తెలంగాణ బీజేపీ నాయకుడు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కు.. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్.. తాజాగా లీగల్ నోటీసులు పంపించారు. తన పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని, వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు. లేని పక్షంలో పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుందని నోటీసుల్లో హెచ్చరించారు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా కేటీఆర్.. బండికి లీగల్ నోటీసులు పంపించారు.
“ఈనెల 19న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. నేను డ్రగ్స్ తీసుకుంటానని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డానని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ పేరును కూడా ఆయన ప్రస్తావించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు నా వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయి” అని నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు.
ఏం జరిగింది?
ఇటీవల బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్కు.. కొందరితో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ చేయడంలోనూ సిద్ధహస్తుడని పేర్కొన్నారు. అక్కినేని కుటుంబం వివాదం జరుగుతున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అదే సమయంలో డ్రగ్స్ వ్యవహారాల్లోనూ కేటీఆర్కు సంబంధాలు ఉన్నాయని మరో సంచలన ఆరోపణ చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లోనే తీవ్ర రగడకు దారి తీశాయి.
This post was last modified on October 23, 2024 5:53 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…