వచ్చే ఏడాది కోసం బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు గట్టిగానే సిద్దమవుతున్నాయి. వాటిలో వార్ 2 – కాంతార ప్రీక్వెల్ చాలా ప్రత్యేకమైనవి. ఒకవైపు కన్నడ ఇండస్ట్రీకి గర్వకారణమైన కాంతార ప్రీక్వెల్ తో అంతకుమించి అనేలా రెడీ అవుతోంది. మరోవైపు హై వోల్టేజ్ కాంబినేషన్లో వస్తున్న వార్ 2పై అంచనాలు మాములుగా లేవు. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న వార్ 2 నార్త్ లోనే కాకుండా సౌత్ లో కూడా స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది.
ఇక కాంతార ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, తెలుగులో కూడా 60 కోట్ల వసూళ్లతో సత్తా చాటింది. ఇప్పుడు ఈ చిత్రానికి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న కాంతార: చాప్టర్ 1 కోసం భారీగా 150 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ సినిమాను 2025 ఆగస్టులో మధ్యలోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే బాలీవుడ్ నుంచి ‘వార్ 2’ కూడా 2025 ఆగస్టు 14న విడుదల కాబోతుంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో ఈ సినిమా పైన తెలుగులో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వార్ ఫ్రాంచైజ్ బాలీవుడ్ లో పాపులర్ కాగా ఈసారి ఎన్టీఆర్ కలవడంతో సౌత్ ఇండియాలో కూడా హైప్ క్రియేట్ అవుతోంది.
అయితే రెండు సినిమాలు ఒకే టైమ్ లో విడుదల కావడం వలన ఇబ్బందులు తప్పవు. రెండు చిత్రాల మొదటి టార్గెట్ అయితే ఒక్కటే. వీలైనంత వేగంగా 1000 కోట్ల క్లబ్ లో చేరాలని అనుకుంటున్నాయి. కానీ ఈ టార్గెట్ అందుకోవాలంటే విడుదల తేదీల విషయంలో నిర్మాతలు మరో నిర్ణయం తీసుకోవడం అత్యవసరం. వారం గ్యాప్ లో వచ్చినా కలెక్షన్ల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో రూపొందుతుండటంతో, కనీసం నాలుగు వారాల గ్యాప్ ఇచ్చి విడుదల చేయడం మంచిదని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అలాగే థియేటర్స్ విషయంలో కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
This post was last modified on October 14, 2024 12:17 am
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…