Political News

లోకేష్‌ను మరో సారి పప్పు అన్న జ‌గ‌న్

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. మంత్రి నారా లోకేష్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. నారా లోకేష్‌ను ప‌ప్పు అంటార‌ని.. అలా అన‌డ‌మే క‌రెక్ట్ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. తాజాగా ఆయ‌న గుంటూరులో ప‌ర్య‌టించారు. ఇక్క‌డి జీజీహెచ్‌లో స‌హానా కుటుంబాన్ని ఆయ‌న ప‌రామ‌ర్శించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోద‌న్నారు. దీనివల్లే మ‌హిళ‌ల‌పై దాడులు, అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతున్నాయ‌ని చెప్పారు. నారా లోకేష్‌ను ప‌ప్పు అన‌డ‌మే క‌రెక్ట్ అని వ్యాఖ్యానించారు.

“రాష్ట్రంలో మ‌హిళ‌ల సంర‌క్ష‌ణ కోసం దిశ చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చాం. దిశ యాప్‌ను కూడా తీసుకువ‌చ్చాం. దీనివ‌ల్ల మ‌హిళ‌ల‌కు, ఆడ‌పిల్ల‌ల‌కు ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చినా.. పోలీసులు వెంట‌నేస్పందించి.. వారిని కాపాడేవారు. అలాంటి దిశ చ‌ట్టం తాలూకు కాయితాల‌ను నారా లోకేష్ స్వ‌యంగా త‌గుల‌బెడ‌తాడా? ఇదేనా ఆయ‌న జ్ఞానం..ఆయ‌న తెలివి తేట‌లు.. అందుకేఆయ‌న‌ను ప‌ప్పు అంటారు. అలా అన‌డ‌మే క‌రెక్ట్‌” అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. హోం మంత్రి అనిత కూడా త‌ల తొక లేకుండా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌హిళా హోం మంత్రి అయి ఉండి.. ఘ‌ట‌న‌ల‌ను ఇంత లైట్ తీసుకుంటారా? అని ప్ర‌శ్నించారు.

పోలీసులు కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటించేందుకే ప్రాదాన్యం ఇస్తున్న‌ట్టు జ‌గ‌న్ చెప్పారు. నారా లోకేష్ చెప్పిన‌ట్టే న‌డుస్తున్నార‌ని అన్నారు. కూట‌మి సర్కారు హ‌యాంలో ఇప్ప‌టి వ‌ర‌కు 77 మంది మ‌హిళ‌లు, చిన్నారుల‌పై అఘాయిత్యాలు జ‌రిగాయ‌ని జ‌గ‌న్ లెక్క‌లు చెప్పారు. ఏడుగురు మ‌హిళ‌లు హ‌త్య‌కు గుర‌య్యార‌ని, ఐదుగురు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌ని చెప్పారు. దిశ యాప్ ఉండి ఉంటే.. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త కూడా ఉండేవ‌ని జ‌గ‌న్ అన్నారు. కానీ, దిశ పోలీసు స్టేష‌న్ల‌ను తీసేశార‌ని, దిశ యాప్‌ను కూడా ర‌ద్దు చేశార‌ని ఆయ‌న అన్నారు. దీని వ‌ల్ల మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌న్నారు.

This post was last modified on October 23, 2024 9:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

21 minutes ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

38 minutes ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

1 hour ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

2 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

2 hours ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

4 hours ago