వచ్చే ఏడాది కోసం బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు గట్టిగానే సిద్దమవుతున్నాయి. వాటిలో వార్ 2 – కాంతార ప్రీక్వెల్ చాలా ప్రత్యేకమైనవి. ఒకవైపు కన్నడ ఇండస్ట్రీకి గర్వకారణమైన కాంతార ప్రీక్వెల్ తో అంతకుమించి అనేలా రెడీ అవుతోంది. మరోవైపు హై వోల్టేజ్ కాంబినేషన్లో వస్తున్న వార్ 2పై అంచనాలు మాములుగా లేవు. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న వార్ 2 నార్త్ లోనే కాకుండా సౌత్ లో కూడా స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది.
ఇక కాంతార ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, తెలుగులో కూడా 60 కోట్ల వసూళ్లతో సత్తా చాటింది. ఇప్పుడు ఈ చిత్రానికి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న కాంతార: చాప్టర్ 1 కోసం భారీగా 150 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ సినిమాను 2025 ఆగస్టులో మధ్యలోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే బాలీవుడ్ నుంచి ‘వార్ 2’ కూడా 2025 ఆగస్టు 14న విడుదల కాబోతుంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో ఈ సినిమా పైన తెలుగులో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వార్ ఫ్రాంచైజ్ బాలీవుడ్ లో పాపులర్ కాగా ఈసారి ఎన్టీఆర్ కలవడంతో సౌత్ ఇండియాలో కూడా హైప్ క్రియేట్ అవుతోంది.
అయితే రెండు సినిమాలు ఒకే టైమ్ లో విడుదల కావడం వలన ఇబ్బందులు తప్పవు. రెండు చిత్రాల మొదటి టార్గెట్ అయితే ఒక్కటే. వీలైనంత వేగంగా 1000 కోట్ల క్లబ్ లో చేరాలని అనుకుంటున్నాయి. కానీ ఈ టార్గెట్ అందుకోవాలంటే విడుదల తేదీల విషయంలో నిర్మాతలు మరో నిర్ణయం తీసుకోవడం అత్యవసరం. వారం గ్యాప్ లో వచ్చినా కలెక్షన్ల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో రూపొందుతుండటంతో, కనీసం నాలుగు వారాల గ్యాప్ ఇచ్చి విడుదల చేయడం మంచిదని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అలాగే థియేటర్స్ విషయంలో కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
This post was last modified on October 14, 2024 12:17 am
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…