Movie News

చ‌ర‌ణ్‌, తార‌క్ ఫ్రెండ్షిప్.. చిరు ఖుషీ

మెగా, నంద‌మూరి కుటుంబాల మ‌ధ్య ఉన్న అంత‌రం.. అభిమానుల మ‌ధ్య శ‌త్రుత్వం గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇది ద‌శాబ్దాల నుంచి న‌డుస్తున్న చ‌రిత్రే. అలాంటిది ఈ రెండు కుటుంబాల‌కు చెందిన ఇద్ద‌రు అగ్ర క‌థానాయ‌కులు క‌లిసి సినిమా చేస్తార‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు.

కానీ రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఇద్ద‌రూ క‌లిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. వీళ్లిద్దరూ ఆఫ్ ద సెట్స్ కూడా చాలా స్నేహంగా ఉంటున్న సంగ‌తి ప‌లు సంద‌ర్భాల్లో రుజువైంది. సంబంధిత ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. అభిమానులు వీరి స్నేహం విష‌యంలో ఎలా ఫీల‌వుతున్నారో కానీ.. చ‌ర‌ణ్ తండ్రి చిరంజీవికి మాత్రం వీరి స్నేహం ముచ్చ‌ట‌గొలుపుతోంద‌ట‌.

ఇండ‌స్ట్రీలో అగ్ర క‌థానాయ‌కులు వ్య‌క్తిగ‌తంగా స్నేహంగా మెల‌గ‌డం వ‌ల్ల ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని.. త‌న వ‌ర‌కు అంద‌రితో స్నేహంగా ఉండ‌టానికి ఎంతో త‌పించేవాడిన‌ని చిరు ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇద్ద‌రు స్టార్ హీరోలు అన్న‌ద‌మ్ముల్లా మెలిగితే వాళ్ల‌ అభిమానుల మ‌ధ్య కూడా అలాంటి వాతావ‌ర‌ణ‌మే ఉంటుంద‌ని.. అందుకే ఈ విష‌యంలో తానెంత త‌ప‌న ప‌డేవాడినో ఇండ‌స్ట్రీ జ‌నాలంద‌రికీ తెలుస‌ని చిరు అన్నాడు.

తోటి హీరోలతో స‌ఖ్య‌త‌తో మెలిగే విష‌యంలో చ‌ర‌ణ్ త‌న‌ను అనుస‌రిస్తున్నాడ‌ని.. తార‌క్‌తో అత‌డికి వ్య‌క్తిగ‌తంగా మంచి స్నేహం ఉంద‌ని చిరు చెప్పాడు. వీరి స్నేహం త‌న‌కు ముచ్చ‌ట‌గొలుపుతుంద‌న్న చిరు.. ప్ర‌స్తుతం స్టార్ హీరోలంద‌రూ కూడా బ‌య‌ట స్నేహితుల్లా మెల‌గ‌డం మంచి ప‌రిణామం అన్నాడు.

This post was last modified on April 28, 2020 2:34 pm

Share
Show comments
Published by
satya
Tags: Big Story

Recent Posts

నీల్ తప్ప ఎవరూ చెప్పలేని గుట్టు

గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ…

2 hours ago

మరో బాహుబలి.. ట్రెండ్ సెట్ చేస్తుందా

కొన్ని ల్యాండ్ మార్క్ సినిమాలకు కాలదోషం ఉండదు. టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వీధుల దాకా తీసుకెళ్లి అక్కడ జెండా పాతేలా…

2 hours ago

గుడ్డు-మ‌ట్టి.. మోడీపై రేవంత్ రెడ్డి కౌంటర్ ఎటాక్!

మాట‌ల మాంత్రీకుడు, తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. త‌మ వ్యం గ్యాస్త్రాలు,…

2 hours ago

సమ్మర్ హీట్.. వందేళ్ల రికార్డ్ బ్రేక్

ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు  జారీచేస్తున్నది.  ఆంధ్రప్రదేశ్‌,…

3 hours ago

కూట‌మి మేనిఫెస్టో.. సీఎం జ‌గ‌న్ ఏమ‌న్నారంటే!

తాజాగా ఏపీలో కూట‌మిగా ఎన్నిక‌ల‌కు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన పార్టీలు మేనిఫెస్టో విడుద‌ల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్ర‌బాబు చెబుతున్న…

12 hours ago

ఉమ్మడి మేనిఫెస్టో.. బీజేపీ దూరం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…

13 hours ago