ఇంకా షూటింగ్ మొదలుకాలేదు కానీ స్పిరిట్ మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కబీర్ సింగ్ రూపంలో అదిరిపోయే డెబ్యూ అందుకుని యానిమల్ బ్లాక్ బస్టర్ తో బాలీవుడ్ టాప్ లిస్టులోకి చేరిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఏకంగా ప్యాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ తో చేతులు కలపడంతో హైప్ ఏ స్థాయిలో పెరగబోతోందో వర్ణించడం కష్టం.
ప్రస్తుతం స్క్రిప్ట్ ని లాక్ చేసే పనిలో ఉన్న సందీప్ వంగా స్పిరిట్ సెట్స్ పైకి ఎప్పుడు తీసుకెళ్లాలనేది ఇంకా నిర్ణయించుకోలేదట. ముందు ది రాజా సాబ్, ఫౌజీలు పూర్తి చేశాకే తనకు పూర్తి కాల్ షీట్లు ఇవ్వాలని డార్లింగ్ ని అడిగినట్టు తెలిసింది.
దీనికి ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు చెబుతున్నారు. అయితే ఇక్కడితో స్పిరిట్ సంగతులు అయిపోలేదు. ఇందులో చాలా ముఖ్యమైన పాత్రల కోసం మోస్ట్ వాంటెడ్ క్యాస్టింగ్ ని సెట్ చేస్తున్నట్టు తెలిసింది. ఆల్రెడీ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ కోసం కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ తో సంప్రదింపులు జరిగిన వార్త ఉంది కానీ ఇంకా నిర్ధారణ కాలేదు.
ఇంకోవైపు ఒక పవర్ ఫుల్ రోల్ కోసం ఏకంగా చిరంజీవినే అడిగినట్టు లేటెస్ట్ గాసిప్. నిడివి తక్కువ, ఎక్కువ ఉన్న క్యామియోలు చేయడం మెగాస్టార్ కు కొత్త కాదు. కన్నడ సిపాయి, హాండ్స్ అప్, స్టైల్, బ్రూస్ లీ ఇలా చాలానే ఉన్నాయి.
ఒకవేళ నిజమైతే మాత్రం ఇదో మెంటల్ మాస్ కాంబినేషన్ అవుతుంది. ఎందుకంటే సందీప్ వంగా కరుడు గట్టిన మెగా ఫాన్. ఇది పలు సందర్భాల్లో తనే చెప్పుకున్నాడు. మాస్టర్ సినిమాలో తనకు ఇష్టమైన సీన్ లో చిరంజీవి వేసుకున్న షర్ట్ రంగు కూడా గుర్తు పెట్టుకునేంత అభిమానం అది.
అలాంటిది తన ఐకాన్ ని ఎలా చూపిస్తాడో వేరే చెప్పాలా. ఇదంతా ప్రస్తుతానికి గాసిప్పే. సందీప్ వంగా వీలైనంత లీక్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నాడు కానీ కొన్నయితే ఇలా ఏదో ఒక రూపంలో బయటికి వస్తున్నాయి. ఇంకా హీరోయిన్ ఎవరో ఖరారు కాని స్పిరిట్ కోసం మూడు వందల కోట్లకు పైగానే బడ్జెట్ పెడతారట.
This post was last modified on October 9, 2024 11:28 am
కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న జమిలి ఎన్నికలకు ఏపీ సీఎం చంద్రబాబు జై కొట్టారు. తాము ఈ ఎన్నికలను స్వాగతిస్తున్నట్టు చెప్పారు.…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం మాట్లాడితే.. రెడ్ బుక్..…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని దేశ ప్రజలు భుజాలకు ఎత్తుకున్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. హరియాణాలో వరుసగా మూడోసారి బీజేపీ…
2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఏపీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ చేసిన కృషి ఫలించింది. ఆయన మంగళవారం బెంగళూరులో టాటా సన్స్ చైర్మన్…
ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక దాని తర్వాత..ఒకటి ఆయన సంచల న కామెంట్లతో…