Political News

చంద్ర‌బాబుకు జ‌గ‌న్ పూనితే!

ఏపీ రాజ‌కీయాల్లో కూట‌మి స‌ర్కారు కొలువు దీరిన త‌ర్వాత‌.. పెను మార్పులు చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. వైసీపీ స‌ర్కారు కుప్ప‌కూలి కూట‌మి ప్ర‌భుత్వం కొలుదీరింది. ఇక‌, నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా మౌనంగా ఉన్న వైసీపీ అధినేత జ‌గ‌న్ క్ర‌మంగా పుంజుకోవ‌డం ప్రారంభించారు. ఎన్నిక‌ల ప‌రాభ‌వం తాలూకు అనుభ‌వాల‌ను ఆయ‌న ఒక్కొక్క‌టిగా ప‌క్క‌న పెడుతున్నారు. గ‌త నాలుగు రోజులుగా వైసీపీ నేత‌ల‌తోనూ భేటీ నిర్వ‌హిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న సీఎం చంద్ర‌బాబుపై వ్యాఖ్య‌లు చేస్తూ.. తాము కూడా అబ‌ద్ధాలు చెప్పి ఉంటే.. మ‌రోసారిఅధికారంలోకి ఖ‌చ్చితంగా వ‌చ్చి ఉండేవార‌మ‌ని అన్నారు. అంతేకాదు.. అబద్ధాలు చెప్పుకొని అధికారం ద‌క్కించుకునే కంటే కూడా.. ప్ర‌తిప‌క్షంలో ఉండ‌డ‌మే మేలు అన్న‌ట్టుగా వ్యాఖ్యానించారు వైసీపీ నేత‌ల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. అరాచాల‌కు అడ్డాగా మారిపోయింద ని.. టీడీపీ నాయ‌కులు వాటాలు వేసుకుని మ‌రీ దోచుకుంటున్నార‌ని అన్నారు.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌.. త‌న హ‌యాంలో జ‌రిగిన నేరాలు, ఘోరాల‌ను మ‌రిచిపోయిన‌ట్టు ఉన్నార‌నేది ప‌రిశీ ల‌కుల మాట‌. ఎందుకంటే.. ఆయ‌న పాల‌న‌లో సోష‌ల్ మీడియా విజృంభ‌ణ‌లు, విప‌రీత వ్యాఖ్య‌లు, పెద్ద ఎత్తున దాడులు వంటివి అంద‌రికీ తెలిసిందే. సాక్షాత్తూ టీడీపీ కార్యాల‌యంపై దాడి చేసి ధ్వంసం చేశారు. దీనికి కార‌ణం ఎవ‌ర‌నేది ప‌క్క‌న పెడితే.. విష‌యం తెలిసి కూడా.. జ‌గ‌న్ దీనిని ఖండించ‌క‌పోవ‌డం.. చోద్యం చూడ‌డం విమ‌ర్శ‌ల‌కు దారితీసింది.

టీడీపీ నేత‌ ప‌ట్టాభి.. జ‌గ‌న్‌ను దారుణ వ్యాఖ్య చేసి ఉండొచ్చు. దానికి చ‌ట్టం ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటే స‌రిపోయేది. దీనిని అడ్డు పెట్టుకుని టీడీపీ కార్యాల‌యాన్ని ధ్వంసం చేయ‌డం.. స‌రికాదు. ఇక‌, నిండు అసెంబ్లీలో చంద్ర‌బాబు కుటుంబాన్ని దూషించారు. ఆయ‌న స‌తీమ‌ణిని దారుణంగా వ్యాఖ్యా నించారు. ఇవ‌న్నీ.. చంద్ర‌బాబుకు కంట‌నీరు తెప్పించాయి. వైసీపీ నేత‌ల‌పై క‌సిని, అస‌హ‌నాన్ని కూడా తెప్పించాయి. ఇదిలావుంటే.. టీడీపీ నేత‌లు.. అచ్చెన్నాయుడు(ప్ర‌స్తుత మంత్రి), ధూళిపాళ్ల న‌రేంద్ర‌, కొల్లు ర‌వీంద్ర‌, స‌హా చంద్ర‌బాబును కూడా కేసుల‌తో వేధించారు. జైళ్ల‌లో పెట్టి ఆనందించారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు చంద్ర‌బాబు అధికారంలో ఉన్నారు. గ‌తంలో త‌న‌కు, త‌న పార్టీ నాయ‌కుల‌కు జ‌రిగిన అవ‌మానాలు, అన్యాయాల‌ను ఆయ‌న మ‌న‌సులో పెట్టుకుని క‌సి తీర్చుకోవాలంటే ఎంత‌సేపు.? చంద్ర‌బా బే క‌నుక జ‌గ‌న్ మాదిరిగా నేత‌ల‌ను రెచ్చ‌గొట్టి వ్య‌వ‌హ‌రిస్తే.. మాత్రం అడ్డు ఎవ‌రు చెప్ప‌గ‌ల‌రు.? నిజానికి చంద్ర‌బాబుపై పార్టీలో నాయ‌కులు, మంత్రుల నుంచి ఒత్తిడి ఉంది. వైసీపీ నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవా ల‌ని త‌క్ష‌ణం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కూడా వారు కోరుతున్నారు.

అయినా.. చంద్ర‌బాబు త‌న పూర్వ పంథాను వీడ‌డం లేదు. జ‌గ‌న్‌లా వ్య‌వ‌హ‌రించ‌డ‌మూ లేదు. త‌న‌ను తానుగానే ప్రొజెక్టు చేస్తున్నారు. అందుకే.. చ‌ట్టం ప్ర‌కారం, న్యాయం ప్ర‌కారం, నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే పోలీసులు కేసులు న‌మోదు చేస్తున్నారు. ఆమేర‌కు నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. కాబ‌ట్టి.. పైకి ఎన్ని వ్యాఖ్య‌లు చేసినా..చంద్ర‌బాబు మాత్రం జ‌గ‌న్ మాదిరిగా విర్ర‌వీగే ప‌రిస్థితి అయితేలేదు. బ్రాండ్ బాబు అనే మాట‌కు ఆయ‌న క‌ట్టుబడి ఉన్నార‌నే అనిపిస్తుంది.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

5 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

7 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

9 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

10 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

10 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

10 hours ago