వచ్చే ఏడాది కోసం బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు గట్టిగానే సిద్దమవుతున్నాయి. వాటిలో వార్ 2 – కాంతార ప్రీక్వెల్ చాలా ప్రత్యేకమైనవి. ఒకవైపు కన్నడ ఇండస్ట్రీకి గర్వకారణమైన కాంతార ప్రీక్వెల్ తో అంతకుమించి అనేలా రెడీ అవుతోంది. మరోవైపు హై వోల్టేజ్ కాంబినేషన్లో వస్తున్న వార్ 2పై అంచనాలు మాములుగా లేవు. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న వార్ 2 నార్త్ లోనే కాకుండా సౌత్ లో కూడా స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది.
ఇక కాంతార ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, తెలుగులో కూడా 60 కోట్ల వసూళ్లతో సత్తా చాటింది. ఇప్పుడు ఈ చిత్రానికి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న కాంతార: చాప్టర్ 1 కోసం భారీగా 150 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ సినిమాను 2025 ఆగస్టులో మధ్యలోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే బాలీవుడ్ నుంచి ‘వార్ 2’ కూడా 2025 ఆగస్టు 14న విడుదల కాబోతుంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో ఈ సినిమా పైన తెలుగులో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వార్ ఫ్రాంచైజ్ బాలీవుడ్ లో పాపులర్ కాగా ఈసారి ఎన్టీఆర్ కలవడంతో సౌత్ ఇండియాలో కూడా హైప్ క్రియేట్ అవుతోంది.
అయితే రెండు సినిమాలు ఒకే టైమ్ లో విడుదల కావడం వలన ఇబ్బందులు తప్పవు. రెండు చిత్రాల మొదటి టార్గెట్ అయితే ఒక్కటే. వీలైనంత వేగంగా 1000 కోట్ల క్లబ్ లో చేరాలని అనుకుంటున్నాయి. కానీ ఈ టార్గెట్ అందుకోవాలంటే విడుదల తేదీల విషయంలో నిర్మాతలు మరో నిర్ణయం తీసుకోవడం అత్యవసరం. వారం గ్యాప్ లో వచ్చినా కలెక్షన్ల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో రూపొందుతుండటంతో, కనీసం నాలుగు వారాల గ్యాప్ ఇచ్చి విడుదల చేయడం మంచిదని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అలాగే థియేటర్స్ విషయంలో కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
This post was last modified on October 14, 2024 12:17 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…