వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. మంత్రి నారా లోకేష్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. నారా లోకేష్ను పప్పు అంటారని.. అలా అనడమే కరెక్ట్ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని జగన్ ఆరోపించారు. తాజాగా ఆయన గుంటూరులో పర్యటించారు. ఇక్కడి జీజీహెచ్లో సహానా కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోదన్నారు. దీనివల్లే మహిళలపై దాడులు, అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని చెప్పారు. నారా లోకేష్ను పప్పు అనడమే కరెక్ట్ అని వ్యాఖ్యానించారు.
“రాష్ట్రంలో మహిళల సంరక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకువచ్చాం. దిశ యాప్ను కూడా తీసుకువచ్చాం. దీనివల్ల మహిళలకు, ఆడపిల్లలకు ఎలాంటి అవసరం వచ్చినా.. పోలీసులు వెంటనేస్పందించి.. వారిని కాపాడేవారు. అలాంటి దిశ చట్టం తాలూకు కాయితాలను నారా లోకేష్ స్వయంగా తగులబెడతాడా? ఇదేనా ఆయన జ్ఞానం..ఆయన తెలివి తేటలు.. అందుకేఆయనను పప్పు అంటారు. అలా అనడమే కరెక్ట్” అని జగన్ వ్యాఖ్యానించారు. హోం మంత్రి అనిత కూడా తల తొక లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. మహిళా హోం మంత్రి అయి ఉండి.. ఘటనలను ఇంత లైట్ తీసుకుంటారా? అని ప్రశ్నించారు.
పోలీసులు కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటించేందుకే ప్రాదాన్యం ఇస్తున్నట్టు జగన్ చెప్పారు. నారా లోకేష్ చెప్పినట్టే నడుస్తున్నారని అన్నారు. కూటమి సర్కారు హయాంలో ఇప్పటి వరకు 77 మంది మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరిగాయని జగన్ లెక్కలు చెప్పారు. ఏడుగురు మహిళలు హత్యకు గురయ్యారని, ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. దిశ యాప్ ఉండి ఉంటే.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ, భద్రత కూడా ఉండేవని జగన్ అన్నారు. కానీ, దిశ పోలీసు స్టేషన్లను తీసేశారని, దిశ యాప్ను కూడా రద్దు చేశారని ఆయన అన్నారు. దీని వల్ల మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…