ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ఆగస్టు 15కే రావాల్సిన ఈ చిత్రం డిసెంబరు 5కు వాయిదా పడిపోయింది. ఈ న్యూస్ ముందు తీవ్ర నిరాశ కలిగించినా.. తర్వాత అభిమానులు సరేలే అని సర్దుకున్నారు. ఒక దశలో డిసెంబరు 5కైనా సినిమా వస్తుందా అనే సందేహాలు కలిగాయి. కానీ అ అనుమానాలను పటాపంచలు చేస్తూ టీం వడివడిగా షూటింగ్ చేస్తూ డెడ్ లైన్ అందుకునే దిశగా సాగుతోంది.
తాజాగా ‘పుష్ప-2’ టీం నుంచి బయటికి వచ్చిన అప్డేట్ అభిమానులకు మాంచి ఉత్సాహాన్నిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ను సుకుమార్ అండ్ టీం లాక్ చేసేసింది. ప్రథమార్ధం వరకు ఎడిటింగ్ అంతా పూర్తి చేసి.. ఫైనల్ కట్కు ఓకే చెప్పేశాడు సుకుమార్. మామూలుగా ఇదేమంత పెద్ద న్యూస్ కాదు కానీ.. సుకుమార్ సినిమాల విషయంలో మాత్రం విశేషమే.
షూటింగ్కి ఎక్కువ టైం తీసుకున్నట్లే ఎడిటింగ్ విషయంలోనూ సుకుమార్ చాలా సమయం తీసుకుంటాడని పేరుంది. ఒక పట్టాన ఏదీ ఓకే చేయడు. లాక్ చేయడు. ‘పుష్ప’ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులు సమయానికి పూర్తి కాక చివర్లో ఎంత హడావుడి అయిందో తెలిసిందే. రిలీజ్కు ముందు రోజు వరకు ఆ పనులు సాగాయి. చివరికి ఔట్పుట్ పర్ఫెక్ట్గా లేక ప్రేక్షకులు కొంత ఇబ్బంది పడ్డారు. ‘పుష్ప-2’కు ఆ పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్త పడుతున్నారు.
షూటింగ్ ఆలస్యమై హడావుడి తప్పనప్పటికీ.. సమాంతరంగా ఎడిటింగ్ పనులు చేయడం ప్లస్ అవుతోంది. సుకుమార్ కూడా ఈసారి అప్రమత్తంగా ఉంటూ విడుదలకు రెండు నెలల ముందే ఫస్టాఫ్ను ఓకే చేసేశాడు. ఈ నెల చివరికి ‘పుష్ప-2’ షూట్ మొత్తం అయిపోతుందని సమాచారం. ఆ తర్వాత ఓ మూడు వారాలు సెకండాఫ్ ప్రి ప్రొడక్షన్ పనులకు కేటాయిస్తారు. విడుదలకు పది రోజుల ముందే ఫస్ట్ కాపీ తీసి తాపీగా ప్రమోషన్లు చేసుకోవాలన్నది టీం ప్లాన్. ప్రస్తుతానికి అంతా ట్రాక్ మీదే ఉన్నట్లు తెలుస్తోంది.
This post was last modified on October 15, 2024 4:44 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…