మీడియా మీటింగ్ పెట్టి.. మీడియాపైనే రుసరుసలాడిన ఘనత వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు సాయిరెడ్డికే దక్కుతుంది. తాజాగా ఆయన హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 62 నిమిషాల పాటు ఆయన పాత సంగతులు తవ్వి తీశారు. వైఎస్ ఎంత ఆస్తులు పంచారు. అసలు వైఎస్ ఫ్యామిలీ ఏయే ఆస్తులు పంచుకుంది.. అని మొదలు పెట్టి.. అనేక విషయాలు చెప్పుకొచ్చారు.
అనంతరం.. మీడియాను కూడా ప్రశ్నించమని కోరారు. ఈ క్రమంలో అసలు షర్మిలతో వివాదం ప్రారంభమైనప్పుడు మీరు(సాయిరెడ్డి- సుబ్బారెడ్డి) మధ్యవర్తులుగా ఏమీ చేయలేదా? అన్న ప్రశ్న వచ్చింది. దీనికి సాయిరెడ్డి చాలానే చేశాం.. అనేక చర్చలు కూడా జరిపాం.. అన్నారు. అయితే.. ఆ చర్చల సారాంశం ఏంటి? ఎందుకు ఇలా జరిగిందన్న ప్రశ్న వెంటనే తెరమీదికి వచ్చింది. దీనికి మాత్రం సాయిరెడ్డి రుసరుసలాడారు.
కొన్ని క్షణాలు మౌనంగా ఉండి.. మీరైనా.. నేనైనా లిమిట్ క్రాస్ చేయకూడదు! అంటూ.. మీడియా ప్రతినిధి పై విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. మీరు అడుగుతున్నది లిమిట్ క్రాస్ చేసినట్టుగానే ఉందన్నారు. ఒకానొక క్షణంలో సాయిరెడ్డి మొహంలో ఏదో దాస్తున్నారన్న అనుమానం కలిగించేలా ఫీలింగ్ రావడం విశేషం. ఇక, ఏది అడిగినా.. ఆయన చిరాకుగా వ్యవహరించడం.. తప్పించుకునే ధోరణి కూడా కనిపించింది. మరోవైపు.. అడిగిన ఒకటి రెండు ప్రశ్నలకు కూడా ఆయన చంద్రబాబు చుట్టూ తిప్పారు.
దీంతో మిగిలిన మీడియా ప్రతినిధులు మౌనంగా ఉండిపోయారు. తాను చెప్పాలని అనుకున్నది చెప్పిన సాయిరెడ్డి .. ఇవే ప్రశ్నలు షర్మిలను ఎందుకు అడగలేదని ఎదురు ప్రశ్నించడం గమనార్హం. అంతేకాదు .. ఏదైనా ఉంటే షర్మిలనే ప్రశ్నించాలని కూడా చెప్పుకొచ్చారు. మొత్తంగా సాయిరెడ్డి ఒకరకంగా .. మీడియా ప్రతినిధులను తన హావ భావాల ద్వారా.. ప్రశ్నించకుండా చేశారనే చెప్పాలి.
This post was last modified on October 27, 2024 1:52 pm
తిరుమలపై మరో దుష్ప్రచారం జరగడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కారణం ఎవరు? ఎక్కడ నుంచి జరిగింది?…
ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జగన్.. దానికి తగిన విధంగా పనిచే స్తున్నారా? అనేది…
తనపై వైసీపీ నాయకులు సహా.. ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్…
నటీనటుల నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబట్టుకోవడంలో ఇండియాలో మణిరత్నంను మించిన దర్శకుడు లేడంటే అతిశయోక్తి కాదు. మొదట్నుంచి ఆయన సినిమాలను గమనిస్తే…
దురంధర్ తర్వాత బాలీవుడ్ లో స్పై సినిమాలను చూసే దృక్పథం మారిపోయింది. నమ్మశక్యం కాని ఫైట్లు, ఫిజిక్స్ ని ఛాలెంజ్…
సహజంగా భర్త ఎంత సంపాయిస్తున్నాడో.. ఏం చేస్తున్నాడో.. తెలుసుకునేందుకు భార్యలు ఆసక్తి చూపుతారు. ఈ విషయం తెలుసుకునేందుకు వారు ఉత్సాహం…