దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు రానున్న దరిమిలా.. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు రెడీ అవుతున్నారు. దీనిలో భాగంగా ఆయన పక్కా ప్లాన్తో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది జూన్లో ఏర్పడిన ప్రబుత్వానికి ఐదేళ్ల గడువు ఉంటుంది. అయితే.. జమిలి నేపథ్యంలో రెండున్నరేళ్లకు మించి సమయం ఉండే అవకాశం లేదు. పైగా జమిలికి కేంద్రం కూడా రెడీ అయిపోయింది. ఎన్డీయే కూటమి పక్షాలను కూడా ఒప్పించేసింది.
ఒక్క బిహార్ తప్ప.. ఇతర రాష్ట్రాల్లోని ఎన్డీయే పక్షాలన్నీ కూడా జమిలికి రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు తాజాగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో నిర్వహించిన సమావేశంలో “మనకు సమయం తగ్గిపోయింది. ఈ విషయం మీకు కూడా తెలుసు” అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. దీనికి తగినట్టుగా ప్లాన్ చేసుకుని తమ్ముళ్లు ముందుకు సాగాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే.. టార్గెట్ 2029 కాదని.. 2026 అని చంద్రబాబు చెప్పకనే చెప్పారు.
దీనికి ఉన్న సమయంలో కేవలం 16-18 నెలలు మాత్రమే. ఈ స్వల్పకాలంలోనే ఇచ్చిన హామీలను అమ లు చేసే దిశగా ప్రబుత్వం అడుగులు వేయనుందని చంద్రబాబు తెలిపారు. అయితే.. ఆయన పక్కాగా డేట్ చెప్పకపోయినా.. స్వల్పం కాలమని.. ఎవరూ 2029 వరకు వేచి చూడొద్దని మాత్రం చెప్పుకొని రావడం ద్వారా జమిలికి రెడీ అవుతున్నామన్న సంకేతాలు ఇచ్చినట్టు అయింది. ముఖ్యంగా ఉపాధి కల్పన, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు.
అదేవిధంగా పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేయించేందుకు మనకు ఉన్న సమ యంలో స్వల్పమని, ఈ విషయంలో అందరూ సహకరించాలని కూడా ఆయన సూచించారు. అంతేకాదు.. 100 రోజుల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించడం ద్వారా.. సాధించిన ప్రగతికి మార్కులు వేయించాలని సూచించారు. సో.. దీనిని బట్టి దేశవ్యాప్తంగా ఒకే సారి జరిగే ఎన్నికలకు అందరూ రెడీ కావాలన్న సంకేతాలు కూడా ఇచ్చారు. మొత్తంగా 2026లోనే వచ్చే అవకాశం ఉన్న జమిలికి చంద్రబాబు అందరినీ రెడీ చేస్తున్నారన్న సంకేతాలు వెలువడ్డాయి. మరి తమ్ముళ్లు ఏమేరకు ప్రిపేర్ అవుతారో చూడాలి.
This post was last modified on October 19, 2024 9:20 am
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…