Political News

లోకేష్‌ను మరో సారి పప్పు అన్న జ‌గ‌న్

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. మంత్రి నారా లోకేష్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. నారా లోకేష్‌ను ప‌ప్పు అంటార‌ని.. అలా అన‌డ‌మే క‌రెక్ట్ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. తాజాగా ఆయ‌న గుంటూరులో ప‌ర్య‌టించారు. ఇక్క‌డి జీజీహెచ్‌లో స‌హానా కుటుంబాన్ని ఆయ‌న ప‌రామ‌ర్శించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోద‌న్నారు. దీనివల్లే మ‌హిళ‌ల‌పై దాడులు, అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతున్నాయ‌ని చెప్పారు. నారా లోకేష్‌ను ప‌ప్పు అన‌డ‌మే క‌రెక్ట్ అని వ్యాఖ్యానించారు.

“రాష్ట్రంలో మ‌హిళ‌ల సంర‌క్ష‌ణ కోసం దిశ చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చాం. దిశ యాప్‌ను కూడా తీసుకువ‌చ్చాం. దీనివ‌ల్ల మ‌హిళ‌ల‌కు, ఆడ‌పిల్ల‌ల‌కు ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చినా.. పోలీసులు వెంట‌నేస్పందించి.. వారిని కాపాడేవారు. అలాంటి దిశ చ‌ట్టం తాలూకు కాయితాల‌ను నారా లోకేష్ స్వ‌యంగా త‌గుల‌బెడ‌తాడా? ఇదేనా ఆయ‌న జ్ఞానం..ఆయ‌న తెలివి తేట‌లు.. అందుకేఆయ‌న‌ను ప‌ప్పు అంటారు. అలా అన‌డ‌మే క‌రెక్ట్‌” అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. హోం మంత్రి అనిత కూడా త‌ల తొక లేకుండా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌హిళా హోం మంత్రి అయి ఉండి.. ఘ‌ట‌న‌ల‌ను ఇంత లైట్ తీసుకుంటారా? అని ప్ర‌శ్నించారు.

పోలీసులు కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటించేందుకే ప్రాదాన్యం ఇస్తున్న‌ట్టు జ‌గ‌న్ చెప్పారు. నారా లోకేష్ చెప్పిన‌ట్టే న‌డుస్తున్నార‌ని అన్నారు. కూట‌మి సర్కారు హ‌యాంలో ఇప్ప‌టి వ‌ర‌కు 77 మంది మ‌హిళ‌లు, చిన్నారుల‌పై అఘాయిత్యాలు జ‌రిగాయ‌ని జ‌గ‌న్ లెక్క‌లు చెప్పారు. ఏడుగురు మ‌హిళ‌లు హ‌త్య‌కు గుర‌య్యార‌ని, ఐదుగురు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌ని చెప్పారు. దిశ యాప్ ఉండి ఉంటే.. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త కూడా ఉండేవ‌ని జ‌గ‌న్ అన్నారు. కానీ, దిశ పోలీసు స్టేష‌న్ల‌ను తీసేశార‌ని, దిశ యాప్‌ను కూడా ర‌ద్దు చేశార‌ని ఆయ‌న అన్నారు. దీని వ‌ల్ల మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌న్నారు.

This post was last modified on October 23, 2024 9:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

1 hour ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

2 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

3 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

3 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

3 hours ago

షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?

ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…

3 hours ago