూల్చివేత‌

అక్ర‌మం, స‌క్ర‌మం అనే సంగ‌తి, చ‌ర్చ అలా ఉంచితే, స‌గ‌టు జీవికి ఇల్లు ఓ క‌ల‌. జీవిత కాల స్వ‌ప్నం. అలాంటి స్వ‌ప్నం విష‌యంలో ఎన్నో మోసాలు. ఇంకెన్నో అక్ర‌మాలు మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌నుషుల‌ను ప‌ల‌క‌రిస్తుంటాయి, క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తాయి, క‌న్నీళ్లు పెట్టిస్తాయి. కానీ… ఈ జాబితాలో ప్ర‌భుత్వ‌మే క‌ర్క‌శంగా ప్ర‌వ‌ర్తిస్తే… ఆ కుటుంబం ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహకు అంద‌నిది! ఆప‌ద మొక్కుల వాడ‌ని ఏడుకొండల వెంక‌న్న స‌న్నిదికి వెళితే…తిరిగి వ‌చ్చేలోగా ఇళ్లు కూల్చివేశారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేశార‌ని ఆ కుటుంబం వాపోతోంది.

కూకట్‌పల్లి మూసాపేట సర్కిల్‌ పరిధిలోని బాలాజీనగర్‌ డివిజన్‌, బాలాజీనగర్‌ కాలనీ హెచ్ఐజీ-53లో కటిక నిరుపమారాణి 268 గజాల స్థలంలో ఇంటిని నిర్మించారు. ఈ నిర్మాణం కోసం 2022లో జీహెచ్ఎంసీ ఆఫీస్‌లో.. స్టిల్‌ప్లస్‌-3కి అనుమతి తీసుకొని అదనంగా మరో రెండు అంతస్థులు నిర్మించారు. 8 నెలల క్రితం నిర్మాణం పూర్తయ్యాక ఫ్లాట్స్‌ అన్నీ అద్దెకిచ్చారు. ఐదో అంతస్థులోని 502 ఫ్లాట్‌ను నారాయణ దంపతులకు కిరాయికి ఇవ్వగా.. 501తోపాటు మిగతా ఫ్లాట్స్‌ను కూడా కిరాయికి ఇచ్చారు. 502 ఫ్లాట్‌లో కిరాయికి ఉంటున్న నారాయణ దంపతులు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతికి వెళ్లారు. శనివారం ఉదయం అధికారుల పర్యవేక్షణలో డిమాల్యుయేషన్ స్క్వాడ్‌ సిబ్బంది రంగంలోకి దిగి.. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ 502 ఫ్లాట్‌ను కూల్చివేశారు. దీంతో ఇంట్లోని ఏసీ, ఫ్రిడ్జ్‌, సోఫాతోపాటు ఇతర సామగ్రి అంతా ధ్వంసమైంది. 15 మంది సిబ్బంది క్షణాల్లో ఫ్లాట్‌ను కూల్చివేయడం క‌ల‌క‌లం రేపింది.

ఈ కూల్చివేత‌ల తీరును గమనించిన స్థానికులు అధికారుల తీరుపై మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇంటిని కూల్చివేసిన అధికారులను ప్రశ్నించారు. నగరంలో ఎక్క‌డా లేని విధంగా ఇక్క‌డే అక్రమ నిర్మాణాలు జరిగాయా? అని ప్రశ్నించారు. ఒకవేళ అక్రమ నిర్మాణమైతే ముందుగా నోటీసులిస్తే బాగుండేదనే అభిప్రాయం అధికారులు, సిబ్బందితో వ్యక్తం చేశారు. దైవ దర్శనం కోసమని ఇంటికి తాళం వేసి ఓ కుటుంబమంతా తిరుపతికి వెళ్తే, అది అక్రమ నిర్మాణమంటూ జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయ‌డం సంచ‌ల‌నంగానే కాకుండా క‌ల‌క‌లంగా కూడా మారింది.

This post was last modified on October 27, 2024 4:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్టాలిన్ కు ఇచ్చి పడేసిన పవన్

జనసేన ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. కొన్ని…

1 hour ago

ఛావాకు రెండో బ్రేక్ పడింది

మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో…

2 hours ago

ఖైదీ 2 ఎప్పుడు రావొచ్చంటే

సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…

2 hours ago

దాశరథి, గద్దర్, శ్రీపతి రాములు.. ఎందరెందరో..?

జనసేన ఆవిర్భావ వేడుకల్లో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆ పార్టీ అదినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… తనను…

3 hours ago

భయం లేదు కాబట్టే… బద్దలు కొట్టాం: పవన్ కల్యాణ్

భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…

4 hours ago

11వ ఆవిర్భావం పూర్తి.. 11 స్థానాల‌కు ప‌రిమితం!: ప‌వ‌న్ కల్యాణ్‌

భార‌త దేశానికి బ‌హుభాషే మంచిద‌ని జ‌న‌సేన అధినేత, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జ‌రిగిన…

4 hours ago