టాక్ షోలలో కొత్త ట్రెండ్ సృష్టించిన ఆన్ స్టాపబుల్ సీజన్ 4 ఈ నెల 24 నుంచి ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. మొన్న జరిగిన గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో యానిమేషన్ తో కూడిన ప్రత్యేక వీడియో అభిమానులను ఆకట్టుకుంది. గెస్టులు ఎవరు రాబోతున్నారనేది పూర్తి లిస్టు బయటికి రాలేదు కానీ దుల్కర్ సల్మాన్, అల్లు అర్జున్ లాంటి ఒకటి రెండు పేర్లయితే లీకయ్యాయి. ఇప్పుడు అందరి దృష్టి బన్నీ ఎపిసోడ్ మీదే ఉంది. గతంలో ఈ కలయిక జరిగినప్పటికీ అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. బన్నీ నుంచి వినాల్సిన సంగతుల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
వాటిలో పుష్ప 2 కన్నా ప్రధానమైన విషయాలు కొన్నున్నాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో వైసిపి అభ్యర్థి కోసం అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడం మీద పెద్ద దుమారమే రేగింది. మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ రెండుగా విడిపోయి సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధాలు చేసుకున్నారు. టిడిపి జనసేన కూటమి గెలిచాక కూడా కొంత కాలం ఇవి కొనసాగాయి. బన్నీ వాస్, అల్లు అరవింద్ పలు సందర్భాల్లో దీని గురించి ఇన్ డైరెక్ట్ గా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసినా వాళ్ళు చెప్పిన సమాధానాలు వేడిని పూర్తిగా చల్లార్చలేకపోయాయి. వాటికి బన్నీనే స్వయంగా సమాధానం చెబితే తప్ప క్లారిటీ రాదు.
అందుకే బాలయ్య బన్నీ 2 ఎప్పుడు వచ్చినా వ్యూయర్ షిప్ మోత మోగిపోవడం ఖాయం. మాములుగా అయితే అల్లు అర్జున్ ఇలా రెండుసార్లు ఒకే ప్రోగ్రాంకి ఓకే చెప్పేవాడు కాదేమో. కానీ ఆహా ప్లాట్ ఫార్మ్ కావడం, పుష్ప 2 విడుదల దగ్గరగా ఉండటం, తండ్రి అల్లు అరవింద్ సలహా, బాలయ్యతో బాండింగ్ ఇలా ఎన్నో అంశాలు రిపీట్ కి దోహదం చేశాయి. కాకపోతే అన్నింటికీ చెక్ పడేలా బన్నీ ఓపెన్ అవుతాడా లేదానేది వేచి చూడాలి. డిసెంబర్ 6 పుష్ప 2 ది రూల్ రిలీజ్ కానున్న నేపథ్యంలో దానికి ఒకటి రెండు వారాల ముందు ఈ స్పెషల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వొచ్చని గీత కాంపౌండ్ టాక్.
This post was last modified on October 15, 2024 11:08 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…