ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారులు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తమకు కేటాయించిన రాష్ట్రాలకు తరలి వెళ్లారు. అయితే.. వాస్తవానికి ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లేందుకు ఐఏఎస్ సంతోషం వ్యక్తం చేస్తారు. తమ పనితీరును మరింత మెరుగు పరుచుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తారు. కానీ, తాజాగా ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ అయిన.. యువ ఐఏఎస్లు మాత్రం అయిష్టంగానే ఆయా రాష్ట్రాల్లో అడుగు పెట్టారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రిపోర్టు చేశారు. వీరికి రేపో మాపో.. జిల్లాలు, లేదా శాఖలను ప్రభుత్వాలు కేటాయించనున్నాయి.
ఎవరెవరు?
ఫలించని పోరాటం!
కాగా, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. ఐఏఎస్, ఐపీఎస్లను ఏపీ, తెలంగాణకు కేటాయించారు. ఈ కార్యక్రమాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీఓపీటీ) అప్పట్లోనే పూర్తి చేసింది. అయితే.. వీరు మాత్రం తమకు నచ్చిన రాష్ట్రంలో కొనసాగుతున్నారు. దీనికి ప్రభుత్వాలు అప్పట్లో సహకరించారు. కానీ, కొన్నాళ్ల కిందట తెలంగాణ హైకోర్టులో నమోదైన కేసు విచారణ కారణంగా.. ఎక్కడివారు అక్కడకు వెళ్లాలని ఆదేశించింది. ఈ విషయంపై డీవోపీటీపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీంతో ఏకసభ్య కమిషన్ విచారణకు ఆదేశించిన డీవోపీటీ కేటాయించిన వారు ఎందుకు వెళ్లలేదన్న విషయాన్ని ఆరా తీసింది. ఈ క్రమంలోనే ఎక్కడివారు అక్కడకు వెళ్లాలని మంగళవారం తేల్చి చెప్పింది. దీనిని సదరు ఐఏఎస్లు తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. అయినా.. పోరాటం ఫలించలేదు. దీంతో ఏపీకి చెందిన వారు తెలంగాణ నుంచి, తెలంగాణకు చెందిన వారు ఏపీ నుంచి రిలీవ్ అయి.. ఆయా రాష్ట్రాల్లో రిపోర్టు చేశారు.
This post was last modified on October 17, 2024 9:35 am
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…