తెలంగాణ బీజేపీ నాయకుడు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కు.. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్.. తాజాగా లీగల్ నోటీసులు పంపించారు. తన పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని, వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు. లేని పక్షంలో పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుందని నోటీసుల్లో హెచ్చరించారు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా కేటీఆర్.. బండికి లీగల్ నోటీసులు పంపించారు.
“ఈనెల 19న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. నేను డ్రగ్స్ తీసుకుంటానని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డానని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ పేరును కూడా ఆయన ప్రస్తావించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు నా వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయి” అని నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు.
ఏం జరిగింది?
ఇటీవల బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్కు.. కొందరితో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ చేయడంలోనూ సిద్ధహస్తుడని పేర్కొన్నారు. అక్కినేని కుటుంబం వివాదం జరుగుతున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అదే సమయంలో డ్రగ్స్ వ్యవహారాల్లోనూ కేటీఆర్కు సంబంధాలు ఉన్నాయని మరో సంచలన ఆరోపణ చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లోనే తీవ్ర రగడకు దారి తీశాయి.
This post was last modified on October 23, 2024 5:53 pm
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…