వైసీపీ నేతల నుంచి తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని.. తనను లేపేస్తారన్న భయం కూడా వెంటా డుతోందని ఏపీ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇంటిపై కొందరు రెక్కీ నిర్వహించినట్టు కూడా ఆయన చెప్పారు. తన ఇంటి ఆనుపానులు తెలుసుకుని.. తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రాణ రక్షణకు ప్రభుత్వం మరింత భద్రత కల్పించాలన్నారు.
తనకు కూడా వ్యక్తిగత లైసెన్స్ తుపాకీ కోరుతూ.. ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టనున్నట్టు ఆనం వివరించారు. గత నెలలో తాను నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలోకి ఓ వ్యక్తి స్వామి మాల ధరించి వచ్చిన ట్టు తెలిపారు. ఆ వ్యక్తికి, వైసీపీకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలోనే తన ఇంట్లో ఏ మూల ఏముంది? ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయనే విషయాలను సదరు వ్యక్తి నిశితంగా పరిశీలించిన ట్టు అనుమానం ఉందన్నారు. దీంతో ఆ వ్యక్తిని గుర్తించి పోలీసులకు అప్పగించామన్నారు.
ఇదిలావుంటే.. నియోజకవర్గంలో మునుపెన్నడూ జరగని విధంగా అభివృద్ది పనులు జరుగుతున్నాయని .. వందల కోట్ల రూపాయలు తెచ్చి.. నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నామని.. ఆనం తెలిపారు. అయితే.. దీనిని చూసి వైసీపీ స్థానిక నాయకులు సహించలేక పోతున్నారని.. అందుకే తనను లేపేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆనం ఆరోపించారు. తాజాగా జరిగిన ఘటన దీనికి అద్దం పడుతుందన్నారు. తన ప్రత్యర్థుల నుంచి రక్షణ కోసం ఇకపై లైసెన్సుడ్ గన్ వాడాలని భావిస్తున్నట్లు మంత్రి ఆనం తెలిపారు.
This post was last modified on October 23, 2024 5:56 pm
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…