రెడ్డిగారి కూతురా.. మజాకా? అన్నట్టుగా రెచ్చిపోయారు.. మాజీ ఎంపీ, నంద్యాలకు చెందిన ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజల. ప్రముఖ పారిశ్రామిక వేత్తగా ఎదిగిన ఎస్పీవై రెడ్డి రాజకీయాల్లో ఉన్నప్పుడు.. గత రెండు దశాబ్దాలుగా సుజలే చక్రం తిప్పారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు.. నంద్యాల సహా ఢిల్లీలోనూ సుజల దూకుడు చూపించారు. ఇక, ఎస్పీవై రెడ్డి మరణానంతరం రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించి.. పలు కారణాలతో ఆమె వెనుకడుగు వేశారు.
అయితే.. ఇప్పుడు అనూహ్యంగా సుజల పేరు తెరమీదికి వచ్చింది. ఆమె గురించి రాయల సీమ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చసాగుతుండడం గమనార్హం. దీనికి కారణం.. తాజాగా జరిగిన మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియే. ఈ ప్రక్రియలో సహజంగానే ఒక పారిశ్రామిక వేత్తగా సుజల పాల్గొన్నారు. దీనిలో తప్పులేదు. ఎస్పీవై రెడ్డి వారసత్వాన్ని నిలబెట్టాలని భావించిన ఏకైక కుమార్తెగా ఆమె రంగంలోకి దిగారు. అయితే.. చిత్రం ఏంటంటే.. జిల్లాకో పార్టీతో ఆమె చేతులు కలిపారట.
మొత్తంగా 4 జిల్లాల్లోనూ సుజల షాపులు దక్కించుకున్నారు. అనంతపురం , కర్నూలు, అన్నమయ్య, కడపలో నూ విరివిగా సుజల షాపులు దక్కించుకోవడం సీనియర్ వ్యాపారులను కూడా విస్మయానికి గురిచేస్తోంది. అంతేకాదు.. ఇన్ని జిల్లాల్లోనూ షాపులు దక్కించుకునేందుకు సుజల అన్ని పార్టీల వారినీ మచ్చిక చేసుకోవడం గమనార్హం. అనంతపురం జిల్లాలో చాలా మంది టీడీపీ నాయకులకే దుకాణాలు దక్కలేదు. కానీ, ఇక్కడ కూడా సుజల 4 దుకాణాలు దక్కించుకున్నారు.
కడపలో 2 దుకాణాలు సొంతం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లాలో 9 దుకాణాలు, నంద్యాలలో 3 దుకాణాలు.. ఇలా లెక్కకు మిక్కిలిగా సుజల దుకాణాలు దక్కించుకోవడంతో రాజకీయ వర్గాల్లో ఆమె పేరు మార్మోగుతుండడం గమనార్హం. నిజానికి ఎస్పీవై రెడ్డి నంది పైపుల వ్యాపారానికే పరిమితం అయితే.. ఆయన వారసురాలిగా వచ్చిన సుజల మాత్రం ఇందుగలడందు లేదన్నట్టుగా.. మద్యం వ్యాపారంలోనూ దూకుడుగా ముందుకు సాగడం గమనార్హం.
This post was last modified on October 16, 2024 11:14 am
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…