Political News

అయిష్టంగానే ‘ఐఏఎస్‌’ల‌ అడుగులు!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు చెందిన ఐఏఎస్ అధికారులు రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం త‌మ‌కు కేటాయించిన రాష్ట్రాల‌కు త‌ర‌లి వెళ్లారు. అయితే.. వాస్త‌వానికి ఒక చోట నుంచి మ‌రో చోట‌కు వెళ్లేందుకు ఐఏఎస్ సంతోషం వ్య‌క్తం చేస్తారు. త‌మ ప‌నితీరును మ‌రింత మెరుగు ప‌రుచుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తారు. కానీ, తాజాగా ఏపీ నుంచి తెలంగాణ‌కు, తెలంగాణ నుంచి ఏపీకి బ‌దిలీ అయిన‌.. యువ ఐఏఎస్‌లు మాత్రం అయిష్టంగానే ఆయా రాష్ట్రాల్లో అడుగు పెట్టారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌కు రిపోర్టు చేశారు. వీరికి రేపో మాపో.. జిల్లాలు, లేదా శాఖ‌ల‌ను ప్ర‌భుత్వాలు కేటాయించ‌నున్నాయి.

ఎవ‌రెవ‌రు?

  • ఏపీ నుంచి తెలంగాణ‌కు వ‌చ్చిన ఐఏఎస్‌ల‌లో సృజన(ప్ర‌స్తుతంఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్‌), హరికిరణ్(విజ‌య‌న‌గ‌రం), లోతోటి శివశంకర్ (క‌డ‌ప‌) ఉన్నారు. వీరు తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంత కుమారిని క‌లిసి రిపోర్టు చేశారు.
  • తెలంగాణ నుంచి ఏపీకి బ‌దిలీ అయిన వారిలో వాణిప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని క‌లిసి రిపోర్టు చేశారు.

ఫ‌లించ‌ని పోరాటం!

కాగా, రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం.. ఐఏఎస్‌, ఐపీఎస్‌ల‌ను ఏపీ, తెలంగాణ‌కు కేటాయించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగం (డీఓపీటీ) అప్ప‌ట్లోనే పూర్తి చేసింది. అయితే.. వీరు మాత్రం త‌మ‌కు న‌చ్చిన రాష్ట్రంలో కొన‌సాగుతున్నారు. దీనికి ప్ర‌భుత్వాలు అప్ప‌ట్లో స‌హ‌క‌రించారు. కానీ, కొన్నాళ్ల కింద‌ట తెలంగాణ హైకోర్టులో న‌మోదైన కేసు విచార‌ణ కార‌ణంగా.. ఎక్క‌డివారు అక్క‌డ‌కు వెళ్లాల‌ని ఆదేశించింది. ఈ విష‌యంపై డీవోపీటీపై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

దీంతో ఏక‌స‌భ్య క‌మిష‌న్ విచార‌ణ‌కు ఆదేశించిన డీవోపీటీ కేటాయించిన వారు ఎందుకు వెళ్ల‌లేద‌న్న విష‌యాన్ని ఆరా తీసింది. ఈ క్ర‌మంలోనే ఎక్క‌డివారు అక్క‌డ‌కు వెళ్లాల‌ని మంగ‌ళ‌వారం తేల్చి చెప్పింది. దీనిని స‌ద‌రు ఐఏఎస్‌లు తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. అయినా.. పోరాటం ఫ‌లించలేదు. దీంతో ఏపీకి చెందిన వారు తెలంగాణ నుంచి, తెలంగాణ‌కు చెందిన వారు ఏపీ నుంచి రిలీవ్ అయి.. ఆయా రాష్ట్రాల్లో రిపోర్టు చేశారు.

This post was last modified on October 17, 2024 9:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాంబాబు స్థానంలో జార్జ్ కుట్టిని చూడగలరా

ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…

9 minutes ago

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…

16 minutes ago

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

43 minutes ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

2 hours ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

2 hours ago

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…

2 hours ago