ఇంకో రెండు నెలల కంటే తక్కువ వ్యవధిలో విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ కి శకునాలన్నీ కలిసి వస్తున్నాయి. డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ కావాల్సిన గేమ్ ఛేంజర్ సంక్రాంతికి వాయిదా పడిందనే ప్రచారం బన్నీ ఫ్యాన్స్ కి కొత్త జోష్ ఇచ్చింది. ఎందుకంటే కేవలం రెండు వారాల గ్యాప్ లో రామ్ చరణ్ మూవీ అందులోనూ దిల్ రాజు నిర్మాతగా అంటే ఖచ్చితంగా థియేటర్ల సమస్య వస్తుంది. ఇప్పుడీ టాక్ నిజమైన నేపథ్యంలో ఇంతకన్నా గుడ్ న్యూస్ పుష్ప టీమ్ కు ఉండదు. సో గ్రౌండ్ ఫ్రీ అయిపోతుంది. జనవరి రెండో వారం దాకా చెప్పుకోదగ్గ పోటీ ఉండదు కాబట్టి వసూళ్లు దున్నేయొచ్చు.
ఇక మరో శకునం దేవరకొచ్చిన స్పందన. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోలకు ధారాళంగా అనుమతులు ఇచ్చేశాయి. ఇకపై ప్రతి ప్యాన్ ఇండియా మూవీకి ఈ సౌలభ్యం దక్కుతుంది. అలాంటప్పుడు దేవర కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న పుష్ప 2కి ఓపెనింగ్స్ మాములుగా ఉండవు. భీభత్సం జరుగుతుంది. పైగా ఎలాగూ ఆ డేట్ కి పుష్ప ఉందనే ఉద్దేశంతో ఇతర నిర్మాతలు ఎవరూ తమ సినిమాలను డిసెంబర్ మొదటి వారంలో ప్లాన్ చేసుకోలేదు. సో దేవర ఇప్పుడు ఏదైతే అడ్వాంటేజ్ తీసుకున్నాడో దానికి రెట్టింపుని పుష్పరాజ్ వాడుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
చేతిలో తక్కువ టైం ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను దర్శకుడు సుకుమార్ వేగవంతం చేశారు. ఎప్పుడూ లేనిది ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ లాక్ అయిపోయిందని మైత్రి లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ప్రకటించడం చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో డేట్ మిస్ కామనే సంకేతం ఇవ్వడం కోసమేనని అర్థం చేసుకోవచ్చు. సెకండాఫ్ లో వచ్చే ఐటెం సాంగ్ ని ఈ నెలాఖరు లేదా నవంబర్ మొదటి వారంలో షూట్ చేయబోతున్నారు. సమంతా స్థానంలో ఎవరు నర్తిస్తారనేది ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం మూడు యూనిట్లతో పని జరుగుతోంది. ఫహద్ ఫాసిల్ కు సంబంధించిన ఎపిసోడ్లను ఈ షెడ్యూల్ లోనే పూర్తి చేయబోతున్నారు.
This post was last modified on October 9, 2024 6:28 pm
కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న జమిలి ఎన్నికలకు ఏపీ సీఎం చంద్రబాబు జై కొట్టారు. తాము ఈ ఎన్నికలను స్వాగతిస్తున్నట్టు చెప్పారు.…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం మాట్లాడితే.. రెడ్ బుక్..…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని దేశ ప్రజలు భుజాలకు ఎత్తుకున్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. హరియాణాలో వరుసగా మూడోసారి బీజేపీ…
2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఏపీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ చేసిన కృషి ఫలించింది. ఆయన మంగళవారం బెంగళూరులో టాటా సన్స్ చైర్మన్…
ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక దాని తర్వాత..ఒకటి ఆయన సంచల న కామెంట్లతో…