వచ్చే ఏడాది కోసం బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు గట్టిగానే సిద్దమవుతున్నాయి. వాటిలో వార్ 2 – కాంతార ప్రీక్వెల్ చాలా ప్రత్యేకమైనవి. ఒకవైపు కన్నడ ఇండస్ట్రీకి గర్వకారణమైన కాంతార ప్రీక్వెల్ తో అంతకుమించి అనేలా రెడీ అవుతోంది. మరోవైపు హై వోల్టేజ్ కాంబినేషన్లో వస్తున్న వార్ 2పై అంచనాలు మాములుగా లేవు. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న వార్ 2 నార్త్ లోనే కాకుండా సౌత్ లో కూడా స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది.
ఇక కాంతార ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, తెలుగులో కూడా 60 కోట్ల వసూళ్లతో సత్తా చాటింది. ఇప్పుడు ఈ చిత్రానికి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న కాంతార: చాప్టర్ 1 కోసం భారీగా 150 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ సినిమాను 2025 ఆగస్టులో మధ్యలోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే బాలీవుడ్ నుంచి ‘వార్ 2’ కూడా 2025 ఆగస్టు 14న విడుదల కాబోతుంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో ఈ సినిమా పైన తెలుగులో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వార్ ఫ్రాంచైజ్ బాలీవుడ్ లో పాపులర్ కాగా ఈసారి ఎన్టీఆర్ కలవడంతో సౌత్ ఇండియాలో కూడా హైప్ క్రియేట్ అవుతోంది.
అయితే రెండు సినిమాలు ఒకే టైమ్ లో విడుదల కావడం వలన ఇబ్బందులు తప్పవు. రెండు చిత్రాల మొదటి టార్గెట్ అయితే ఒక్కటే. వీలైనంత వేగంగా 1000 కోట్ల క్లబ్ లో చేరాలని అనుకుంటున్నాయి. కానీ ఈ టార్గెట్ అందుకోవాలంటే విడుదల తేదీల విషయంలో నిర్మాతలు మరో నిర్ణయం తీసుకోవడం అత్యవసరం. వారం గ్యాప్ లో వచ్చినా కలెక్షన్ల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో రూపొందుతుండటంతో, కనీసం నాలుగు వారాల గ్యాప్ ఇచ్చి విడుదల చేయడం మంచిదని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అలాగే థియేటర్స్ విషయంలో కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
This post was last modified on October 14, 2024 12:17 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…