Political News

గుంటూరు వైసీపీ సైలెంట్‌.. ఏం జ‌రిగింది?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ నివాసం ఉండే జిల్లా గుంటూరు. అలాంటి జిల్లాలో పార్టీ ప‌రుగులు పెట్టాలి. నాయ‌కులు క‌లివిడిగా ఉండాలి. అయితే.. ఆ ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. గుంటూరులో ఒక‌ప్పుడు ఉన్న జోష్ ఇప్పుడు వైసీపీలో క‌నిపించ‌డ‌మే లేద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అనేది ఆస‌క్తిగా మారింది. 2019 ఎన్నిక‌ల్లో విజృంభించిన వైసీపీ తాజా ఎన్నిక‌ల్లో చ‌తికిల ప‌డింది. అయినా.. త‌గుదున‌మ్మా.. అంటూ మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు త‌రచుగా మీడియా ముందుకు వ‌స్తున్నారు. అయితే.. ఆయ‌న హైలెట్ కాలేకపోతున్నారు.

ఇక‌, వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు మీడియా ముందుకు వ‌చ్చిన నాయ‌కులు ఎన్నిక‌ల త‌ర్వాత ఎవ‌రికీ క‌నిపించ‌డం లేదు. దీనికి ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. 1) పార్టీ అదినేత పై అసంతృప్తి. 2) కూట‌మి స‌ర్కారు దూకుడుతో న‌మోద‌వుతున్న కేసులు.. వెలికి తీస్తున్న పాత సంగ‌తులు. దీంతో ఉమ్మ‌డి గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయ‌కులు మీడియా ముందుకు కూడా వ‌చ్చేందుకు సాహ‌సం చేయ‌డం లేదు. మాచ‌ర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి అరెస్టు బెయిల్ త‌ర్వాత‌.. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న క‌నిపించ‌డం లేదు.

ఇక‌, బాప‌ట్ల మాజీ ఎంపీ.. నందిగం సురేష్ అరెస్టు.. జైలు.. ప‌లు కేసుల్లో కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇంకా ఇంకా ఆయ‌న‌పై కేసులు పెరుగుతున్నాయే త‌ప్ప త‌ర‌గ‌డం లేదు. ఇక‌, గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన కిలారి రోశ‌య్య ఇటీవ‌ల పార్టీ మారిపోయారు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ జెండాలు మోసేవారుక‌నిపించ‌డం లేదు. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబ‌త్తుని శివ‌కుమార్‌. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓ వ్య‌క్తిపై చేయి చేసుకున్న ఘ‌ట‌న‌కు సంబంధించిన కేసు న‌డుస్తోంది. దీంతో ఆయ‌న కూడా బ‌య‌ట‌కురావ‌డం లేదు.

మంగ‌ళ‌గిరిలో కీల‌క‌మైన నాయ‌కుడు ఆళ్ల రామ‌కృష్నారెడ్డి ఎన్నిక‌ల త‌ర్వాత అస‌లు ఎక్క‌డున్నారో కూడా తెలియ‌డం లేదు. ఇక్క‌డ నుంచి పోటీ చేసి నారా లోకేష్ చేతిలో ప‌రాజ‌యం పాలైన మురుగుడు లావ‌ణ్య‌ను ఇటీవ‌ల ఇంచార్జ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. దీంతో ఆమె కూడా మౌనంగా ఉన్నారు. ఇక‌, టీడీపీ పాత నేత గంజి చిరంజీవి.. తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో ఆయ‌న ప‌రిస్థితి కూడా వైసీపీకి దూరంగానే ఉన్న‌ట్ట‌యింది. తాడికొండ‌లో టికెట్ తీసుకుని పోటీ చేసి ఓడిపోయిన మాజీ హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత.. తిరిగి త‌న పాత నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌త్తిపాడును అప్ప‌గించాల‌ని గోల చేస్తున్నారు. ఇలా.. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కొక్క విధంగా వైసీపీ గ‌డ్డి ప‌రిస్థితిని ఎదుర్కొంది. ఫ‌లితంగా గుంటూరు వైసీపీలో సైలెంట్ కొన‌సాగుతోంది.

This post was last modified on October 23, 2024 11:21 am

Share

Recent Posts

చెన్నై లవ్ స్టోరీ… ‘సమ్’తృప్తేనా?

డివైడ్ టాక్ తెచ్చుకున్న చిన్న సినిమాలు థియేటర్లలో బలంగా నిలబడ్డం అంటే చిన్న విషయం కాదు. చెన్నై లవ్ స్టోరీ…

4 hours ago

భయపెడుతున్న అమెరికా బాక్సాఫీస్

ఒకప్పుడు యుఎస్‌లో తెలుగు సినిమాలు విడుదల కావడాన్నే గొప్పగా భావించేవాళ్లం. అలాంటిది అది తెలుగు సినిమాలకు పెద్ద మార్కెట్‌గా తయారైంది. మన…

5 hours ago

క్రైమ్ సినిమాలు ఇంకెన్ని తీస్తారయ్యా

మనమేదో ఆహా ఓహో అంటూ ఛాన్స్ దొరికినప్పుడంతా మలయాళం సినిమాలను తెగ పొగిడేస్తూ ఉంటాం కాని అక్కడి దర్శకులు కూడా…

7 hours ago

పీవీఆర్‌లో 175 రూపాయల సినిమా

టికెట్ రేటు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ.. మల్టీప్లెక్సుల్లోనే సినిమాలు చూద్దాం అనుకునే ప్రేక్షకులు పెరిగిపోయారు గత కొన్నేళ్లలో. దాని…

7 hours ago

పోలీసు దెబ్బ: వైసీపీలో `ర‌ప్పా-ర‌ప్పా` పోయిందే

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల్లో భాగంగా ఇటీవల కాలంలో `ర‌ప్పా-ర‌ప్పా` డైలాగులు త‌ర‌చుగా వినిపించేవి. రప్పా-ర‌ప్పా అని రాసున్న బ్యాన‌ర్లు,…

7 hours ago

కనకరాజు కొట్టులో బోణీ బాగుంది

వరుణ్ తేజ్ ప్రస్తుతం మనసులో అనుకుంటున్న మాట ఇదే. కొరియన్ కనకరాజుకి ఒక రోజు ముందే ప్రీమియర్లు వేయడం రిస్కని…

7 hours ago