వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. మంత్రి నారా లోకేష్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. నారా లోకేష్ను పప్పు అంటారని.. అలా అనడమే కరెక్ట్ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని జగన్ ఆరోపించారు. తాజాగా ఆయన గుంటూరులో పర్యటించారు. ఇక్కడి జీజీహెచ్లో సహానా కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోదన్నారు. దీనివల్లే మహిళలపై దాడులు, అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని చెప్పారు. నారా లోకేష్ను పప్పు అనడమే కరెక్ట్ అని వ్యాఖ్యానించారు.
“రాష్ట్రంలో మహిళల సంరక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకువచ్చాం. దిశ యాప్ను కూడా తీసుకువచ్చాం. దీనివల్ల మహిళలకు, ఆడపిల్లలకు ఎలాంటి అవసరం వచ్చినా.. పోలీసులు వెంటనేస్పందించి.. వారిని కాపాడేవారు. అలాంటి దిశ చట్టం తాలూకు కాయితాలను నారా లోకేష్ స్వయంగా తగులబెడతాడా? ఇదేనా ఆయన జ్ఞానం..ఆయన తెలివి తేటలు.. అందుకేఆయనను పప్పు అంటారు. అలా అనడమే కరెక్ట్” అని జగన్ వ్యాఖ్యానించారు. హోం మంత్రి అనిత కూడా తల తొక లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. మహిళా హోం మంత్రి అయి ఉండి.. ఘటనలను ఇంత లైట్ తీసుకుంటారా? అని ప్రశ్నించారు.
పోలీసులు కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటించేందుకే ప్రాదాన్యం ఇస్తున్నట్టు జగన్ చెప్పారు. నారా లోకేష్ చెప్పినట్టే నడుస్తున్నారని అన్నారు. కూటమి సర్కారు హయాంలో ఇప్పటి వరకు 77 మంది మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరిగాయని జగన్ లెక్కలు చెప్పారు. ఏడుగురు మహిళలు హత్యకు గురయ్యారని, ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. దిశ యాప్ ఉండి ఉంటే.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ, భద్రత కూడా ఉండేవని జగన్ అన్నారు. కానీ, దిశ పోలీసు స్టేషన్లను తీసేశారని, దిశ యాప్ను కూడా రద్దు చేశారని ఆయన అన్నారు. దీని వల్ల మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
This post was last modified on October 23, 2024 9:12 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…