ఈ ఏడాది కల్కి చిత్రంతో మురిపించాడు రెబల్ స్టార్ ప్రభాస్. దీని తర్వాత ఎక్కువ గ్యాప్ లేకుండా తన నుంచి మరో సినిమా రాబోతోంది. వచ్చే ఏడాది వేసవికి ‘రాజా సాబ్’ షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్ స్థాయి హీరో నుంచి ఇంకో తొమ్మిది నెలల్లోనే ఇంకో పెద్ద సినిమా రావడం అంటే అభిమానులకు పండుగ అన్నట్లే. నిజానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొంత ఆలస్యం అయింది.
ఇప్పటిదాకా ‘రాజా సాబ్’ నుంచి ఒక ఫస్ట్ లుక్ పోస్టర్.. ఇంకో చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారంతే. ఆ తర్వాత టీం సైలెంటుగా షూటింగ్ చేసుకుంటోంది. మరి ఈ సినిమాకు ప్రమోషన్ల హంగామా ఎప్పట్నుంచి మొదలవుతుంది అనే విషయంలో అభిమానులు ఆసక్తితో ఉన్నారు. ఈ అప్డేట్ను ప్రభాస్ సన్నిహితుడైన పీఆర్వో కమ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తాజాగా వెల్లడించాడు.
ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాను కలిసిన ఎస్కేఎన్.. ‘రాజా సాబ్’ గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు. ఇటీవల ప్రచారం జరుగుతున్నట్లే ప్రభాస్ పుట్టిన రోజు అయిన అక్టోబరు 23న ‘రాజా సాబ్’ టీజర్ ఉంటుందని.. ఆ తర్వాత కూడా వరుస అప్డేట్స్ ఉంటాయని ఎస్కేఎన్ చెప్పాడు. “అక్టోబరు 23 నుంచి ‘రాజా సాబ్’కు సంబంధించి వరుస అప్డేట్స్ ఇవ్వాలని దర్శకుడు మారుతి, నిర్మాత విశ్వప్రసాద్ ప్రణాళికలు వేసుకున్నారు. త్వరలోనే అప్డేట్స్ గురించి వివరాలు వెల్లడిస్తాం.
అక్టోబరు 23 నుంచి విడుదల వరకు ప్రేక్షకులను ‘రాజా సాబ్’ ప్రపంచంలోకి తీసుకెళ్తూ ఉంటాం. మారుతి ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకుండా షూట్ చేస్తున్నారు. వినాయక చవితి, దసరా.. ఇలా ఏ పండుగకూ సెలవు తీసుకోకుండా సినిమా కోసం కష్టపడుతున్నాడు. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు” అని ఎస్కేఎన్ తెలిపాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ‘రాజా సాబ్’ విడుదల కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 15, 2024 9:29 am
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…