గత ఏడాది పెదకాపు పార్ట్ 1 అనే సినిమా ఒకటొచ్చిందంటే సామాన్య ప్రేక్షకులు గుర్తుకు తెచ్చుకోవడం కష్టం. అంత పెద్ద ఫ్లాపు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఫీల్ గుడ్ మూవీస్ అందించిన శ్రీకాంత్ అడ్డాల చాలా గ్యాప్ తర్వాత తీసిన చిత్రం కావడంతో ఓ మోస్తరు అంచనాలైతే నెలకొన్నాయి. హీరోగా విరాట్ కర్ణ పరిచయమయ్యాడు. కానీ పెదకాపు దారుణంగా పోయింది. కంటెంట్ మీద నమ్మకంతో రెండు భాగాలు తీయాలని ముందే ప్లాన్ చేసుకున్నారు కానీ ఫలితం చూశాక సీక్వెల్ ఆలోచనకు గుడ్ బై చెప్పేశారు. అయినా సరే విరాట్ కర్ణకు జాక్ పాట్ తగిలింది. అదే ఇవాళ ప్రారంభమైన నాగబంధనం.
కళ్యాణ్ రామ్ డెవిల్ ది బ్రిటిష్ ఏజెంట్ తో దర్శకుడిగా మారిన నిర్మాత అభిషేక్ నామా రెండో ప్యాన్ ఇండియా మూవీ ఇది. నభ నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. దీనికి చాలా పెద్ద బడ్జెట్ పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఇవాళ పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు. విరాట్ కర్ణకు ఇది జాక్ పాట్ అనే చెప్పాలి. డెబ్యూ ఆశించిన ఫలితం ఇవ్వలేదు సరికదా కనీసం తన నటనను పూర్తి స్థాయిలో జడ్జ్ చేసే ఛాన్స్ కలిగించలేదు. అయినా సరే నాగబంధనం లాంటి ప్రాజెక్టు దక్కడం అదృష్టమే. పోస్టర్ గట్రా చూస్తుంటే ఫాంటసీ ఎలిమెంట్స్ చాలా బలంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది.
ఇది హిట్ కావడం విరాట్ కు చాలా అవసరం. మాములుగా మొదటి సినిమా యావరేజ్ అయితే అవకాశాలు వస్తాయి. అలాంటిది పెదకాపు పార్ట్ 1 అంత బోల్తా కొట్టినా ఇంత బడ్జెట్ పెట్టే నిర్మాత దొరకడం లక్ కాక మరేమిటి. వచ్చే ఏడాది రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న నాగబంధనంని ఇండియాలోని పలు క్లిష్టమైన లొకేషన్లతో విదేశాల్లో షూట్ చేయబోతున్నారు. డెవిల్ సమయంలో డైరెక్షన్ విషయంలో కొంత వివాదం ఎదురుకున్న అభిషేక్ నామా ఈసారి తన టాలెంట్ ని పెద్ద స్థాయిలో నిరూపించుకోబోతున్నారు. అందులోనూ రెగ్యులర్ జానర్ కాకుండా విఎఫ్ఎక్స్ డిమాండ్ చేసే కథను ఎంచుకోవడం విశేషం.
This post was last modified on October 14, 2024 3:49 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…