తెలంగాణ బీజేపీ నాయకుడు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కు.. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్.. తాజాగా లీగల్ నోటీసులు పంపించారు. తన పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని, వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు. లేని పక్షంలో పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుందని నోటీసుల్లో హెచ్చరించారు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా కేటీఆర్.. బండికి లీగల్ నోటీసులు పంపించారు.
“ఈనెల 19న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. నేను డ్రగ్స్ తీసుకుంటానని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డానని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ పేరును కూడా ఆయన ప్రస్తావించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు నా వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయి” అని నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు.
ఏం జరిగింది?
ఇటీవల బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్కు.. కొందరితో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ చేయడంలోనూ సిద్ధహస్తుడని పేర్కొన్నారు. అక్కినేని కుటుంబం వివాదం జరుగుతున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అదే సమయంలో డ్రగ్స్ వ్యవహారాల్లోనూ కేటీఆర్కు సంబంధాలు ఉన్నాయని మరో సంచలన ఆరోపణ చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లోనే తీవ్ర రగడకు దారి తీశాయి.
This post was last modified on October 23, 2024 5:53 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…