Political News

జగన్ ఆఫర్ ను బయటపెట్టిన షర్మిల

త‌న సోద‌రుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై మ‌రోసారి ష‌ర్మిల తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జమెత్తారు. గ‌త రెండు రోజు లుగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్న స‌రస్వ‌తి షేర్ల వ్య‌వ‌హారంలో ష‌ర్మిల మ‌రోసారి వివ‌ర‌ణ ఇచ్చారు. అస‌లు ఈ కేసు బ‌య‌ట‌కు ఎలా వ‌చ్చింద‌నేది జ‌గన్‌కే తెలియాల‌ని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు.. త‌న‌పై క‌క్షగ‌ట్టి ఆ క‌సిని త‌ల్లిపై చూపిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. తాజాగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి రాసిన బ‌హిరంగ లేఖ‌ను ఆమె .. మీడియాకు విడుద‌ల చేశారు.

ప్ర‌ధానంగా జ‌గ‌న్ ఒక సెటిల్‌మెంటుకు త‌మ‌తో సిద్ధ‌మ‌య్యార‌ని ష‌ర్మిల తెలిపారు. అయితే.. ఆ సెటిల్మెం టుకు తాను ఒప్పుకోలేద‌న్నారు. అందుకే తన‌పై క‌క్ష క‌ట్టిన‌ట్టు ష‌ర్మిల పేర్కొన్నారు. “ఇంతకీ సెటిల్మెం టు ఏంటంటే.. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయిన విష‌యం తెలిసిందే. అయి తే.. ఇలా జ‌ర‌గ‌డానికి.. ష‌ర్మిల కూడా ఒక కార‌ణ‌మ‌ని వైసీపీనాయ‌కులు భావించారు. ఈ క్ర‌మంలో నాతో రాజీ చేసుకునేందుకు ప్ర‌య‌త్నించారు“ అని ష‌ర్మిల వివ‌రించారు.

రాజీలో భాగంగా.. ష‌ర్మిల ఇక నుంచి జ‌గ‌న్‌ను కానీ, అవినాష్‌ను కానీ, భార‌తిని కానీ విమ‌ర్శించ‌కూడ‌ద‌న్న కండిష‌న్లు పెట్టార‌ని ఆమె పేర్కొన్నారు.(అయితే.. దీనికి గాను త‌న‌కు ఏమిస్తార‌న్న‌ది ష‌ర్మిల స్ప‌ష్టం చేయ లేదు) కానీ, విమ‌ర్శ‌లు చేయ‌డం.. అనేది త‌న రాజ‌కీయ వృత్తి ధ‌ర్మం కాబ‌ట్టి.. తాను అందుకు ఒప్పుకో లేద‌ని  ష‌ర్మిల తెలిపారు. అందుకే సెటిల్మెంటు ర‌ద్ద‌యింద‌ని.. దీనిని  మ‌న‌సులో పెట్టుకునే ఇప్పుడు.. త‌న‌పై ఉన్న క‌క్ష‌తో త‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌ను కోర్టుకు ఈడ్చార‌ని ష‌ర్మిల పేర్కొన్నారు.

మా అమ్మ‌పైనే కేసు..

కానీ, ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల కీల‌క విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. ఎన్ సీఎల్‌టీలో జ‌గ‌న్ కేసు వేసింది.. త‌న పై కాద‌ని.. కేవ‌లం త‌మ మాతృమూర్తిపైనేన‌ని ఆమె పేర్కొన్నారు. అందుకే ఆమె త‌ర‌ఫున తాను మాట్లాడా ల్సి వ‌చ్చింద‌ని.. ఏదైమైనా.. ఈవిష‌యాన్ని చాలా రోజులుగా క‌డుపులోనే దాచుకున్నామ‌న్నారు. కానీ, ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చిందో వైసీపీ నాయ‌కులే చెప్పాల‌ని ఆమె నిల‌దీశారు. 

Satya

Recent Posts

రామ్ చరణ్ 17… లాంగ్ వెయిటింగ్ తప్పదు

పెద్ది విజయాన్ని ఆస్వాదిస్తున్న రామ్ చరణ్ త్వరలోనే చేతికి కీలకమైన సర్జరీ చేయించుకోబోతున్నాడు. ప్రమోషన్ల కోసమే దాన్ని బ్రేక్ వేస్తూ…

2 hours ago

వరలక్ష్మి మీద మళ్ళీ ఆరోపణలు

ఆ మధ్య ఎస్ సరస్వతి సినిమా విడుదల టైంలో దర్శక నిర్మాత వరలక్ష్మి శరత్ కుమార్, రచయిత సాయి మాధవ్…

3 hours ago

బొంబాయి మాఫియాలో ‘బాలయ్య’ మాస్

వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని మళ్ళీ చేతులు కలిపారు. ప్రారంభం కావడంలో కొంత…

3 hours ago

‘దురంధర్’ చూసిన కళ్ళకు ‘ఆల్ఫా’ నచ్చేనా

ఎవరు ఔనన్నా కాదన్నా బాలీవుడ్ స్పై థ్రిల్లర్స్ లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమాగా దురంధర్ పేరు…

5 hours ago

అమరావతిలో రూ.2.5 వేల కోట్ల కేంద్ర ప్రాజెక్టు

అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా కాకుండా చేయడం ఇక ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఒక వేళ కూటమి…

6 hours ago

మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్‌.. వైసీపీకి ఇర‌కాటం.. !

నెల్లూరు జిల్లా వైసీపీలో మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్ రాజకీయాలు పార్టీని, వారి కార్యకర్తలను తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురిచేస్తున్నాయి.…

8 hours ago