Political News

ఏకమైన పాత మిత్రులు..నాయకత్వం చొరవే కారణమా ?

విజయనగరం జిల్లా అధికారపార్టీలో ఇపుడిదే అంశంపై జోరుగా చర్చలు జరుగుతోంది. జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి మధ్య సంబంధాలు ఉప్పు-నిప్పుగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. చాలా కాలంగా వీళ్ళద్దరి మధ్య మాటలు కూడా పెద్దగా ఉండటం లేదు. అలాంటి ఈ ఇద్దరు కొద్ది రోజులుగా జిల్లాలో చట్టాపట్టాలేసుకుని తిరిగేస్తుండటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి వీళ్ళద్దరు ఒకపుడు ఆప్తమిత్రులే. కానీ మద్యలో ఏమైందో ఏమో బద్ద శతృవులైపోయారు. అలాంటిది ఇపుడు మళ్ళీ కలుసుకోవటం అంటే ఏదో జరిగిందన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.

కాంగ్రెస్ పార్టీలో నుండి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినపుడు ముందుగా జిల్లాలో మద్దతు ఇచ్చింది ఇటీవలే మరణించిన పెనుమత్స సాంబశివరాజు. తర్వాత కోలగట్ల చేరటంతో ఆ తర్వాత మరికొందరు నేతలు కాంగ్రెస్ లో నుండి వచ్చి వైసిపిలో చేరారు. అందరికన్నా ఆలస్యంగా వచ్చి పార్టీలో చేరిది బొత్స సత్యనారాయణే అన్న విషయం అందరికీ తెలిసిందే. బొత్స వ్యవహారం ఎలాగుంటుందంటే అదేదో సినిమాలో చెప్పినట్లుగా ’లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తా’ అన్నట్లుగానే ఉంటుంది. అందుకనే చివరిలో వచ్చి పార్టీలో చేరినా ముందు మంత్రయిపోయారు.

బొత్స రాకను అడ్డుకునేందుకు కోలగట్ల చాలా ప్రయత్నాలే చేశారట. కానీ ఎందుకనో సాధ్యం కాలేదు. పార్టీలో చేరిన దగ్గర నుండి బొత్సాదే ఫుల్లు డామినేషన్. పార్టీలో చేరటం ఎంఎల్ఏ టికెట్టు దక్కించుకోవటం, గెలవటం మంత్రయిపోవటం వెంటవెంటనే జరిగిపోయాయి. తాను మాత్రమే టికెట్ దక్కించుకోవటం కాదు. తన కుటుంబంలోని వాళ్ళకే దాదాపు ఏడు టికెట్లు దక్కించుకున్నాడట. దీంతోనే అర్ధమైపోతోంది బొత్స వ్యవహారం ఎంత స్పీడుగా ఉంటుందో. ఇదే సమయంలో కోలగట్ల రాజకీయ జీవితం ఎక్కే మెట్టు దిగే మెట్టులాగుంది. దాంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నట్లుగా తయారైంది కోలగట్ల పరిస్ధితి.

ముందు ఎంఎల్ఏగా గెలిచిన కోలగట్ల తర్వాత ఎంఎల్సీ అయ్యారు. ఆ తర్వాత ఎంఎల్సీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎంఎల్ఏగా పోటి చేసి గెలిచారు. అంతే కోలగట్ల సీన్ అక్కడితో ఫ్రీజ్ అయిపోయింది. మంత్రిగా ముందు కోలగట్ల పేరే వినిపించినా చివరి నిముషంలో విజయవాడలో గెలిచిన వెల్లంపల్లి శ్రీనివాస్ తన్నుకుపోయారు.

సరే ఇన్ని నేపధ్యాల మధ్యలో అసంతృప్తిగా ఉన్న కోలగట్లతో పాటు బొత్సను జగన్మోహన్ రెడ్డి పిలిపించి మాట్లాడారట. కోలగట్ల గెలిచిన విజయనగరం నియోజకవర్గంలో బొత్స జోక్యం వద్దని జగన్ గట్టిగా చెప్పారట. అలాగే కోలగట్లలోని అసంతృప్తి మొత్తాన్ని తొలగించే బాధ్యతను సిఎం బొత్స మీదే ఉంచారట. దాంతో ఇద్దరికీ చేతులు కలపక తప్పలేదు. ఎటూ చేతులు కలిపారు కాబట్టి మళ్ళీ ఇద్దరు బాగా సన్నిహితం అయిపోయినట్లు పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. విడిపోయిన ఇద్దరు మిత్రులు మళ్ళీ కలిసారంటే మంచిదే కదా.

Satya

Recent Posts

పెద్ది ఈవెంట్ లో పవన్ హవా

మెగా హీరోల సినిమాల‌కు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్క‌డో ఒక చోట ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

49 minutes ago

ఆర్సీ 17… చెప్పనన్న సుకుమార్

హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…

1 hour ago

చంద్రబాబు పవన్ పై మాట పడనివ్వరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…

2 hours ago

ఒక్క ఫొటో… అన్ని అనుమానాల‌కూ స‌మాధానం

ప్ర‌తి సంవ‌త్స‌రం విజ‌య్‌కి స్పెష‌ల్ పిక్‌తో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పే త్రిష‌.. ఈసారి చెప్ప‌లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఆయ‌న్ని…

3 hours ago

ఆ ఇద్దరూ కలిసి సాధించారు!

నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…

4 hours ago

ఒక నయనతార.. ఒక త్రిష.. ఒక నివేథా

కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…

6 hours ago