తీవ్ర రాజకీయ కలకలం చోటు చేసుకునే పరిణామం ఒకటి చోటు చేసుకుంది. వీకెండ్ వేళ.. నగర శివారులోని ఒక ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరగటం.. ఈ సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ వోటీ పోలీసులు రంగంలోకి దిగి.. రేవ్ పార్టీని భగ్నం చేయటంతో పాటు.. ఒకరిద్దరు డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ ఫామ్ హౌస్ మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ కు చెందింది కావటం ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారింది.
ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగిందన్న సమాచారం వెలుగు చూసింది. అదే సమయంలో విదేశీ మద్యంతో పాటు కొన్ని డ్రగ్స్ ను కూడా పోలీసులు సీజ్ చేసినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు క్యాసినో కూడా ఆడినట్లుగా తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన మెటీరియల్ ను ఎస్ వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ హైప్రొఫైల్ కేసుకు సంబంధించి లభించిన ఆధారాలను పరిగణలోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.
రేవ్ పార్టీకి సంబంధించిన మద్యం బాటిళ్ల ఫోటోలతో పాటు.. మరికొన్ని అంశాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓవైపు రాజకీయంగా రచ్చ నడుస్తున్న వేళ.. కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ ఏర్పాటు చేయటమే పెద్ద తప్పుగా అభిప్రాయపడుతున్నారు. ఈ ఉదంతం రాకీయంగా కూడా గులాబీ పార్టీకి ఎదురుదెబ్బగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ ఉదంతంపై కేటీఆర ఎలారియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.
This post was last modified on %s = human-readable time difference 1:55 pm
మీడియా మీటింగ్ పెట్టి.. మీడియాపైనే రుసరుసలాడిన ఘనత వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు సాయిరెడ్డికే దక్కుతుంది. తాజాగా ఆయన…
ప్లాన్ లేనిదే.. ఏ పని కూడా చేయని టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్ వేసుకుని ముందుకు సాగుతున్నారు.…
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఇవాళ మరో ప్యాన్ ఇండియా మూవీ రణమండల ప్రకటించింది. హీరో, దర్శకుడు తదితర వివరాలు…
వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య ఒక్కసారిగా పేలిన సరస్వతీ పవర్ షేర్ బాంబు ఘటన…
నాగచైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ తండేల్ మీద క్రమంగా ఒత్తిడి…
పుణేలో జరిగిన రెండో టెస్టులో టీమిండియాకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. కివీస్ జట్టు 113 పరుగుల తేడాతో భారత్ను…