ఒకప్పుడు స్టార్ హీరోలుగా వెలుగొందిన వారు ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్లుగా విలన్స్ గా మారుతున్న విషయం తెలిసిందే. సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసేందుకు కూడా ఏమాత్రం వెనుకాడటం లేదు. ఇక సౌత్ లో ఈమధ్య నార్త్ సీనియర్లు బాగానే బిజీ అవుతున్నారు. రెమ్యునరేషన్ లెక్క కూడా 7 నుంచి 10 కోట్ల మధ్యన ఉంటోంది. దీంతో మీడియం బడ్జెట్, బిగ్ బడ్జెట్ అని తేడా లేకుండా నచ్చిన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
ఆ మధ్య సంజయ్ దత్ సౌత్ లో బాగానే ట్రెండ్ అయ్యాడు. KGF తో విలన్ గా మంచి క్రేజ్ అందుకున్న అనంతరం ఒక్కసారిగా అవకాశాలు పెరిగాయి. వెంటనే లియో, డబుల్ ఇస్మార్ట్ ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆ సినిమాలు అంతగా క్లిక్కవ్వలేదు. ప్రస్తుతం రాజా సాబ్ లో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక సంజయ్ కు పోటీగా ఇప్పుడు యానిమాల్ విలన్ బాబీ డియోల్ వచ్చి చేరాడు. అతను ఇప్పుడు సౌత్ లో మంచి లైనప్ సెట్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ దశలో ఉంది. తమిళ్ లో కంగువా సినిమాలో కూడా కనిపించనున్నాడు. రీసెంట్ గా విజయ్ 69వ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేశాడు. అలాగే మరో తెలుగు సినిమాలో కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ విధంగా విలన్ కేటగిరిలో సంజూ భాయ్ ను మెల్లగా బాబీ డామినేట్ చేస్తున్నాడు. అంతే కాకుండా సంజయ్ దత్ రెమ్యునరేషన్ కంటే కూడా అతనిది తక్కువే. అలాగే కాస్త ప్రాజెక్టుకు తగ్గట్టుగా బాబీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. క్యారెక్టర్ నచ్చితే రెమ్యునరేషన్ తగ్గించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నిర్ణయం కూడా దర్శక నిర్మాతల ఫోకస్ అతనిపై పడేలా చేస్తోంది.
This post was last modified on October 13, 2024 4:11 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…