కెజిఎఫ్ రాకముందు ఆయన పేరు శాండల్ వుడ్ లో తప్ప మిగిలిన భాషల్లో ఎవరికీ తెలియదు. కానీ ఆ తర్వాత జరిగింది హిస్టరీ. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ సాంగ్స్ తో రవి బస్రూర్ తనను తాను నిరూపించుకున్న వైనం దర్శకులు వెంటపడేలా చేసింది. ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్ తో అతి తక్కువ టైంలో సలార్ రూపంలో గొప్ప అవకాశం దక్కించుకోవడమంటే మాటలు కాదు. దానికి తగ్గట్టే తన మీద పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకుంటూ కాటేరమ్మ లాంటి ఎపిసోడ్స్ కి రవి ఇచ్చిన నేపధ్య సంగీతం దాని స్థాయిని పదింతలు పెంచింది. ఈ రెండూ ప్రశాంత్ నీల్ సినిమాలన్నది తెలిసిన విషయమే.
ఇక నాణేనికి మరోవైపుకు వద్దాం. పైన చెప్పిన వాటిని మినహాయిస్తే రవి బస్రూర్ ఇంకే ఇతర సినిమాల్లో అంత మేజిక్ చేయలేకపోయాడనేది మ్యూజిక్ లవర్స్ ని కలవరపరిచే వాస్తవం. తెలుగులో బీజీఎమ్ ఇచ్చిన మార్షల్, శాసనసభ లాంటివి కనీసం పేర్లు కూడా ఆడియన్స్ కి గుర్తు లేవు. గోపీచంద్ భీమాకు స్కోర్ ఇచ్చింది తనేనంటే చాలా మంది ఆశ్చర్యపోతారేమో. హిందీలో సల్మాన్ ఖాన్ పిలిచి మరీ కిసీకా భాయ్ కిసీకా జాన్ కోసం నేపధ్య సంగీతం అడిగితే అక్కడా నిరాశే. కబ్జా నుంచి మొన్నొచ్చిన మార్టిన్ దాకా ఇదే తంతు. డౌట్ ఏంటంటే అసలు డైరెక్టర్లే కెజిఎఫ్ లాంటి సంగీతం ఇమ్మని అడిగి సతాయిస్తున్నారాని.
అనిరుధ్ రవిచందర్ లాగా రవి బస్రూర్ తనదైన ఒక ముద్ర అన్ని భాషల్లో వేయగలగాలి. దర్శకులు ఏం అడుగుతున్నారనేది పక్కన పెడితే కెజిఎఫ్ తరహా సౌండింగ్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో బస్రూర్ కంపోజింగ్ లో మార్పులు రావాల్సిన అవసరముందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తన చేతిలో జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు ఉంది. సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వం వస్తుంది. వీటిని తీసేది నీలే అయినా అంచనాల బరువుని బాధ్యతగా మోయాల్సిన అవసరం రవి బస్రూర్ మీద ఉంది. సక్సెస్ మాత్రం మాట్లాడే ఇండస్ట్రీలో కేవలం లక్కు మీదే అఆధారపడలేంగా.
This post was last modified on October 14, 2024 12:01 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…