అన్నా చెల్లెళ్లు కలిసి పోయారని.. ఆస్తుల పంపకాలకు సంబంధించిన వివాదాలను కొలిక్కి తెచ్చుకుంటున్నారని.. వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విషయంలో వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.తరచుగా బెంగళూరుకు వెళ్తున్న జగన్.. ఈ విషయంపై ఎక్కువగానే దృష్టి పెట్టినట్టు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఆస్తుల వివాదం సమసిపోయే దశకు చేరుకుందని అంటున్నారు.
ఇక, షర్మిల వ్యవహార శైలి కూడా గత రెండు మాసాలుగా మారిపోయింది. తరచుగా జగన్ను, వైసీపీని టార్గెట్ చేస్తూ వచ్చిన షర్మిల.. రెండు మాసాలుగా మౌనంగా ఉంటున్నారు. ఎక్కడా జగన్ను కానీ, వైసీపీని కానీ ఆమె టార్గెట్ చేయకపోగా.. కూటమి సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయంగా ఆమెకు ఉండే స్వేచ్ఛను ఎవరూ కాదనరు. కానీ, జగన్ విషయంలో ఆమె కనుక యూటర్న్ తీసుకుని.. రేపు సమర్థించే ప్రయత్నం చేస్తే.. మాత్రం ఆమె వ్యక్తిగతంగా ఇమేజ్ ను కోల్పోతారనేది చర్చగా మారింది.
ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు.. జగన్పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. బాబాయి వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుతో పాటు.. తనను కూడా తీవ్రంగా మోసం చేశారంటూ.. వాడుకుని వదిలేశారంటూ.. ఆమె కన్నీరు కూడా పెట్టుకున్నారు. ప్రజలు దీనిని నమ్మారు. వైసీపీ ఓటమిలో షర్మిల చేసిన వ్యాఖ్యలు, పెట్టుకున్న కన్నీరు కూడా.. ఫలించాయనే చర్చ ఉంది. ఇలాంటి సమయంలో అనూహ్యంగా.. షర్మిల ఇప్పుడు ఆస్తుల పంపకాలకు సంబంధించి యూటర్న్ తీసుకుంటే.. రేపు రాజకీయంగా ఆమె ఫేడ్ అవుట్ అవుతారన్నది విశ్లేషకుల మాట.
కేవలం ఆస్తుల కోసమే షర్మిల రాజకీయాలు చేశారని.. జగన్ను విమర్శించారన్న చర్చ బలపడితే.. ఇక, ఆమెకు సుదీర్ఘకాలంలో పొలిటికల్ ఎఫెక్ట్ పడే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. తెలంగాణలో విఫలమైన ఆమె.. ఏపీలో అడుగు పెట్టిన దరిమిలా.. ప్రజలు ఆమె మాటను విశ్వసించారు. జగన్ పాలన, తనకు అన్యాయం చేశారని, వివేకా హత్య నిందితులను వెనుకేసుకు వస్తున్నారన్న వాదనను కూడా నమ్మి ఆమెను ఫాలో అయ్యారు. జగన్కు దూరమయ్యారు. ఇప్పుడు అవన్నీ.. కేవలం ఆస్తుల కోసమే షర్మిల చేసిన వ్యాఖ్యలుగా బలమైన ముద్ర పడితే.. మాత్రం వ్యక్తిగతంగా షర్మిలకే ఇబ్బందులని పరిశీలకులు చెబుతున్నారు.
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…