ఒకప్పుడు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను హీరోల అభిమానుల కోసం రీ రిలీజ్ చేయడం.. వాటిని వాళ్లు సెలబ్రేట్ చేయడం తెలుగులో రెండేళ్లుగా నడుస్తున్న ట్రెండు. దీన్ని వేరే భాషల వాళ్లు కూడా అందిపుచ్చుకోవాలని చూశారు కానీ.. ఈ రేంజిలో అక్కడ రెస్పాన్స్ లేదు. తమిళంలో కొంత మేర ఇది వర్కవుట్ అయింది. హిందీలో ఈ ట్రెండ్ అసలే లేదు. కానీ ‘తుంబాడ్’ అనే సూపర్ నేచురల్ మూవీని ఇటీవల రిలీజ్ చేస్తే దానికి ఎవ్వరూ ఊహించని స్పందన వచ్చింది.
2018లో రిలీజైన ఈ చిత్రానికి అప్పట్లో ఓ మోస్తరు ఫలితమే వచ్చింది. సినిమాకు మంచి రివ్యూలు వచ్చినా.. స్టార్ కాస్ట్ లేకపోవడం వల్ల బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం రాలేదు. కానీ ఓటీటీలో జనం దీన్ని బాగానే చూశారు. కాల క్రమంలో ఇది కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ఐతే ఓటీటీలో చూసిన చాలామంది ఇది బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిన సినిమా అని ఫీలయ్యారు.
ఆ ఫీడ్ బ్యాక్ మేకర్స్ వరకు చేరి.. రీ రిలీజ్ను చక్కగా ప్లాన్ చేసి సినిమాను వదిలారు. ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం చేసిన మ్యాజిక్ ట్రేడ్ పండిట్లకు షాక్. తొలి వారంలోనే రూ.13.5 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం.. నెల రోజుల పాటు రన్ కొనసాగించింది. ఇప్పటిదాకా ఏకంగా రూ.35 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. మూడు నాలుగు వారాల్లో కలిపి ఆరు కోట్ల వసూళ్లు రావడం అంటే మాటలు కాదు.
ఫస్ట్ రిలీజ్లో వచ్చిన ఓవరాల్ వసూళ్లతో పోలిస్తే ఇప్పటి మొత్తం కలెక్షన్లు మూడు రెట్లు కావడం విశేషం. ఇండియాలో రీ రిలీజ్ రికార్డులన్నింటినీ ఇది బద్దలు కొట్టేసింది. తుంబాడ్-2 తీయాలని సన్నాహాలు మొదలుపెడుతున్న టైంలో రీ రిలీజ్ టీంకు ఇచ్చిన ఉత్సాహం అంతా ఇంతా కాదు. తమకు ఈ విజయం మంచి కిక్ ఇచ్చిందని.. ప్రస్తుతం తుంబాడ్-2 స్క్రిప్టు, ప్రి ప్రొడక్షణ్ పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే సెట్స్ మీదికి వెళ్తామని ఇందులో ప్రధాన పాత్ర పోషించిన సోహుమ్ షా తెలిపాడు. పార్ట్-2కు బాక్సాఫీస్ దగ్గర ఆకాశమే హద్దు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on October 14, 2024 10:22 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…