వైసీపీ అధినేత.. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అమితంగా ఆరాధిస్తూ.. ఆయన రాజకీయ వ్యతిరేకుల్ని వ్యక్తిగత శత్రువులుగా భావించే కొందరు ఉంటారు. ఆ కోవలోకే వస్తారు బోరుగడ్డ అనిల్ కుమార్. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం.. తాను టార్గెట్ చేసిన వారి స్థాయిని వదిలేసి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడే తత్త్వం ఉన్న బోరుగడ్డ అనిల్ ను తాజాగా గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు.ఆసక్తికరమైన అంశం ఏమంటే.. 2021లో ఆయనపై చేసిన ఫిర్యాదు అంశంలో తాజాగా అరెస్టు కావటం.
ఏపీ గత ప్రభుత్వంలో బోరుగడ్డ అనిల్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు నారా లోకేశ్ మొదలు కొని ఎవరినైనా సరే.. ఎంత మాట అయినా సరే నోటికి వచ్చినట్లుగా మాట్లాడేసే విషయంలో అతనికి మించినోళ్లు ఉండరన్న పేరుంది. పలు కేసులు.. పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్న అతడిపై ఎన్ని విమర్శలు వచ్చినా చర్యలు తీసుకున్నది లేదు.
అయితే.. ఏపీ ఎన్నికల ఫలితాలు వెల్లడై.. చారిత్రక తీర్పును ఓటర్లు ఇచ్చారో.. ఆ తర్వాత నుంచి అతను కనిపించకుండా పోయాడు. వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయిన అనిల్ కుమార్ అండర్ గ్రౌండ్ లో ఉండిపోయాడు. అయితే.. రెండు రోజుల క్రితం గుంటూరుకు వచ్చినట్లుగా తెలుసుకున్న సీసీఎస్ పోలీసులు..అతడ్నిఅరెస్టు చేశారు. గతంలో అతడిపై భూవివాదాలతో పాటు మహిళల వేధింపులపైనా పలు కేసులు ఉన్నాయి.
సోషల్ మీడియాలోనూ.. టీవీ చర్చల్లోనూ నోరు పారేసుకునే అలవాటున్న బోరుగడ్డ అనిల్.. ఏపీలో అధికారమార్పిడి జరిగిన తర్వాత నుంచి కామ్ గా ఉంటున్నారు. అయితే.. గతంలో అతను చేసిన తప్పులు.. దందాలు అతడ్ని కేసుల రూపంలో వెంటాడుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ మహిళలని ఇష్టారాజ్యంగా అనే అలవాటున్న అనిల్ కుమార 2021లో కర్లపూడి బాబు ప్రకాష్ ను రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
తాను చెప్పినట్లుగా డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో.. అతదిపై కంప్లైంట్ చేశాడు బాధితుడు. ఈ కేసుపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా అతడ్ని గుంటూరులో పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ప్రస్తుతం నల్లపాటు పోలీస స్టేషన్ లో రహస్యంగా విచారిస్తున్నట్లు చెబుతున్నారు.
This post was last modified on October 17, 2024 10:12 am
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి…అనూహ్య రాజకీయ పరిణామాలను దాటుకుని మరీ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగారు. తెలంగాణను సాధించిన…
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్.. సోషల్ మీడియా ఇన్ఫ్ల్యుయెన్సర్లు, సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వాన్ని, కోర్టులను ప్రశ్నించేవారిపై…
ఇండియన్ సినిమా చరిత్రలోనే ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచిన చిత్రం.. దురంధర్-2. గత ఏడాది చివర్లో వచ్చిన…
జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో మార్మోగుతోంది. ఎక్కడ…
తెలుగులో ఇటు ఇండస్ట్రీ.. అటు ప్రేక్షకులు.. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమా.. పెద్ది. సంక్రాంతి తర్వాత వెలవెలబోతున్న టాలీవుడ్…
ఇండస్ట్రీని గత నాలుగైదు రోజులుగా కుదిపేస్తున్న సింగల్ స్క్రీన్ పర్సెంటెజ్ వివాదం ఎట్టకేలకు పరిష్కారం దిశగా అడుగులు వేయడం మూవీ…