పుష్ప విలన్ గా మనకు పరిచయమయ్యాక ఫహద్ ఫాసిల్ కు తెలుగు ప్రేక్షకులతో మంచి బాండింగ్ ఏర్పడింది. అతని మలయాళ డబ్బింగ్ సినిమాలు వెతికి మరీ చూడటం మొదలుపెట్టారు. ఆ మధ్య వచ్చిన ఆవేశం తెలుగు అనువాదం చేయకపోయినా ఒరిజినల్ వెర్షన్ ని హైదరాబాద్ లో హౌస్ ఫుల్స్ చేసి మరీ చూశారు. అందుకే ఏదైనా కొత్త మూవీలో తను ఉన్నాడంటే బిజినెస్ పరంగా క్రేజ్ వస్తోంది. నిన్న రిలీజైన రజనీకాంత్ వేట్టయన్ లో దొంగతనాలు చేసి పోలీస్ ఇన్ఫార్మర్ గా మారిపోయే బ్యాటరీ పాత్రను బాగా పోషించాడు. కామెడీతో పాటు చివర్లో చిన్న ఎమోషన్ తో ఆకట్టుకున్నాడు.
అయితే ఇదంతా ఫహద్ ఫాసిల్ అభిమానులకు నచ్చడం లేదు. కేరళలో ఇంత మంచి ఫాలోయింగ్ పెట్టుకుని ఇతర భాషల్లో సపోర్టింగ్ ఆర్టిస్టు, విలన్ గా నటించడం ఏమిటని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మల్లువుడ్ లో పారితోషికాలు తక్కువ. మార్కెట్ విస్తరిస్తున్నా ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు భారీగా పెరగడం లేదు. కానీ టాలీవుడ్ లో అలా లేదు. పుష్ప కేసునే తీసుకుంటే ఒక్క ఫహద్ ఫాసిల్ కే ఏడు కోట్లకు పైగా ఇచ్చారనే టాక్ ఉంది. ఇంత మొత్తం అతను స్వరాష్ట్రంలో హీరోగా చేసినా ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఎవరైనా సహజంగానే ఇతర బాషల వైపు చూడటం సహజం.
తనకే కాదు ఇలాంటి పరిస్థితి గతంలో వేరే హీరోలకూ ఎదురయ్యింది. కన్నడలో మంచి స్టార్ డం ఉన్న టైగర్ ప్రభాకర్, దేవరాజ్ లాంటి వాళ్ళు చిరంజీవి, బాలకృష్ణకు విలన్లుగా నటించారు. తమిళంలో నెపోలియన్ ఫామ్ లో ఉన్నప్పుడు నాగార్జున హలో బ్రదర్ లో నటించాడు. విష్ణువర్ధన్, మోహన్ లాల్ లాంటి స్టార్లు క్రేజీ దర్శకులు అడిగినప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేశారు. ఇప్పుడు ఫాహద్ ఫాసిల్ చేస్తోంది కొత్తది కాదు కానీ అతనికంటూ ఉన్న ఫ్యాన్స్ అలా ఫీలవుతున్నారు. డిసెంబర్ 6 విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ లో ఎక్కువ సేపు పెర్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉండేలా సుకుమార్ డిజైన్ చేశాడట.
This post was last modified on October 11, 2024 1:40 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…