తీవ్ర రాజకీయ కలకలం చోటు చేసుకునే పరిణామం ఒకటి చోటు చేసుకుంది. వీకెండ్ వేళ.. నగర శివారులోని ఒక ఫామ్ హౌస్ లో పార్టీ జరగటం.. ఈ సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ వోటీ పోలీసులు రంగంలోకి దిగి.. పార్టీని భగ్నం చేయటంతో పాటు.. ఒకరు డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ ఫామ్ హౌస్ మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ కు చెందింది కావటం ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారింది.
ఈ పార్టీలో విదేశీ మద్యంతో పాటు కొన్ని డ్రగ్స్ ను కూడా పోలీసులు సీజ్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ హైప్రొఫైల్ కేసుకు సంబంధించి లభించిన ఆధారాలను పరిగణలోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.
పార్టీకి సంబంధించిన మద్యం బాటిళ్ల ఫోటోలతో పాటు.. మరికొన్ని అంశాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓవైపు రాజకీయంగా రచ్చ నడుస్తున్న వేళ.. కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ ఏర్పాటు చేయటమే పెద్ద తప్పుగా అభిప్రాయపడుతున్నారు. ఈ ఉదంతం రాకీయంగా కూడా గులాబీ పార్టీకి ఎదురుదెబ్బగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ ఉదంతంపై కేటీఆర ఎలారియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.
This post was last modified on October 27, 2024 3:58 pm
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…