ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారులు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తమకు కేటాయించిన రాష్ట్రాలకు తరలి వెళ్లారు. అయితే.. వాస్తవానికి ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లేందుకు ఐఏఎస్ సంతోషం వ్యక్తం చేస్తారు. తమ పనితీరును మరింత మెరుగు పరుచుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తారు. కానీ, తాజాగా ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ అయిన.. యువ ఐఏఎస్లు మాత్రం అయిష్టంగానే ఆయా రాష్ట్రాల్లో అడుగు పెట్టారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రిపోర్టు చేశారు. వీరికి రేపో మాపో.. జిల్లాలు, లేదా శాఖలను ప్రభుత్వాలు కేటాయించనున్నాయి.
ఎవరెవరు?
ఫలించని పోరాటం!
కాగా, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. ఐఏఎస్, ఐపీఎస్లను ఏపీ, తెలంగాణకు కేటాయించారు. ఈ కార్యక్రమాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీఓపీటీ) అప్పట్లోనే పూర్తి చేసింది. అయితే.. వీరు మాత్రం తమకు నచ్చిన రాష్ట్రంలో కొనసాగుతున్నారు. దీనికి ప్రభుత్వాలు అప్పట్లో సహకరించారు. కానీ, కొన్నాళ్ల కిందట తెలంగాణ హైకోర్టులో నమోదైన కేసు విచారణ కారణంగా.. ఎక్కడివారు అక్కడకు వెళ్లాలని ఆదేశించింది. ఈ విషయంపై డీవోపీటీపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీంతో ఏకసభ్య కమిషన్ విచారణకు ఆదేశించిన డీవోపీటీ కేటాయించిన వారు ఎందుకు వెళ్లలేదన్న విషయాన్ని ఆరా తీసింది. ఈ క్రమంలోనే ఎక్కడివారు అక్కడకు వెళ్లాలని మంగళవారం తేల్చి చెప్పింది. దీనిని సదరు ఐఏఎస్లు తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. అయినా.. పోరాటం ఫలించలేదు. దీంతో ఏపీకి చెందిన వారు తెలంగాణ నుంచి, తెలంగాణకు చెందిన వారు ఏపీ నుంచి రిలీవ్ అయి.. ఆయా రాష్ట్రాల్లో రిపోర్టు చేశారు.
This post was last modified on October 17, 2024 9:35 am
టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి.. పార్టీ నాయకులకు బాగా కలిసి వస్తోందన్నవాదన వినిపిస్తోంది. ఇప్పటికి రెండు సంవత్సరాలుగా చంద్రబాబు.. తమ్ముళ్లకు…
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎప్పటికప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఈ తరహా పరిస్థితులు కొత్తేమీ…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…