తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయాల్లో హైడ్రా, మూసి రివర్ ఫ్రంట్ వంటి వాటితో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు నూతనంగా అందుబాటులోకి వస్తున్న అవకాశాలను ప్రవేశం చేసుకునేందుకు యంగ్ ఇండియా స్కేల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అలాంటి స్కిల్ యూనివర్సిటీకి తాజాగా ఒకనాడు తను విమర్శలు గుప్పించిన సంస్థ సహకారం అందిస్తానంటే రేవంత్ రెడ్డి ఓకే చెప్పేయడం ఆసక్తికరంగా మారింది.
విద్యార్థులకు నూతన అవకాశాల్లో నైపుణ్యాలు నేర్పించేందుకు, అవకాశాలు అందిపుచ్చుకునేందుకు హైదరాబాద్ శివార్లలో కందుకూరు మండలంలో మీర్ ఖాన్ పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్ట్ లోనే యూనివర్సిటీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అక్కడ అధునాతన బోధన సదుపాయాలతో పాటు విద్యార్థులకు అన్ని వసతులుండేలా క్యాంపస్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తమ ఆలోచనలకు మద్దతుగా నిలిచే సంస్థలకు స్వాగతం చెప్తూ…ఈ మేరకు ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇలాంటి జాబితాలో తాజాగా తెలుగు రాష్ట్రాల్లో పేరెన్నికగన్న మేఘా సంస్థ చేరింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.200 కోట్ల నిధులను ఆ సంస్థ కేటాయించింది.
శనివారం సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మేఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆ కంపెనీ ప్రతినిధుల బృందం సంప్రదింపులు జరిపింది. మొత్తం యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మేఘా కంపెనీ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధుల నుంచి రూ.200 కోట్లు కేటాయించింది. యూనివర్సిటీ క్యాంపస్ లో అవసరమైన భవనాలన్నింటినీ నిర్మించే బాధ్యతలను స్వీకరించింది. ఇప్పటికే ఆర్కిటెక్ట్ నిపుణులతో తయారు చేయించిన యూనివర్సిటీ భవన నిర్మాణ నమూనాలను, డిజైన్లను ఈ సమావేశంలో ప్రదర్శించారు. వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. నవంబర్ 8వ తేదీ నుంచి యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, ప్రభుత్వం తరఫున అందుకు అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
ప్రపంచ స్థాయి అధునాతన నమూనాలతో అన్ని మౌలిక వసతులు ఉండేలా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతేకాకుండా ఈ కీలక సమావేశంలో తన మంత్రివర్గ సహచరులను సైతం ఆయన భాగం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా పాల్గొన్నారు. ఒకనాడు గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్ తో అత్యంత సఖ్యత కనబర్చిన మేఘా కంపెనీతో తన కలల వేదిక అయిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియ కోసం ఒప్పందం రేవంత్ రెడ్డి కుదుర్చుకోవడం కీలకమైన పరిణామమని పలువురు పేర్కొంటున్నారు.
This post was last modified on October 27, 2024 4:33 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…