వైసీపీ నేతల నుంచి తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని.. తనను లేపేస్తారన్న భయం కూడా వెంటా డుతోందని ఏపీ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇంటిపై కొందరు రెక్కీ నిర్వహించినట్టు కూడా ఆయన చెప్పారు. తన ఇంటి ఆనుపానులు తెలుసుకుని.. తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రాణ రక్షణకు ప్రభుత్వం మరింత భద్రత కల్పించాలన్నారు.
తనకు కూడా వ్యక్తిగత లైసెన్స్ తుపాకీ కోరుతూ.. ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టనున్నట్టు ఆనం వివరించారు. గత నెలలో తాను నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలోకి ఓ వ్యక్తి స్వామి మాల ధరించి వచ్చిన ట్టు తెలిపారు. ఆ వ్యక్తికి, వైసీపీకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలోనే తన ఇంట్లో ఏ మూల ఏముంది? ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయనే విషయాలను సదరు వ్యక్తి నిశితంగా పరిశీలించిన ట్టు అనుమానం ఉందన్నారు. దీంతో ఆ వ్యక్తిని గుర్తించి పోలీసులకు అప్పగించామన్నారు.
ఇదిలావుంటే.. నియోజకవర్గంలో మునుపెన్నడూ జరగని విధంగా అభివృద్ది పనులు జరుగుతున్నాయని .. వందల కోట్ల రూపాయలు తెచ్చి.. నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నామని.. ఆనం తెలిపారు. అయితే.. దీనిని చూసి వైసీపీ స్థానిక నాయకులు సహించలేక పోతున్నారని.. అందుకే తనను లేపేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆనం ఆరోపించారు. తాజాగా జరిగిన ఘటన దీనికి అద్దం పడుతుందన్నారు. తన ప్రత్యర్థుల నుంచి రక్షణ కోసం ఇకపై లైసెన్సుడ్ గన్ వాడాలని భావిస్తున్నట్లు మంత్రి ఆనం తెలిపారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…