టాక్ షోలలో కొత్త ట్రెండ్ సృష్టించిన ఆన్ స్టాపబుల్ సీజన్ 4 ఈ నెల 24 నుంచి ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. మొన్న జరిగిన గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో యానిమేషన్ తో కూడిన ప్రత్యేక వీడియో అభిమానులను ఆకట్టుకుంది. గెస్టులు ఎవరు రాబోతున్నారనేది పూర్తి లిస్టు బయటికి రాలేదు కానీ దుల్కర్ సల్మాన్, అల్లు అర్జున్ లాంటి ఒకటి రెండు పేర్లయితే లీకయ్యాయి. ఇప్పుడు అందరి దృష్టి బన్నీ ఎపిసోడ్ మీదే ఉంది. గతంలో ఈ కలయిక జరిగినప్పటికీ అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. బన్నీ నుంచి వినాల్సిన సంగతుల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
వాటిలో పుష్ప 2 కన్నా ప్రధానమైన విషయాలు కొన్నున్నాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో వైసిపి అభ్యర్థి కోసం అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడం మీద పెద్ద దుమారమే రేగింది. మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ రెండుగా విడిపోయి సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధాలు చేసుకున్నారు. టిడిపి జనసేన కూటమి గెలిచాక కూడా కొంత కాలం ఇవి కొనసాగాయి. బన్నీ వాస్, అల్లు అరవింద్ పలు సందర్భాల్లో దీని గురించి ఇన్ డైరెక్ట్ గా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసినా వాళ్ళు చెప్పిన సమాధానాలు వేడిని పూర్తిగా చల్లార్చలేకపోయాయి. వాటికి బన్నీనే స్వయంగా సమాధానం చెబితే తప్ప క్లారిటీ రాదు.
అందుకే బాలయ్య బన్నీ 2 ఎప్పుడు వచ్చినా వ్యూయర్ షిప్ మోత మోగిపోవడం ఖాయం. మాములుగా అయితే అల్లు అర్జున్ ఇలా రెండుసార్లు ఒకే ప్రోగ్రాంకి ఓకే చెప్పేవాడు కాదేమో. కానీ ఆహా ప్లాట్ ఫార్మ్ కావడం, పుష్ప 2 విడుదల దగ్గరగా ఉండటం, తండ్రి అల్లు అరవింద్ సలహా, బాలయ్యతో బాండింగ్ ఇలా ఎన్నో అంశాలు రిపీట్ కి దోహదం చేశాయి. కాకపోతే అన్నింటికీ చెక్ పడేలా బన్నీ ఓపెన్ అవుతాడా లేదానేది వేచి చూడాలి. డిసెంబర్ 6 పుష్ప 2 ది రూల్ రిలీజ్ కానున్న నేపథ్యంలో దానికి ఒకటి రెండు వారాల ముందు ఈ స్పెషల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వొచ్చని గీత కాంపౌండ్ టాక్.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…