ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారులు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తమకు కేటాయించిన రాష్ట్రాలకు తరలి వెళ్లారు. అయితే.. వాస్తవానికి ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లేందుకు ఐఏఎస్ సంతోషం వ్యక్తం చేస్తారు. తమ పనితీరును మరింత మెరుగు పరుచుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తారు. కానీ, తాజాగా ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ అయిన.. యువ ఐఏఎస్లు మాత్రం అయిష్టంగానే ఆయా రాష్ట్రాల్లో అడుగు పెట్టారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రిపోర్టు చేశారు. వీరికి రేపో మాపో.. జిల్లాలు, లేదా శాఖలను ప్రభుత్వాలు కేటాయించనున్నాయి.
ఎవరెవరు?
ఫలించని పోరాటం!
కాగా, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. ఐఏఎస్, ఐపీఎస్లను ఏపీ, తెలంగాణకు కేటాయించారు. ఈ కార్యక్రమాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీఓపీటీ) అప్పట్లోనే పూర్తి చేసింది. అయితే.. వీరు మాత్రం తమకు నచ్చిన రాష్ట్రంలో కొనసాగుతున్నారు. దీనికి ప్రభుత్వాలు అప్పట్లో సహకరించారు. కానీ, కొన్నాళ్ల కిందట తెలంగాణ హైకోర్టులో నమోదైన కేసు విచారణ కారణంగా.. ఎక్కడివారు అక్కడకు వెళ్లాలని ఆదేశించింది. ఈ విషయంపై డీవోపీటీపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీంతో ఏకసభ్య కమిషన్ విచారణకు ఆదేశించిన డీవోపీటీ కేటాయించిన వారు ఎందుకు వెళ్లలేదన్న విషయాన్ని ఆరా తీసింది. ఈ క్రమంలోనే ఎక్కడివారు అక్కడకు వెళ్లాలని మంగళవారం తేల్చి చెప్పింది. దీనిని సదరు ఐఏఎస్లు తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. అయినా.. పోరాటం ఫలించలేదు. దీంతో ఏపీకి చెందిన వారు తెలంగాణ నుంచి, తెలంగాణకు చెందిన వారు ఏపీ నుంచి రిలీవ్ అయి.. ఆయా రాష్ట్రాల్లో రిపోర్టు చేశారు.
This post was last modified on October 17, 2024 9:35 am
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…