సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తోందంటే ఒకప్పుడు తెలుగులో కూడా ఎంత హడావుడి ఉండేదో. ఇక్కడి సూపర్ స్టార్ల సినిమాలతో సమానంగా హైప్ కనిపించేది. ఆయన చిత్రాలకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే ప్రేక్షకులు ఎగబడి టికెట్లు కొనేవాళ్లు. షోలకు షోలు నిమిషాల్లో సోల్డ్ ఔట్ అయిపోయేవి.
కానీ ‘కబాలి’, ‘కాలా’, ‘పేట’, ‘దర్బార్’ లాంటి సినిమాల పుణ్యమా అని ఆయన క్రేజ్ కరిగిపోతూ వచ్చింది. దీంతో రజినీ సినిమా రిలీజవుతుంటే ముందున్న హైప్ కనిపించడం లేదు. ఐతే మధ్యలో ‘జైలర్’ సినిమాకు మాత్రం మంచి బజ్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగాయి.
సినిమాకు ఓపెనింగ్స్ కూడా భారీగా వచ్చాయి. ఆ చిత్రానికి లాంగ్ రన్ కూడా వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత రజినీ సినిమాకు హంగామా కనిపించింది ఆ చిత్రంతోనే. కానీ ఆ ఊపు తర్వాత కొనసాగడం లేదు. రజినీ స్పెషల్ రోల్ చేసిన ‘లాల్ సలాం’ను అసలు మన ప్రేక్షకులు పట్టించుకోలేదు. తమిళంలో కూడా అది డిజాస్టర్ అయింది.
ఐతే ‘జై భీమ్’ దర్శకుడితో రజినీకాంత్ నటించడం.. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫాహద్ ఫాజిల్ లాంటి మేటి ఆర్టిస్టులు స్పెషల్ రోల్స్ చేయడంతో ‘వేట్టయాన్’కు బాగానే క్రేజ్ ఉంటుందని భావించారు. కానీ టీజర్, ట్రైలర్ అంత ఎగ్జైటింగ్గా లేకపోవడం వల్లో.. ఇది సీరియస్ కంటెంట్ ఉన్న సినిమాలా కనిపించడం వల్లో ఏమో కానీ ‘వేట్టయాన్’కు తెలుగులో బజ్ అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ డల్లుగా ఉన్నాయి.
బుక్ మై షోలో సోల్డ్ ఔట్ షోలే కనిపించడం లేదు. కొన్ని మాత్రమే ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్లో ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఈ సినిమాకు ఆశించిన బజ్ కనిపించడం లేదు. ‘వేట్టయాన్’ అని తమిళ టైటిల్ పెట్టడం కూడా ఈ చిత్రానికి మైనస్ అయినట్లు కనిపిస్తోంది. గతంలో రజినీ సినిమాల పేర్లు, డబ్బింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనిపించేది. కానీ ఈసారి అన్యాయంగా ‘వేట్టయాన్’ అనే తమిళ టైటిల్ పెట్టి రిలీజ్ చేయడం మన ప్రేక్షకులకు ఆగ్రహం తెప్పించినట్లుంది. కంటెంట్ కూడా ఎగ్జైటింగ్గా కనిపించకపోవడంతో ఈ సినిమాను లైట్ తీసుకుంటున్నట్లున్నారు.
This post was last modified on October 15, 2024 4:45 pm
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…