తీవ్ర రాజకీయ కలకలం చోటు చేసుకునే పరిణామం ఒకటి చోటు చేసుకుంది. వీకెండ్ వేళ.. నగర శివారులోని ఒక ఫామ్ హౌస్ లో పార్టీ జరగటం.. ఈ సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ వోటీ పోలీసులు రంగంలోకి దిగి.. పార్టీని భగ్నం చేయటంతో పాటు.. ఒకరు డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ ఫామ్ హౌస్ మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ కు చెందింది కావటం ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారింది.
ఈ పార్టీలో విదేశీ మద్యంతో పాటు కొన్ని డ్రగ్స్ ను కూడా పోలీసులు సీజ్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ హైప్రొఫైల్ కేసుకు సంబంధించి లభించిన ఆధారాలను పరిగణలోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.
పార్టీకి సంబంధించిన మద్యం బాటిళ్ల ఫోటోలతో పాటు.. మరికొన్ని అంశాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓవైపు రాజకీయంగా రచ్చ నడుస్తున్న వేళ.. కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ ఏర్పాటు చేయటమే పెద్ద తప్పుగా అభిప్రాయపడుతున్నారు. ఈ ఉదంతం రాకీయంగా కూడా గులాబీ పార్టీకి ఎదురుదెబ్బగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ ఉదంతంపై కేటీఆర ఎలారియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.
This post was last modified on October 27, 2024 3:58 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…